కూలిన కాల్వలు.. దెబ్బతిన్న రోడ్లు!
కూలిన మురుగు కాల్వలు.. దెబ్బతిన్న సీసీ రోడ్లు.. పనిచేయని బోరు మోటార్లతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు.
కాలనీలో మురుగు కాలువలు లేక నిలిచిపోయిన మురుగునీరు
భూపాలపల్లి, న్యూస్టుడే: కూలిన మురుగు కాల్వలు.. దెబ్బతిన్న సీసీ రోడ్లు.. పనిచేయని బోరు మోటార్లతో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్నగర్కాలనీ సమస్యలకు నిలయంగా మారింది. మిషన్ భగీరథ పైపులైన్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధాన రహదారి పక్కన తాగునీటి పైపులు పగిలిపోవటంతో తాగునీరు అప్పుడప్పుడు లీకేజీ అవుతున్నందున కాలనీ వాసులకు పూర్తి స్థాయిలో సరఫరా కావడం లేదు. కాలనీకి అతి సమీపంలో ఉపరితల గనితో పాటు కేటికే 6వ భూడర్భ గని తవ్వకాలు కొనసాగడంతో తాగునీటి బోర్లలో నీరు పూర్తిగా ఎండిపోయింది.
కాలనీ ముఖ్య కూడలి ప్రాంతంలో మురుగు కాల్వలు లేకపోవడంతో మురుగు, చెత్తచెదారం పేరుకుపోయి దుర్వాసనతో సతమతమవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు కాలనీవాసులు వాపోతున్నారు. దీంతో దోమలు, పందుల బెడద కారణంగా స్థానికులు రోగాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా నెలకొన్నాయి. కాలనీలో సుమారు 23 కుటుంబాల వరకు పూరి గుడిసెల్లోనే నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం మున్సిపాలిటీ పరిధిలోని వేశాలపల్లి, భాస్కర్గడ్డ ప్రాంతాల్లో నిర్మించిన రెండు పడుకగదుల ఇళ్లను కాలనీలోని అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్ర బీసీ సంక్షేమ కమిషనర్ కృష్ణమోహన్ కాలనీలో ఇంటింటా పరిశీలించి, కాలనీవాసుల సమస్యలు తెలుసుకుని, అదే రోజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఐదేళ్లు గడిచినా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాలనీలోనే చాలా మంది నిరుపేద కుటుంబాలకు చెందినవారే నివాసం ఉంటున్నారు.
మురుగు కాలువలే ప్రధాన సమస్య
- ఎండి.సయ్యద్ హుసేన్, కాలనీ వాసుడు
కాలనీలో మురుగు కాల్వల్లో మురుగు పేరుకపోయి దుర్వాసన వస్తోంది. దీంతో దోమలు, పందుల బెడద కారణంగా జనాలు రోగాల బారిన పడుతున్నా పాలకులు, సంబంధిత అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడటం లేదు. చాలా చోట్ల మురుగు కాల్వలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి.
సీసీ రోడ్లు నిర్మించాలి..
- బండారి రమేష్, కాలనీ వాసుడు
కాలనీలో సీసీ రోడ్లు పూర్తిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలనీకి అతి సమీపంలోనే పాత ఎర్రచెరువు శిఖం భూములు ఉన్నందున వర్షాకాలంలో కాలనీలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయి. కాలనీలో తాగునీటి సమస్య కూడా ఉంది. రెండు రోజులకు ఒకసారి నల్లా నీరు రావడంతో ప్రజలకు నీరు సరిపోవటం లేదు. అదనంగా రెండు చేతిపంపులు ఏర్పాటు చేయాలి. వేసవిలో కాలనీ ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.
సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తాం
- అవినాష్, మున్సిపాలిటీ కమిషనర్
కాలనీలో నెలకొన్న అన్ని సమస్యలు దశల వారీగా పరిష్కరిస్తాం. ప్రధానంగా తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా కొద్ది రోజుల క్రితమే తాగునీటి బోర్ మరమ్మతు చేయించి, కొత్త పైపులైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మురుగు కాల్వల్లో చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. నిధులు విడుదల కాగానే అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లను నిర్మిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం -
అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
[ 10-05-2024]
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. -
ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి
[ 10-05-2024]
ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. -
విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
[ 10-05-2024]
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. -
పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!
[ 10-05-2024]
నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. -
కాంగ్రెస్, భాజపా దొందూ దొందే..
[ 10-05-2024]
ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. -
భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం
[ 10-05-2024]
పరకాల, గీసుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. -
మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం
[ 10-05-2024]
విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’
[ 10-05-2024]
నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
దేశ సంపద అంబానీ, అదానీల చెంత..
[ 10-05-2024]
దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. -
మహిళలకు తోడూనీడ.. సఖి
[ 10-05-2024]
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. -
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. -
‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’
[ 10-05-2024]
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. -
కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
[ 10-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. -
శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 10-05-2024]
ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. -
సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
[ 10-05-2024]
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? -
హవాలా కేసులో ఇద్దరి అరెస్టు
[ 10-05-2024]
వరంగల్ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా