జగన్ మాట మిగిలిపోయి... టమాట రైతు చితికిపోయి!
‘మన ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రైతులకు అండగా ఉంటుంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
అయిదేళ్లలో అభివృద్ధికి నోచుకోని మార్కెట్
సంవత్సరానికి రూ.1.65 కోట్ల సెస్సు వసూలు
-న్యూస్టుడే, మదనపల్లె పట్టణం, గ్రామీణ
‘మన ప్రభుత్వం అధికారంలోకొచ్చాక రైతులకు అండగా ఉంటుంది. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మదనపల్లె ప్రాంతంలో రైతులు పండించే టమాటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత జగన్ తీసుకుంటాడు. ధరల్లేని పరిస్థితిలో ప్రభుత్వమే రైతులు పండించిన టమాటాలను కొనుగోలు చేసేందుకు వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయిస్తా. రైతులు ముఖంలో చిరునవ్వును చూడడమే మా ప్రభుత్వం లక్ష్యం. ’
-ఇదీ 2019లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లెకు ప్రతిపక్ష నేత హోదాలో వచ్చిన సీఎం జగన్ అన్న మాటలివి.
సీఎం జగన్ మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతనలేకుండా పోయింది. మదనపల్లె టమాట మార్కెట్ యార్డు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మార్కెట్. ఇక్కడ నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతుంటాయి. సీజన్లో (ఏప్రిల్ నుంచి జులై) రోజుకు 1,200 మెట్రిక్టన్నులకుపైగా రైతులు పండిస్తారు. ఇటువంటి మార్కెట్ యార్డులో గత ఐదేళ్లుగా వైకాపా పాలనలో ఒక్క అభివృద్ధి పని జరగలేదు. గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లలో టమాటకు ధర లేకపోవడంతో చాలా మంది రైతులు మండీల్లోనే వదిలేశారు. సీఎం జగన్ ప్రకటించిన ధరల స్థిరీకరణ నిధి రైతులను ఆదు కోలేకపోయింది. యార్డులో అభివృద్ధి పనులకు వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి విదల్చలేదు. ఇక్కడ ఏడాది రూ.2.65 కోట్లు సెస్సు వసూలు చేయాల్సి ఉండగా, గతేడాది రూ.1.67 కోట్లు వసూలు చేశారు. ఇంత ఆదాయం వస్తున్నా యార్డులో రైతులకు కనీస వసతులు కల్పించకపోవడం గమనార్హం. ప్రస్తుతం వేసవిలో రైతులు తాగేందుకు నీరు, సేద తీరేందుకు నీడ కూడా లేకపోవడం గమనార్హం.
తెదేపా ప్రభుత్వ హయాంలో టమాట మార్కెట్ యార్డులో 3.60 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కనీసం వీటిని వినియోగించుకుని రైతులకు సేవలందించ లేకపోయారు. దళారీ వ్యవస్థ నుంచి రైతులను రక్షించేందుకు అప్పటి తెదేపా ప్రభుత్వం ఈ-నామ్ పద్ధతిని తీసుకొచ్చింది. రైతుల వద్ద నుంచి నేరుగా టమాటాలను కొనుగోలు చేసే విధంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు సేదతీరేందుకు రైతు విశ్రాంతి భవనం నిర్మించారు. పలురకాల పండ్లను మాగపెట్టేందుకు కోల్డ్స్టోరేజి నిర్మించారు. రైతులకు తాగునీటిని అందించేందుకు ఓవర్హెడ్ట్యాంకు నిర్మించారు. వీటితో పాటు రైతులు మార్కెట్కు తెచ్చిన టమాటాలు ఎండకు, వానకు దెబ్బతినకుండా ఉండేందుకు షెడ్లు నిర్మించారు. ప్రస్తుతం వీటిని మాత్రమే వినియోగించుకుంటున్నారు. మిగిలినవన్నీ నిరుపయోగంగానే మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించండి
[ 29-04-2024]
మండలంలోని బ్రాహ్మణ పల్లెలో సోమవారం సాయంత్రం భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోశన్న కుమారుడు బొజ్జా కార్తీక్, భాజపా, తెదేపా, జనసేన శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
[ 29-04-2024]
దేవుడు ఎవరికీ అన్యాయం చేయడని, న్యాయం పక్షానే ఉంటాడని బ్రదర్ అనిల్ అన్నారు. ఒకరిపై ఒకరు అభాండాలు వేసుకోవడం సరికాదన్నారు. -
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
[ 29-04-2024]
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. -
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!
