logo

శేషవాహనంపై శ్రీరాముడు

వాల్మీకిపురంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం రాత్రి శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు విహరించి భక్తలకు దర్శనమిచ్చారు.

Published : 16 Apr 2024 02:12 IST

న్యూస్‌టుడే, వాల్మీకిపురం: వాల్మీకిపురంలోని పట్టాభిరాముడి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం రాత్రి శేషవాహనంపై శాంతి స్వరూపుడైన శ్రీరాముడు విహరించి భక్తలకు దర్శనమిచ్చారు. ఉదయం సర్వభూపాల వాహనంపై సీతారాములు అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగారు. అనంతరం సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవలు నిర్వహించారు. బళ్లారి డ్రమ్స్‌, జానపద, కోలాట, తదితర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో మహిళలు పిండి దీపాలతో స్వాగతం పలికారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, తితిదే అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు, వాల్మీకి సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని