రాజుకున్న రాజకీయం
షెడ్యూల్ విడుదల అనంతరం అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కసరత్తు చేస్తుంటే రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి తెర తీశాయి. అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను ఉపయోగించి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే కూటమి అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు
ప్రలోభాల వల వేస్తున్న వైకాపా
వ్యూహాత్మక ప్రచారంలో కూటమి అభ్యర్థులు
ఈనాడు, ఏలూరు: షెడ్యూల్ విడుదల అనంతరం అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు కసరత్తు చేస్తుంటే రాజకీయ పార్టీలు ప్రచార పర్వానికి తెర తీశాయి. అధికార పార్టీ సామదానభేద దండోపాయాలను ఉపయోగించి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే కూటమి అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారానికి మే-11 వరకు వ్యవధి ఉండటంతో నేతలు వ్యూహాలకు పదును పెడుతున్నారు.
వైకాపా రూటే సపరేటు.. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు వైకాపా నాయకులు తమ అధికార బలాన్ని వినియోగించుకుంటున్నారు. ఓటర్లను బతిమాలో భయపెట్టో తమ వైపు తిప్పుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో వాలంటీర్లు ఉండకూడదని ఎన్నికల సంఘం చెప్పినా ఉభయ జిల్లాల్లో అంతర్గత ప్రచారం మొత్తం వారి ద్వారానే జరుగుతోంది. ఇప్పటికే ఉంగుటూరు, ఆచంట, ఏలూరు ఇలా అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లు తమ పరిధిలోని 50 ఇళ్ల వాట్సాప్ గ్రూపుల్లో వైకాపాకే ఓటేయాలని లేదంటే ఫింఛను మొదలు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని భయపెడుతున్నారు. ఆ గ్రూపుల్లో వైకాపా నాయకులను కూడా చేర్చి రోజూ పార్టీకి సంబంధించిన పోస్టులు పెడుతూ జగన్కే ఓటేయాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పథకాల లబ్ధిపై ముద్రించిన కరపత్రాలను వాలంటీర్లు ఇంటింటికీ పంపిణీ చేసి వైకాపాకే ఓటేయాలని ప్రభావితం చేస్తున్నారు.
ఏలూరులో ఇటీవల ఓ వైకాపా నాయకుడు మహిళా దినోత్సవం రోజు డ్వాక్రా సీఆర్పీలకు సమావేశం నిర్వహించి. దాదాపు 200 మందికి ఒక్కోటి రూ.10వేలు విలువైన ఫోన్లు పంపిణీ చేశారు. వారి ద్వారా తమ డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలను ప్రభావితం చేసేందుకు ఇదో ఎత్తుగడ. ఇలా ఆచంట, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో దుస్తులు పంపిణీ చేయటం, విందు భోజనాలు పెట్టడం ద్వారా ఆకట్టుకుంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఓటగటం కంటే ఈ తరహా ప్రలోభాలతో ఓట్లు దండుకునేందుకే వైకాపా నాయకులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సమన్వయంతో ముందుకు.. అధికార పార్టీ తాయిలాల రాజకీయం చేస్తూ ఎన్నికల విందులతో ముందుకు వెళుతుంటే కూటమి అభ్యర్థులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెబుతూ జనాల్లోకి వెళుతున్నారు. పాదయాత్రలు చేపడుతూ ప్రజల్లోకి వెళుతున్నారు. సాయంత్రం వరకు ప్రచారంలో ఉంటూనే రాత్రిళ్లు ప్రధాన నాయకులు, వివిధ వర్గాలతో సమావేశమవుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో కూటమి నుంచి ఏ పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా మిగిలిన పార్టీల కార్యకర్తలు సైతం ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తమయినా సర్దుబాటు చేసుకుని ముందుకువెళుతున్నారు. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి ధర్మరాజుకు సీటు కేటాయించినా తెదేపా జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు కూటమి విజయానికి సహకరిస్తామని ప్రకటించి ప్రచారంలో పాల్గొంటున్నారు. తాడేపల్లిగూడెంలో సైతం సయోధ్య కుదిరింది. దీంతో అన్ని వర్గాలను కలుపుకొని ప్రచారంలో దూసుకుపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదం క్లబ్బులు కావాలా...? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా?: పవన్
[ 29-04-2024]
వైకాపా ఓటమి తథ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూదం ఆడుకునే క్లబ్బులు కావాలా? డీఎస్సీ నోటిఫికేషన్ కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. -
జనసేనలో చేరనున్న వైకాపా నాయకులు
[ 29-04-2024]
వైకాపాకు ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పలువురు రాజీనామా చేశారు. ఈ నెల 30 న కొయ్యలగూడెంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. -
జగనన్న బీమాయాజాలం
[ 29-04-2024]
అనుకోని విపత్తులో మృత్యువు కబళించినా..కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కు ప్రాణం విడిచినా..నేనున్నానంటూ ధీమానిచ్చే ప్రభుత్వ బీమాను వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. -
నేటి నుంచి పవన్ ప్రచార భేరి
[ 29-04-2024]
ఉమ్మడి పశ్చిమలో జనసేనాని పవన్కల్యాణ్ ప్రచార భేరి మోగించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తున్న వారాహి విజయభేరి కార్యక్రమంలో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. -
హామీలపై దగా.. ప్రశ్నించినందుకు పగ!
[ 29-04-2024]
‘దేవుని దయతో మన ప్రభుత్వం వచ్చిన వారంరోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తా.. ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తా’ అంటూ హామీలు గుప్పించి నమ్మించిన జగన్మోహన్రెడ్డి చివరకు మొండి చేయి చూపారు. -
ఆదుకోమంటే బాదేశారు
[ 29-04-2024]
పన్నుల బాదుడుతో రవాణా రంగాన్ని జగన్ ప్రభుత్వం కుదేలు చేసింది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం పడింది. -
ప్రలోభాల బటన్ నొక్కేశారు!
[ 29-04-2024]
ప్రతి కుటుంబానికి పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశాం.. ఇంటింటికీ సంక్షేమాన్ని చేరువ చేశాం.. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయంటూ నిన్నమొన్నటి వరకు బీరాలు పలికిన అధికార వైకాపా నాయకులు.. -
ఎన్నికల వేళ.. ఇసుకాసురుల తెగింపు
[ 29-04-2024]
ఎన్నికల వేళ ఇసుక ర్యాంపులు తెరుచుకుంటున్నాయి. కరుగోరుమిల్లి ర్యాంపు నుంచి ఆదివారం రవాణా మొదలైంది. గతంలో గ్రామస్థులు ర్యాంపునకు గండి కొట్టగా, నిర్వాహకులు దానిని మళ్లీ పూడ్చి బాట నిర్మించారు. -
వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు: కలెక్టర్
[ 29-04-2024]
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
కొల్లేరుపై అన్నీ కోతలే
[ 29-04-2024]
దేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు.. ప్రపంచంలోనే మరెక్కడా లేనన్ని పక్షి జాతులు.. అరుదైన మత్స్యజాతికి ఆలవాలం.. ఎన్నో సంస్కృతుల సమాహారం.. ద్వీపాలు, ద్వీపఖండాల మనోహరం కొల్లేరు. -
జె-బ్రాండ్లతో ప్రజారోగ్యం గుల్ల
[ 29-04-2024]
రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యం తాగి 30 వేల మంది కిడ్నీ, లివర్ వ్యాధుల బారిన పడ్డారు.. అనారోగ్యాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో అంచనాలకు అందని పరిస్థితి ఉందని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. -
‘వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నాశనం’
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని నరసాపురం పార్లమెంట్ భాజపా అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. -
ఉపాధి పనుల్లో పశువులు!
[ 29-04-2024]
‘ఉపాధి’ పని చేస్తున్న కూలీల చిత్రం ఉండాల్సిన చోట గేదెల చిత్రం అప్లోడ్ చేశారు.. జీలుగుమిల్లి మండల ఉపాధి ఉద్యోగులు. -
ఏటా కొలువులన్నావ్.. కన్నీటినే మిగిల్చావ్..!
[ 29-04-2024]
జగన్మోహన్రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. -
ఇంటింటికీ ప్రచార వాహనం....
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంటింటికీ రేషన్ పేరిట వైకాపా నాయకులు, అనుచరులకు ఎండీయూ వాహనాలను కట్టబెట్టిన విషయం తెలిసిందే. -
వైఎస్సార్ కుటుంబం అవినీతితో ఎదిగింది : జోగయ్య
[ 29-04-2024]
వైఎస్సార్ కుటుంబమంతా అవినీతిలోనే ఎదిగిందని మాజీ మంత్రి చేగొండి హరరామజోగయ్య అన్నారు. -
కొత్త ఓటర్లు 24,599 మంది
[ 29-04-2024]
ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి, ఓటు హక్కు లేనివారికి ఎన్నికల సంఘం చివరి అవకాశంగా ఏప్రిల్ 15 వరకూ గడువిచ్చింది. -
నేడు కొయ్యలగూడెంలో షర్మిల పర్యటన
[ 29-04-2024]
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన న్యాయయాత్ర సోమవారం కొయ్యలగూడెం చేరుకోనుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్