vizag news : ఉక్కు ఉక్కిరిబిక్కిరి
పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం, ముడిసరకు ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం తాజాగా రూపాయి పతనం కారణంగా కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. కర్మాగారానికి అవసరమైన కోకింగ్ కోల్ను ఆస్ట్రేలియా
రూపాయి పతనంతో పెరగనున్న ఆర్థిక భారం
నానాటికీ ముదురుతున్న బొగ్గు సంక్షోభం
పడిపోతున్న ఉత్పత్తి
ఈనాడు, విశాఖపట్నం
పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం, ముడిసరకు ధరల పెరుగుదలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగారం తాజాగా రూపాయి పతనం కారణంగా కూడా ఉక్కిరిబిక్కిరవుతోంది. కర్మాగారానికి అవసరమైన కోకింగ్ కోల్ను ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రతిఏటా 50లక్షల టన్నుల వరకు కోకింగ్, పల్వరైజ్డ్ కోల్ను సంస్థ దిగుమతి చేసుకుంటుంది. మూడేళ్ల కిందట ఒక డాలర్ విలువ సుమారు రూ.68లు ఉండగా అది క్రమంగా రూ.80 సమీపానికి చేరడంతో విశాఖ ఉక్కుపై అదనపు భారం పడుతోంది. ఆస్ట్రేలియాలో కోకింగ్ కోల్ ధరలు కూడా ఇటీవలికాలంలో పెరగడంతోపాటు రూపాయి పతనం కూడా దానికి తోడవడంతో సంస్థపై పడే ఆర్థిక భారం భారీగా ఉంటోంది.
రూపాయి పతనం కారణంగా పడే ప్రభావాన్ని తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో అధికారులు ఒకింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సివస్తోంది.
బొగ్గు కొరతకు అద్దంపట్టిన సీఎండీ వ్యాఖ్యలు
‘నా పని సమయంలో సగకాలం పాటు కర్మాగారానికి అవసరమైన బొగ్గును ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపైనే ఆలోచించాల్సి వస్తోంద’ని సంస్థ సీఎండీ అతుల్భట్ చేసిన వ్యాఖ్యలను బట్టి సంస్థను బొగ్గు కొరత ఎంతగా వేధిస్తోందో అర్థం చేసుకోవచ్చు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి జరిగితే రోజుకు సుమారు 15వేల టన్నుల కోకింగ్ కోల్ అవసరం అవుతుంది. ఒకప్పుడు రోజుకు 20వేల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసిన అధికారులు ఇటీవలి కాలంలో పలు రకాల కారణాలు చూపుతూ ఉత్పత్తిని క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు పదివేల టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది.
రైల్వేరేక్లకూ కొరతే....
సంస్థకు అవసరమైన విద్యుత్తు తయారీకి వీలుగా అత్యధిక బాయిలర్ కోల్ను తాల్చేరు(మాహానది కోల్ఫీల్డ్స్) నుంచి తీసుకువస్తారు. వేసవి సమయంలో అక్కడి బొగ్గును దేశంలోని థర్మల్ విద్యుత్తు కర్మాగారాలకే రైల్వేలు రవాణా చేయడంతో దాని ప్రభావం ఉక్కుపై తీవ్రంగా పడింది. ప్రతి నెలా సుమారు 40 నుంచి 45 వరకు రావాల్సిన రైల్వే రేక్లు జూన్ నెలలో ఒక్కటీ రాలేదు. గత ఎనిమిది నెలలుగా రైల్వేరేక్లకు కూడా సంస్థ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
నిధుల కొరతతో సతమతం
నిధుల కొరత కారణంగా కూడా సంస్థ తీవ్రంగా సతమతం అవుతోంది. సంస్థ ఆర్జించిన లాభాలన్నీ పెరిగిన బొగ్గు ధరల కారణంగా హరించుకుపోయాయి. ప్రస్తుతం తగినన్ని నిధులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. సంస్థ అవసరాలకు వీలుగా నిధులు సమకూర్చుకోవడానికి పలు మార్గాలను అన్వేషిస్తున్నారు. నిధుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోందని సీఎండీ వ్యాఖ్యానించడం తీవ్రతకు నిదర్శనం.
ఉత్పత్తిని తగ్గించుకుంటే దీర్ఘకాలంలో తీవ్ర నష్టాలు
రూపాయి పతనం, పెరిగిన కోకింగ్ కోల్ ధరలు, రైల్వే రేక్లు అందుబాటులో లేకపోవడం తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఉక్కు ఉత్పత్తిని తగ్గించేస్తున్నారు. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఇదే విధానం కొనసాగిస్తే మాత్రం విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయాలు గణనీయంగా తగ్గి తీవ్రమైన ఆర్థిక నష్టాలను మూటకట్టుకోవాల్సిన పెనుముప్పు పొంచి ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెయిల్లో విలీనమే తక్షణ పరిష్కారం
సెయిల్లో విలీనంగానీ, సంస్థకు కనీసం రూ.10వేల కోట్ల ఆర్థిక సాయంగానీ చేయాలని ఉక్కు అధికారుల సంఘం అధ్యక్షుడు కాటం ఎస్.ఎస్.చంద్రరావు, ప్రధాన కార్యదర్శి కె.వి.డి.ప్రసాద్ తెలిపారు. గతంలో ప్రధానులుగా విధులు నిర్వర్తించిన వాజ్పేయీ, పి.వి.నరసింహారావులు చేసినట్లు ఆర్థిక సాయం చేయాలన్నారు. ఆ మొత్తాల్ని కర్మాగారం సంక్షోభం నుంచి బయటపడిన తరువాత మళ్లీ తిరిగి తీర్చగలదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
[ 26-04-2024]
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
జగన్ బ్యాండేజీ సంగతి డాక్టర్లు చూసుకుంటారు: మంత్రి బొత్స
[ 26-04-2024]
విమర్శలు చేసేటప్పుడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంయమనం పాటించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. -
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య