గురుక్షేత్ర సంగ్రామం
పీఆర్సీ జీవోలను వెంటనే రద్దుచేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైనది ప్రకటించాలంటూ ఉద్యోగులు నినదించారు. రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులు, పింఛనర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు....
పోలీసులకు, టీచర్లకు మధ్య తోపులాట
వేలమంది ఉపాధ్యాయులతో కలెక్టరేట్ ముట్టడి
మాయదారి పీఆర్సీ మాకొద్దంటూ మిన్నంటిన నినాదం
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం, న్యూస్టుడే, వన్టౌన్
విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద బైఠాయించి నినదిస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు
జీతాలు, భత్యాల్లో కోతలు పెట్టే ఈ మాయదారి పీఆర్సీ మాకొద్దంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులు గర్జించారు. ఫ్యాప్టో పిలుపు మేరకు గురువారం వేలాది మంది ఉపాధ్యాయులు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కలెక్టరేట్కు నలుమూలలా పోలీసు బలగాలు మోహరించి బారికేడ్లు, రోప్పార్టీలతో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అడ్డుకోవాలని ప్రయత్నించగా.. వారి వలయాన్ని ఛేదించి, పోలీసులను తోసుకుంటూ ఉపాధ్యాయులు కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు.
పీఆర్సీ జీవోలను వెంటనే రద్దుచేయాలని, అందరికీ ఆమోదయోగ్యమైనది ప్రకటించాలంటూ ఉద్యోగులు నినదించారు. రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులు, పింఛనర్ల జీవితాలతో ఆటలాడుకుంటున్న ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో కలెక్టరేట్ కూడలి పరిసరాలు దద్దరిల్లిపోయాయి.
కలెక్టరేట్ దారిలో అడ్డుకున్న పోలీసులను దాటుకొని పరుగులు తీస్తున్న ఉపాధ్యాయులు
ముట్టడిలో ఉద్రిక్తత..
పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కలెక్టరేట్ ముట్టడి నిమిత్తం ఉపాధ్యాయులు ఉదయమే జడ్పీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మరికొందరు కేజీహెచ్ వైపు వచ్చారు. కలెక్టరేట్ సమీపానికి వీరు రాకుండా అడ్డుకోవడానికి పోలీసులు కూడా భారీగానే వచ్చారు. అదనపు డీసీపీ ఆధ్వర్యంలో నలుగురు ఏసీపీలు, పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టరేట్ లోపలికి వచ్చే వారిని నిలువరించారు. ఈ క్రమంలో ఆర్డీఓ కిషోర్ను సైతం ఆపేశారు. ఓ పోలీసు అధికారి జోక్యం చేసుకోవడంతో ఆర్డీఓ లోపలకు వెళ్లగలిగారు.
* కలెక్టరేట్ వైపు వచ్చే మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ మళ్లించారు. బారికేడ్లు పెట్టి ఉద్యోగులు కలెక్టరేట్ వైపు వెళ్లకుండా మొదటిసారి అడ్డుపడ్డారు. శ్రద్ధా ఆసుపత్రి సమీపంలో మరోసారి రహదారికి అడ్డంగా తాళ్లు కట్టి అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొందరు కిందపడిపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉపాధ్యాయులు అక్కడే బైఠాయించి సుమారు 20 నిమిషాల ప్రతిఘటన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకుని కలెక్టరేట్ గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే కేజీహెచ్ మార్గం నుంచి కొంతమంది కలెక్టరేట్ గేటువద్దకు చేరుకొని ఆందోళన చేస్తుండటంతో..ఒక్కసారిగా కలెక్టరేట్ కూడలి కిక్కిరిసిపోయింది.
రెండున్నర గంటల పాటు ఆందోళన...
ఆర్డీఓ పెంచలకిషోర్కు వినతి పత్రం అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు
ఉదయం 10.30 గంటలకే కలెక్టరేట్ వద్దకు ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేరుకున్నారు. ఫ్యాప్టో జెండాలు, ప్లకార్డులు పట్టుకుని, పీఆర్సీని వ్యతిరేకిస్తూ గేటు ముందు బైఠాయించారు. ఉపాధ్యాయినులు, పెన్షనర్లు, సీపీఎస్ ఉద్యోగులు ఎక్కువ మంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ చేసిన నినాదాలతో 12.30 గంటల వరకు ఆ ప్రాంతమంతా మార్మోగింది. కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వాలి, గేటు తియ్యండని పోలీసులను కోరినా వారు అంగీకరించలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులంతా గేటును తోసి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య మరోసారి తోపులాట జరిగింది. కలెక్టర్ లేకపోవడంతో ఆర్డీవో పెంచల కిశోర్ గేటు వద్దకు వచ్చి ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వినతి స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ ముట్డడిని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలపై అన్ని సంఘాలతో సమావేశమై చర్చిస్తామన్నారు.
ముందస్తు అరెస్టులతో మొదలు..
కలెక్టరేట్కు వెళ్లకుండా ఉద్యోగులను అడ్డుకుంటున్న పోలీసులు
పీఆర్సీకి వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడిస్తామని ఉపాధ్యాయులు ముందే ప్రకటించారు. దీంతో పోలీసులు తెల్లవారుజాము నుంచే జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాల నేతల్లో కొందరిని ఆందోళనకు వెళ్లకుండా అడ్డుకున్నారు. నర్సీపట్నంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ను గృహ నిర్బంధం చేశారు. అనకాపల్లిలో ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు గణేష్ కుమార్లు ‘మేం అనారోగ్యంతో ఉన్నాం, ఎలాంటి ఆందోళనల్లోను పాల్గొనడం లేద’ని చెప్పినా పోలీసులు ఇంటి దగ్గరే పహారా కాశారు. పాడేరులో ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అంబిడి శ్యామ్సుందర్ను, అనకాపల్లిలో ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావును హౌస్ అరెస్టులు చేశారు.
జిల్లా పరిషత్ కార్యాలయం రోడ్డు నుంచి కలెక్టరేట్కు వెళుతూ..
రాష్ట్రస్థాయిలో పీఆర్సీ జేఏసీ సూచనలతో ఆందోళనలకు అంతా సిద్ధం కావాలని ఉద్యోగ, ఉపాధ్యాయులను నేతలు కోరారు. కలెక్టరేట్ నుంచి జగదాంబ కూడలి వరకు ఊరేగింపు వెళ్లి అక్కడ మానవ హారంగా ఏర్పడి మరోసారి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎంవి కృష్ణకుమార్, ఎ.ధర్మేంద్రరెడ్డి, కె.ఈశ్వర్రావు, కె.శ్యాముల్, కె.శ్రీనివాస్, బి.రామకృష్ణ, వై.సుధాకరరావు, డి.జోజిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదెక్కడి తీరు: పీఆర్సీ అంటే ఎక్కడైనా వేతనాలు పెరుగుతాయి. దీనికి విరుద్ధమైన జీఓలను జారీ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు ఆమోదయోగ్యంగా లేనటువంటి పీఆర్సీని అమలు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓలను తక్షణమే రద్దు చేయాలి. అప్పటి వరకు ఆందోళనను తీవ్రతరం చేస్తాం.
-టి.రామకృష్ణ, ఏపీటీఎఫ్ అధ్యక్షులు
అర్ధరాత్రి జీవోలు మాకొద్దు: ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. హెచ్ఆర్ఏ శ్లాబులు తగ్గించడం దారుణం. భత్యాలు తగ్గించడం వల్ల అందరూ తీవ్రంగా నష్టపోతారు. తక్షణమే హెచ్ఆర్ఏ పాత శ్లాబులను యథాతథంగా అమలు చేయాలి. అర్ధరాత్రి జారీ చేసిన జీఓలను తక్షణమే రద్దు చేయాలి.
- సిహెచ్.వెంకటేశ్వర్లు, ఫ్యాప్టో రాష్ట్ర నేత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?