logo

ఉక్కు త్రిఫ్ట్‌ సొసైటీ టర్నోవర్‌.. రూ.387 కోట్లు

విశాఖ ఉక్కు త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ రూ.387 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉందని సొసైటీ కార్యవర్గం ఉపాధ్యక్షులు కె.ఆనందకుమార్‌ తెలిపారు.

Published : 31 Mar 2023 04:23 IST

సమావేశంలో పాల్గొన్న సొసైటీ సభ్యులు

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు త్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ రూ.387 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉందని సొసైటీ కార్యవర్గం ఉపాధ్యక్షులు కె.ఆనందకుమార్‌ తెలిపారు. గురువారం స్టీల్‌క్లబ్‌ ఆడిటోరియంలో నిర్వహించిన 57వ మహాజన సభలో ఆయన మాట్లాడారు. సంఘం గౌరవ సభ్యుల డిపాజిట్స్‌ త్రిఫ్ట్‌ ఫండ్‌, రిటైర్‌మెంట్‌ ఫండ్స్‌పై 80 శాతం సెక్యూరిటీ రుణం ఇవ్వడానికి, సూపర్‌ యాన్యుయేషన్‌ బెనిఫిట్‌ ఫండ్‌గా ఏడాదికి చెల్లిస్తున్న రూ.750లను రూ.850లుగా చెల్లించడానికి సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించినట్టు తెలిపారు. సొసైటీ కార్యదర్శి డి.శ్రీరామచంద్రమూర్తి, సభ్యులు డి.వి.వి.ఎస్‌.ఎన్‌.కొండరాజు, ఎం.వి.రమణ, కర్రి శ్రీనివాస్‌, జి.వి.రమేష్‌, వి.జి.మహీధర్‌, సీనియర్‌ మేనేజర్‌ కె.దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని