logo

ఏ తల్లి కన్నబిడ్డో..!

అక్కయ్యపాలెం నందగిరినగర్‌ గెడ్డలో మగ శిశువు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నెలలు నిండిన శిశువు గెడ్డలో చెత్త సంచి పక్కన పడి ఉంది. అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు.

Updated : 03 Oct 2022 05:16 IST

గురుద్వారా, న్యూస్‌టుడే: అక్కయ్యపాలెం నందగిరినగర్‌ గెడ్డలో మగ శిశువు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. నెలలు నిండిన శిశువు గెడ్డలో చెత్త సంచి పక్కన పడి ఉంది. అటుగా వెళ్తున్న వ్యక్తులు గమనించి నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహం ఎలా వచ్చిందన్న అంశంపై ఆరా తీస్తున్నారు. హెచ్‌సీ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు 83090 92196 నంబరులో సంప్రదించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని