పంచరత్నాలు.. వావ్ అనిపించారు..!
లక్ష్య సాధన నల్లేరు మీద నడక కాదు.. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ప్రయత్నాల వెనుకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెబుతున్నాయి.
సివిల్స్లో సత్తా చాటిన ఓరుగల్లు బిడ్డలు
లక్ష్య సాధన నల్లేరు మీద నడక కాదు.. కష్టాలు, కన్నీళ్లు, ఎన్నో ప్రయత్నాల వెనుకే గెలుపు దాగి ఉంటుందని ఎన్నో విజయ గాథలు మనకు చెబుతున్నాయి. అలాంటి ఒడుదొడుకులను దాటుకుని గెలిచే సత్తా ఓరుగల్లు యువతకు ఉందని మరోసారి నిరూపితమైంది.. మంగళవారం యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో ఓరుగల్లు గడ్డ నుంచి ఐదుగురు యువకిశోరాలు సత్తా చాటి జయకేతనం ఎగురవేశారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పమే వారి విజయానికి ఇంధనం. లక్ష్య ఛేదనలో ఎదురైన వైఫల్యాలను గెలుపునకు సోపానాలుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మక సివిల్స్లో మెరిశారు. ఈ క్రమంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ వారు చేసిన ప్రయాణం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆదర్శం..
- ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
మొదటి ప్రయత్నంలోనే..
జనగామ జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త మెరుగు సుజాత-సుధాకర్ దంపతుల కుమారుడు మెరుగు కౌశిక్ మొదటి ప్రయత్నంలోనే 82వ ర్యాంకు సాధించి ఐఏఎస్కు ఎంపికయ్యారు. ఈ విజయం పట్ల పట్టణానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు స్పందిస్తూ.. ‘మా అబ్బాయికి చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఎక్కువ. ఆ మేరకు మంచి విద్యను అందించాలనే బాధ్యతతో చదివించాం. దేశ స్థాయిలో ఇంతమంచి ర్యాంకు రావడమనేది స్వయంకృషికి దక్కిన విజయం. ఐఏఎస్ కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే ఏదైనా సాధించవచ్చు.. దీనికి మావాడే నిదర్శనం’ అని చెప్పారు.
- న్యూస్టుడే, జనగామ అర్బన్
తండ్రి మార్గదర్శకంలో..
హనుమకొండ హంటర్రోడ్లోని విద్యుత్నగర్కు చెందిన రావుల జయసింహారెడ్డి నాలుగో ప్రయత్నంలో 104 ర్యాంకు సాధించి ఐఏఎస్కు చేరువలోకి వచ్చారు. తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఏడీఆర్గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు రావుల జయసింహారెడ్డి ఇంటర్మీడియట్ నుంచే కలెక్టర్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతోనే ఎలాంటి శిక్షణ లేకుండా యూట్యూబ్, ఇంటర్నెట్లో సమాచారాన్ని సేకరించుకొని సివిల్స్కు సిద్ధమైనట్లు జయసింహారెడ్డి చెప్పారు.
-న్యూస్టుడే, వరంగల్ వ్యవసాయం
కష్టే ఫలి..
పేరు: కొయ్యడ ప్రణయ్ కుమార్, ర్యాంకు: 554
- ఎన్నో ప్రయత్నం: మొదటి ప్రయత్నంలో 2022లో 855 ర్యాంకు సాధించారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసు సాధించి ప్రస్తుతం లక్నోలో శిక్షణ పొందుతున్నారు.
- తల్లిదండ్రులు: ప్రభాకర్, లక్ష్మి
- చిరునామా: జనగామ జిల్లా రఘునాథపల్లి
- విద్యాభ్యాసం: నాగారం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేశారు
- నేపథ్యం: నిరుపేద కుటుంబం. ఉపాధి లేక హైదరాబాద్కు వలస వెళ్లారు.
తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలని పట్టుదలతో చదివా: ప్రణయ్కుమార్
మా తల్లిదండ్రులది కులాంతర ప్రేమ వివాహం. వారెన్నో అవమానాలు, బాధలను భరిస్తూ నన్ను చదివించారు. తలిదండ్రుల కష్టాలను తీర్చాలనే పట్టుదలతో, ఐఏఎస్ కావాలనే లక్ష్యంతోనే సివిల్స్లో విజయం సాధించాను. పేదరిక నిర్మూలన, సమాజంలో అసమానతల తొలగింపు, విద్యా, వైద్యానికి మొదటి ప్రాధాన్యం ఇస్తూ సేవలందిస్తాను.
రఘునాథపల్లి, న్యూస్టుడే
విజయమే లక్ష్యంగా..
పేరు: కోటే అనిల్కుమార్, ర్యాంకు: 764
- ఇండియన్ పోస్టల్ సర్వీసులో డిప్యూటీ డైరెక్టర్ (అకౌంట్్స)గా పనిచేస్తూనే తాజా ఫలితాల్లో 764 ర్యాంకు సాధించారు.
- కొటే కొమురయ్య (సోషల్వెల్ఫేర్ డిపార్ట్మెంటు విశ్రాంత ఉద్యోగి), సరోజన (గృహిణి)
- వరంగల్ శివనగర్ నాలుగు జెండాల ప్రాంతం
- శివనగర్లోని రెనాల్డ్స్ స్కూల్లో, ఆ తర్వాత ప్లాటినం జూబ్లి స్కూల్, ఇంటర్ విజయవాడ నారాయణలో పూర్తిచేసి, బీటెక్ వరంగల్ నిట్లో చదివారు. మొదట హైదరాబాద్ ఎల్బీనగర్లో ఎలక్ట్రిసిటీ శాఖలో ఏఈగా ఉద్యోగం రాగా, కొంతకాలం పనిచేసి మానేశారు. రైల్వేలో ఉద్యోగం వచ్చినా చేరకుండా సివిల్స్ సాధనే లక్ష్యంగా ముందుకు సాగారు.
- దంపతులకు ముగ్గురు కుమారులు, పెద్దకుమారుడు శ్రీకాంత్ బ్యాంకు మేనేజర్గా, రెండో కుమారుడు శ్రీధర్ జైలువార్డెన్గా పనిచేస్తుండగా, మూడో కుమారుడు అనిల్కుమార్ సివిల్స్లో సత్తా చాటారు.
ప్రస్తుతం అనిల్ కోల్కతాలో ఉన్నారు. తండ్రి కొమురయ్య మాట్లాడుతూ ఐఏఎస్కు బదులుగా ఐఆర్ఎస్ సర్వీసు వస్తుందన్న ఆశలో తమ కుమారుడున్నాడని తెలిపారు. తన బిడ్డకు పుస్తకాలంటే ఇష్టమని, చరవాణి కేవలం మాట్లాడేందుకే ఉపయోగిస్తారని చెప్పారు.
న్యూస్టుడే, శివనగర్
పట్టు వదలకుండా..
పేరు: సయింపు కిరణ్, ర్యాంకు: 568
- బీటెక్ పూర్తయిన తర్వాత 2018లో సివిల్స్ మొదటి ప్రయత్నం చేశారు. ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై కాలేదు. లోపాలను సవరించుకుంటూ మరింత పట్టుదలతో ప్రయత్నం కొనసాగించారు. 2019, 2020లో మెయిన్స్ వరకు 2021, 2022లో ఇంటర్వ్యూ వరకు హాజరై పోస్టల్ సర్వీస్లో ఉద్యోగం సాధించారు. ఉద్యోగం చేస్తూనే 2023లో చివరి ప్రయత్నం చేశారు. ఈ సారి విజయం కిరణ్ సొంతమైంది అత్యుత్తమ ర్యాంకు సాధించారు.
- ప్రభాకర్రావు, జయలక్ష్మి
- పెదనందిపాడు మండలం గొరిజవోలుగుంటపాలెం గ్రామం. దశాబ్దాల కిందటే తల్లిదండ్రులు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామానికి వలస వచ్చారు.
- వరంగల్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ ప్రైవేటు కళాశాలలో పూర్తి చేసి జేఈఈ అడ్వాన్స్డ్లో 1598 ర్యాంకు సాధించి దిల్లీ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు
- వ్యవసాయ కుటుంబం, సోదరి గిరిజ
నిరంతరం శ్రమిస్తే విజయం: కిరణ్
వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా సామాన్య ప్రజల కష్టాలను తీర్చడంలో మెరుగ్గా పని చేస్తాను.. అపజయాలతో కుంగిపోకుండా నిరంతరంగా శ్రమిస్తే విజయం సాధించవచ్చు.
న్యూస్టుడే, గీసుకొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బరి గీశారు.. గురి ఎవరిదో..!
[ 30-04-2024]
‘నోటాతో కలిపి ఒక్కో బ్యాలెట్ యూనిట్పై 16 మంది అభ్యర్థుల గుర్తులు కేటాయించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరంగల్ నియోజకవర్గం పరిధిలో మూడేసి బ్యాలెట్ యూనిట్లు, మహబూబాబాద్ పరిధిలో రెండేసి బ్యాలెట్ యూనిట్లను అధికారులు ఏర్పాటు చేయనున్నారు.’ -
పరీక్షే జీవితం కాదు.. తప్పితే మళ్లీ రాద్దాం!
[ 30-04-2024]
జీవితం అంటే మంచి-చెడు, తీపి-చేదు, ఆనందం-విషాదం. ఎంతటి వారికైనా ఆటుపోట్లు తప్పవు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైంది కాదనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పరీక్షల్లో తప్పిన వారు బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన కలిగించే విషయం. -
ఓటేయడానికైనా ఎలా రావాలి...!
[ 30-04-2024]
తలపైన గ్రాసం.. సంకలో పసికూన.. మరో చేతిని పట్టుకున్న చిన్నారి. పక్కనే పండు ముసలి తల్లితో వందల మందిని తోసుకుంటూ జనరల్ బోగిలోకి ఎక్కాలంటే ఎంత కష్టామో ఊహించండి. కష్టపడి ఎలాగోలా లోనికి వెళ్లినా కాలు పెట్ట వీలుండదు -
వరంగల్ ప్రధాన న్యాయమూర్తిగా నిర్మలాగీతాంబ
[ 30-04-2024]
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్లోని సిటీ స్మాల్ కాజెస్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘భారాస, భాజపాలు తోడు దొంగలు’
[ 30-04-2024]
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో భారాసలు తోడుదొంగ పార్టీలని, అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్న రెండు పార్టీలకు ఈ లోక్సభ ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెప్పాలని వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు -
‘లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూత’
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస దుకాణం మూతపడడం ఖాయమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. -
కొడకండ్లకు మినీ టెక్స్టైల్ పార్క్ తెస్తా
[ 30-04-2024]
చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. -
భువనగిరి బరిలో 39 మంది
[ 30-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎంత మంది అనేది తేలింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఎందరో అధికారులు వివరాలు వెల్లడించారు. -
నీటి కుంట.. తీరును తంటా!
[ 30-04-2024]
మానవుడి అవసరాలకు మించి అడవులను నరికివేయడంతో వాతావరణ సమతౌల్యం దెబ్బతిని కరవు పరిస్థితులు ఎదురవుతున్నాయి. -
‘ఈ’ సైకిల్ భళా..!
[ 30-04-2024]
కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపిస్తున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థి. మండలంలోని గోపాలపురానికి చెందిన కాముని హరీష్ గార్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూపులో ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. -
రాత్రిపూటా నిప్పుల కుంపటే!
[ 30-04-2024]
ములుగు జిల్లా భానుడి ప్రతాపానికి అట్టుడికిపోతోంది. రాత్రిపూట సాధారణంగా 25-30 డిగ్రీల మధ్య ఉండాల్సిన ఉష్ణోగ్రత 33.7-36.8 డిగ్రీలు నమోదవుతోంది -
రాతియుగం నాటి కంకణ శిల లభ్యం
[ 30-04-2024]
సుమారు ఆరు వేల ఏళ్ల నాటి అపురూపమైన కొత్త రాతియుగం పనిముట్టు కంకణ శిలను ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపురం గ్రామంలో కనుగొన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్, పరిశోధక సభ్యులు అహోబిలం కరుణాకర్, మహమ్మద్ నసీరుద్దీన్, చిడం రవి తెలిపారు -
మరోసారి మోదీ ప్రభుత్వం ఖాయం
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్లో సోమవారం నిర్వహించిన భాజపా జనసభ విజయవంతమైంది. ఎండను సైతం లెక్కచేయకుండా లోక్సభ నియోజకర్గం పరిధిలోని ప్రజలు భారీగా తరలొచ్చారు. -
అయిదుశాతం రాయితీకి చివరి అవకాశం
[ 30-04-2024]
ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపులకు వరంగల్ నగర ప్రజల నుంచి స్పందన లభించింది. సోమవారం సాయంత్రం వరకు సుమారు రూ.18 కోట్ల పైన వసూలైనట్లు బల్దియా పన్నుల విభాగం అధికారులు తెలిపారు. -
తాగునీటి ఎద్దడి రాకుండా అప్రమత్తత అవసరం
[ 30-04-2024]
వరంగల్ నగరంలో తాగునీటి ఎద్దడి రావొద్దు, రెండునెలల పాటు అధికారులందరూ అప్రమత్తంగా పనిచేయాలని ఐఏఎస్ అధికారి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వరంగల్ ఉమ్మడి జిల్లా నీటి సరఫరా ప్రత్యేకాధికారి బి.గోపి సూచించారు. -
కెప్టెన్ ఇంటి నుంచి ఖమ్మం ప్రచారానికి కేసీఆర్
[ 30-04-2024]
వరంగల్లో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించి హంటర్రోడ్లోని రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో బస చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి బయలుదేరి వెళ్లారు