[ 29-04-2024]
కడప నగర కార్పొరేటర్లపై వైకాపా అభ్యర్థి అంజాద్బాషాకు అనుమానాలు వెంటాడుతున్నాయి. తన గెలుపునకు అంకితభావంతో సహాయపడడంలేదనే సంకోచంతో తరచూ వారితో భేటీకి ప్రయత్నిస్తున్నారు. -
రైల్వేలైను మారుస్తుంటే ఎంపీ మిథున్రెడ్డి ఏం చేశారు?
[ 29-04-2024]
కడప-బెంగళూరు రైల్వేలైను మారుస్తుంటే రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి చూస్తూ ఎందుకు ఉండిపోయారని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణంలోని ఓ కల్యాణమండపంలో ఆదివారం వివిధ వర్గాలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. -
పీహెచ్సీలన్నావ్... చేతులెత్తేశావ్..!
[ 29-04-2024]
‘గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తాం... పల్లె ముంగిట్లోకి అధునాతన వైద్య సేవలు విస్తరిస్తాం... ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నాం... ప్రతి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్ ప్రచారార్భాటంగా చేశారు. -
2న రాయచోటి, కడపలో చంద్రబాబు సభలు
[ 29-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. -
తెదేపా ప్రచార రథంపై దాడి
[ 29-04-2024]
తెదేపా కడప అసెంబ్లీ ప్రచార రథంపై అల్లరిమూక దాడికి పాల్పడింది. పార్టీ అభ్యర్థి మాధవి ప్రచార రథం కడప నగరంలోని 3వ డివిజన్ పరిధిలోని రామాంజనేయపురంలో ఆదివారం వెళ్తుండగా వైకాపాకు చెందిన కొందరు అడ్డుకున్నారు. -
అతివలే అధికం!
[ 29-04-2024]
జిల్లా అధికార యంత్రాంగం ఓటర్ల తుది జాబితా ప్రచురించింది. నాలుగు నెలల్లోనే 22 వేల మందికిపైగా ఓటర్లు పెరిగారు. మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,16,509 మంది ఓటర్లు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 22,557 మంది కొత్తగా నమోదైనవారితో కలిపి 16,39,066గా నమోదైంది. -
జగన్ సర్కారు నిర్వాకం... పంచాయతీలు నిర్వీర్యం..!
[ 29-04-2024]
గ్రామాల్లో అభివృద్ధే ధ్యేయమని చెప్పిన సీఎం జగన్ చివరకు పంచాయతీల్లోని నిధులను సైతం మళ్లించేసి పూర్తిగా నిర్వీర్యం చేశారు. సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చేశారు. -
మహిళలే అధికం!
[ 29-04-2024]
జిల్లాలో నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాను అధికారులు ప్రకటించారు. గత జనవరి 5న విడుదల చేసిన ముసాయిదా జాబితా కంటే తాజాగా ఓటర్లు పెరిగారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 14,24,629 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6,99,309 మంది పురుషులు, 7,25,193 మంది మహిళలు, 127 మంది ఇతరులు ఉన్నారు. -
నీరందించాలని నిరసన
[ 29-04-2024]
‘ఎన్నికలొస్తేనే నాయకులు ఇళ్ల వద్దకు వస్తారు.. ఆ తర్వాత అయిదేళ్లయినా కనిపించరు.. మూడు నెలలుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నాం... ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడు తున్నారు... అధికారులు పట్టించుకోరు.. -
పెద్దిరెడ్డి ప్రోద్బలంతోనే తెదేపా నేతలపై కేసులు
[ 29-04-2024]
మంత్రి పెద్డిరెడ్డి రామచంద్రారెడ్డి జోక్యంతోనే పోలీసులు తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు పేర్కొన్నారు. -
ఏపీసెట్కు 2,047 మంది హాజరు
[ 29-04-2024]
ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎలిజిబిలిటీ టెస్ట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. యోగివేమన విశ్వవిద్యాలయంతోపాటు మరో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. -
దళితులకు బురిడీ.. జగనన్న దోపిడీ
[ 29-04-2024]
జగనన్న మైకు అందుకుంటే చాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటుంటారు... ఆ మాటలు విన్న వారంతా ఆహా సీఎం గారికి మామీద ఎంత ప్రేమ అనుకున్నారు... తీరా గద్దెనెక్కిన తర్వాత వారి సంక్షేమంపై ఇనుప పాదం వేసి అణగదొక్కారు. -
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు
[ 29-04-2024]
వైకాపా పాలనలో గ్రామీణాభివృద్ధికి తూట్లు పడ్డాయని మదనపల్లె కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా విమర్శించారు. రామసముద్రం మండలం ఆర్.నడింపల్లె గ్రామ పంచాయతీలో తెదేపా మండల అధ్యక్షుడు విజయ్కుమార్గౌడు ఆధ్వర్యంలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM