మిల్లులకు నేరుగా ధాన్యం!
వరి పండించడం ఒక ఎత్తయితే.. చేతికివచ్చిన పంటను అమ్ముకోవడం మరో సవాలుగా మారుతోంది. టోకెన్కు ఎదురు చూపులు... వాహనాల్లో ధాన్యంతో రాత్రి, పగలు పడిగాపులు పడి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నిన్నమొన్నటి
నిబంధనలకు విరుద్ధంగా తరలింపు
ఈనాడు డిజిటల్, వికారాబాద్, న్యూస్టుడే, దౌల్తాబాద్
దౌల్తాబాద్లో వడ్లను మిల్లుకు తరలిస్తున్న రైతు
వరి పండించడం ఒక ఎత్తయితే.. చేతికివచ్చిన పంటను అమ్ముకోవడం మరో సవాలుగా మారుతోంది. టోకెన్కు ఎదురు చూపులు... వాహనాల్లో ధాన్యంతో రాత్రి, పగలు పడిగాపులు పడి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నిన్నమొన్నటి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం లెక్కవేయించి నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు ఇచ్చిన ట్రక్షీట్ను కొనుగోలు కేంద్రాల సిబ్బందికి అందిస్తున్నారు. దీంతో రైతులకు కొంత వరకు ఇబ్బందులు తీరుతున్నా, ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వేధింపులు తగ్గుతున్నాయి
ఇలా చేయడం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తొలుగుతున్నాయని, కోతల పేరుతో వేధింపులు తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ధాన్యంలో తేమ శాతం ఉంటే ఎంత కోత విధిస్తారనేది రైతుకే నేరుగా తెలిసిపోతోంది. గతంలో మిల్లులకు పంపించడం, లారీలో ఏ ఒక్కరి ధాన్యంలో తాలు ఉన్నా, తేమ ఉన్నా దాని ప్రభావం లారీలోని అన్ని బస్తాలపైనా కనిపించేది. దీంతో రైతుకు బిల్లు చేతికి వచ్చేంత వరకు ఎన్ని డబ్బులు వస్తాయనేది అంతుచిక్కేది కాదు. ప్రస్తుతం మిల్లరు ఇచ్చిన ట్రక్షీట్ ఆధారంగా నేరుగా రైతు ఖాతాలకు డబ్బు జమ అవుతుంది. దీంతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, మిల్లర్లు చెప్పే తరుగు సమస్య తీరుతోందని, హమాలీ, కార్మికుల కూలీ డబ్బులు మిగులుతున్నాయని అంటున్నారు. కాని నేరుగా రైతులే మిల్లుకు తీసుకెళ్లడం వల్ల ఎక్కడ అక్రమాలు జరుగుతాయో అన్న భయం అధికారులను వెంటాడుతోంది. .
124 కొనుగోలు కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 1.11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దోమ, పరిగి, కుల్కచర్ల, యాలాల, బషీరాబాద్ మండలాల్లో అత్యధికంగా సాగైంది. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయన్నది అధికారుల అంచనా. వాటికి అనుగుణంగా 124 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పనిఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో రైతులకు వ్యవసాయ శాఖాధికారుల నుంచి తేమ శాతం పత్రం తీసుకుని ధాన్యం బస్తాలను నేరుగా మిల్లులకు తరలించుకుంటున్నారు. అక్కడ తూకం వేశాక, ఎంత మొత్తంలో ధాన్యం ఉంటే దానికి సరిపడా బిల్లులను మిల్లుల యాజమాన్యం రైతులకు అందిస్తోంది. దాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో సిబ్బందికి అందిస్తున్నారు.
తరుగు, హమాలీ ఖర్చులు తగ్గాయి: నజీర్, కౌడీడు
మూడు ఎకరాల్లో వరి వేశా. మొత్తం 180 బస్తాల దిగుబడి వచ్చింది. గతంలో వడ్లు నింపుకొని కల్లం, కొనుగోలు కేంద్రం వద్ద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం నేరుగా పెద్ద కాంటాపై వేస్తున్నాం. అక్కడి నుంచి మిల్లుకు తరలిస్తున్నాం. దీంతో హమాలీ, కూలీల ఖర్చులు మిగులుతున్నాయి. అంతా సక్రమంగా ఉంటే ఒక బస్తాకు ఒకటిన్నర కేజీ తరుగు తీస్తున్నారు. గతంలో ఆరు కిలోల వరకు తరుగు తీసేవారు. ఈ పద్ధతి బాగుంది.
ఎవరి ఖర్చు వారిదే: వెంకటప్ప, దౌల్తాబాద్
రెండు ఎకరాల వరికి 120 బస్తాల దిగుబడి వచ్చింది. గతంలో వడ్లు తూకం వేసి, కొనుగోలు కేంద్రంలో నిలువ చేసేవాళ్లం. అక్కడి నుంచి మిల్లరకు పంపించే వారు. అంత వరకు ధాన్యం బాధ్యత మాపైనే ఉండేది. ఇక లారీలో ఎక్కడైనా, ఒకటి రెండు బస్తాల ధాన్యంలో తŸరుగు ఎక్కువగా ఉంటే అందరిపైనా దాని ప్రభావం కనిపించేది. మీ వడ్లు నాణ్యతగా లేవని సంచికి నాలుగు కిలోల నుంచి ఆరు కిలోల తరుగు తీసేవారు. ప్రస్తుతం ఎవరి ధాన్యం వారిదే బాధ్యత. ఆరబెట్టుకుని వెళితే ఇబ్బంది ఉండదు. కూలీలు, హమాలీ ఖర్చులు తగ్గాయి.
రవాణా బాధ్యత నిర్వాహకులదే
రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి
కేంద్రాల్లో ధాన్యం విక్రయించాక వారి బాధ్యత తీరిపోతుంది. తేమ శాతం, తరుగు పరిశీలించి రైతులకు వే బిల్లు ఇస్తారు. అక్కడి నుంచి కేంద్రాల నిర్వాహకులదే పూర్తి బాధ]్యత. ఇక్కడి నుంచే లారీల్లో మిల్లులకు పంపిస్తారు. నేరుగా రైతులే మిల్లులకు తరలించడం నిబంధనలకు విరుద్ధం. నిర్వాహకులు అనుమతించడం సరికాదు. వారిపై చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాలను సందర్శించి పర్యవేక్షిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 26-04-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు