జిల్లాలో గంజాయి మాఫియా!!
నిషేధిత గంజాయి, గుడుంబా బెల్లం మానుకోటకు భారీగా చేరుకుంటోంది. నిఘా పెట్టి కట్టడి చేస్తున్న యంత్రాగానికి స్మగ్లర్లు సవాల్ విసురుతున్నారు.
యువతే లక్ష్యంగా విక్రయాలు.. ఇతర ప్రాంతాలకు రవాణా
ఇటీవల నెల్లికుదురు ఠాణా పరిధిలో అధికారులు పట్టుకున్న 150 కిలోల గంజాయి
ఈనాడు డిజిటల్, మహబూబాబాద్, న్యూస్టుడే, నెహ్రూసెంటర్: నిషేధిత గంజాయి, గుడుంబా బెల్లం మానుకోటకు భారీగా చేరుకుంటోంది. నిఘా పెట్టి కట్టడి చేస్తున్న యంత్రాగానికి స్మగ్లర్లు సవాల్ విసురుతున్నారు. పోలీసులు పట్టుకుంటున్నది కొద్దిగా ఉంటున్నా.. పెద్ద మొత్తంలో చేరాల్సిన చోటికి చేరుతున్నట్లు సమాచారం. పట్టణాల్లో, మండల కేంద్రాల్లోనూ యువతే లక్ష్యంగా విక్రయాలు కూడా చేపడతున్నట్లు వినికిడి. ఈ నెల 11న మహబూబాబాద్, నెల్లికుదురు మండలాలకు చెందిన ముగ్గురు యువకులు వ్యవసాయ పొలం వద్ద భద్రపరిచిన 150 కిలోల గంజాయిని హైదరాబాద్కు తీసుకెళ్తుండగా నెల్లికుదురు పోలీసులు పట్టుకున్నారు. తాజాగా తొర్రూరులో ద్విచక్ర వాహనంపై రెండు కిలోల గంజాయిని తరలిస్తున్న యువకులు పోలీసులకు పట్టుబడ్డారు. ఇక్కడే కాకుండా వివిధ జిల్లాల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ గంజాయి స్మగ్లర్లు పట్టుబడితే అందులోనూ జిల్లాకు చెందిన వారే ఉంటుండడం గమానర్హం. కాగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి భారీగా దిగుమతి చేసుకొని అమ్మకాలు చేయడంతో పాటు ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. అడ్డుకట్టు వేయడానికి పోలీసులకు ఒక పరీక్షగా మారింది.
సిగరెట్లు విక్రయం
మత్తు కలిగించే ఈ గంజాయిని మహబూబాబాద్, తొర్రూరు, కురవి, డోర్నకల్, మరిపెడ, నర్సింహులపేట ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ రూపకంగానే కాకుండా మహబూబాబాద్ పట్టణంలో సిగరెట్లలోనూ గంజాయిని పెట్టి అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. రూ.250కి ఒక్కటి చొప్పున..తొర్రూరు పట్టణ ప్రాంతంలోనూ రూ.50 నుంచి రూ. 150 చొప్పున ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు వినికిడి. ఈ దందా అంతా శివారు ప్రాంతాల్లోనే కొనసాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సుమారు నెల రోజుల కిందట మానుకోటలో ఓ యువకుడు గంజాయి సిగిరెట్ తాగి తాను ఉంటున్న కాలనీల్లో హంగామా సృష్టించడంతో ఆ ప్రాంతవాసులు డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ విషయంలో బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు.
ఎక్కడి నుంచి వస్తుందంటే
జిల్లాకు చెందిన గంజాయి రవాణాదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతూరు, సీలేరుతో పాటు రాష్ట్ర సరిహద్దులోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో తెచ్చి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు కార్లు, ఆటో, ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన వారు ప్రస్తుతం ద్విచక్ర వాహనాల ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా జిల్లాలోకి చేర్చుతున్నట్లు తెలిసింది. మరిపెడ ప్రాంతం నుంచి ఎక్కువగా సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఆ సరకును పొలాలు, అటవీ ప్రాంతాలున్న చోట్ల భద్రపరిచి ఫోన్ల ద్వారా ఆర్డర్లు తీసుకొని రాష్ట్ర రాజధాని ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లు తెలిసింది.
అనర్థాలపై అవగాహన కల్పిస్తూ..
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న పట్టుబడుతున్న వారిలో ఎక్కువ శాతం యువతనే ఉంటుంది. పోలీసులు పాత నేరగాళ్లను గుర్తించి మరోసారి గంజాయి క్రయవిక్రయాలు చేయకూదంటూ..వాటి కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా వ్యాపారానికి తమ పంథాను మార్చుకున్నట్లు తెలిసింది.
ప్రత్యేక నిఘా పెట్టాం
రమణబాబు, డీఎస్పీ, మహబూబాబాద్
గంజాయి రవాణాపై నిఘా తీవ్రం చేశాం. రవాణాదారులపై చర్యలు తీసుకుంటున్నాం. అమ్మినా..నిల్వ ఉంచినా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. యువతను మత్తు నుంచి దూరం చేసేందుకు గ్రామాల్లో కళాజాత ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ ప్రచారంలో అపశ్రుతి.. కారు బోల్తాపడి పార్టీ నాయకురాలి దుర్మరణం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం చేసేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం -
అవినీతిపరుల అడ్డా కాంగ్రెస్
[ 10-05-2024]
దోపిడీలో కాంగ్రెస్ నెంబర్వన్గా మారిందని.. అవినీతి, కుటుంబ పాలనలో కూరుకుపోయిన ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో వాతలు పెట్టాల్సిన అవసరం ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధ్వజమెత్తారు. -
ఐటీడీఏలు ఎదగాలి.. గిరిజనం మురవాలి
[ 10-05-2024]
ఐటీడీఏ.. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ. కొన్నేళ్లుగా గాడితప్పింది. వీటి ఫలాలు గిరి పుత్రులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. ఇప్పుడు పూర్వవైభవం చూడాలని గిరిపుత్రులు ఆశిస్తున్నారు. -
విదేశాల్లో ఓటుకు పట్టం.. వేయకుంటే ఊరుకోదు చట్టం!
[ 10-05-2024]
దేశం ప్రగతి దిశగా సాగాలంటే సమర్థులనే పాలకులుగా ఎన్నుకోవాలి. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటే సుపరిపాలన అందించే ప్రభుత్వం ఏర్పాటవుతుంది. -
పైపైన పూడికతీత..ఇలాగైతే ముంచుతుంది నాలా!
[ 10-05-2024]
నగరంలో నాలాల పూడికతీత పనులు పైపైన జరుగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో అడుగు భాగంలో పేరుకుపోయిన మట్టి(సిల్ట్), ఇతర వ్యర్థాలు ముట్టుకోవడం లేదు. -
కాంగ్రెస్, భాజపా దొందూ దొందే..
[ 10-05-2024]
ఇన్నాళ్లు దేశాన్ని పాలించిన జాతీయ పార్టీలు పేదలకు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకతలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆరోపించారు. -
ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. -
భారాస హయాంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం
[ 10-05-2024]
పరకాల, గీసుకొండ, న్యూస్టుడే: రాష్ట్రంలో ముస్లింలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ భారాస అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. -
మరో అయిదు బడుల్లో పీఎంశ్రీ శ్రీకారం
[ 10-05-2024]
విద్యార్థుల సంఖ్య, పాఠశాలల్లో మౌలిక వసతులను గమనంలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈయేడాది జిల్లాలో మరో అయిదు పాఠశాలలను పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్) పథకానికి ఎంపిక చేసింది. -
‘ఏ పార్టీలో ఉన్నా.. క్రమశిక్షణకు కట్టుబడి ఉంటా’
[ 10-05-2024]
నేను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు కట్టుబడి కార్యకర్తలను కాపాడుకుంటానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
దేశ సంపద అంబానీ, అదానీల చెంత..
[ 10-05-2024]
దేశ సంపదను కేంద్రంలోని భాజపా అంబానీ, అదానీలకు దోచిపెట్టి, పన్నులను ప్రజలపై మోపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. -
మహిళలకు తోడూనీడ.. సఖి
[ 10-05-2024]
బాధిత బాలికలకు, మహిళలకు ఆశ్రయం కల్పిస్తూ అండగా ఉంటుంది ఈ సంస్థ. -
రాహుల్గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం
[ 10-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. -
‘దేవుళ్లపై ఒట్లు వేస్తే ఓట్లు రాలవు’
[ 10-05-2024]
ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళితే అక్కడ స్థానిక దేవుళ్ల మీద ఒట్టేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారని, కానీ ఈసారి ఓట్లు రాలవని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. -
కేయూ వీసీ పదవి ఎవరిని వరించునో..!
[ 10-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉప కులపతి, సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ మూడేళ్ల పదవీకాలం ఈ నెల 21తో ముగియనుంది. -
శ్రీభద్రకాళి కల్యాణ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 10-05-2024]
ఓరుగల్లు నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి దేవస్థానంలో భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. -
సిరా చుక్క పెట్టే వేలు లేకపోతే..?
[ 10-05-2024]
ఈ నెల 13న లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు ఓటు వేశావా? -
హవాలా కేసులో ఇద్దరి అరెస్టు
[ 10-05-2024]
వరంగల్ నగరంలో జరిగిన ఆర్థిక మోసం(హవాలా) కేసులో మట్టెవాడ ఠాణా పోలీసులు గురువారం ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా