logo

జగన్‌ గురించి మాట్లాడే అర్హత లోకేశ్‌కు లేదు: మంత్రి రోజా

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజా పేర్కొన్నారు.

Updated : 29 Jan 2023 12:20 IST

రాజశ్యామల అమ్మవారి సన్నిధిలో మంత్రి రోజా

పెందుర్తి, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే అర్హత తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు లేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజా పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల్లో శనివారం పాల్గొన్న ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు. . చంద్రబాబు సైకో అయితే లోకేశ్‌ది ఐరెన్‌ లెగ్‌ అని ఎద్దేవా చేశారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులంతా రోడ్డుపైకి వచ్చారని వైకాపా పాలనలో నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారన్నారు. నిరుద్యోగులైన పవన్‌కల్యాణ్‌, లోకేశ్‌, ఆ పార్టీలో కొంత మంది ప్రస్తుతం రోడ్డుపైకి వచ్చారన్నారు. సామాజిక మాధ్యమాలు బలంగా ఉన్న నేటి రోజుల్లో అధికారం కోసం ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రజలు పిచ్చోళ్లు కాదని, సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ ఏం జరిగినా చూస్తున్నారన్నారు. తెదేపా హయాంలో కాల్‌మనీ, సెక్స్‌ రాకెట్పై ప్రశ్నించినందుకు ఏడాది పాటు నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారని గుర్తు చేశారు. అలాంటి వాళ్లు మహిళలు, వారి గౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.  జగన్‌ సీఎం అయ్యాక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, ఆర్టీసీని విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని