మిల్లులకు నేరుగా ధాన్యం!
వరి పండించడం ఒక ఎత్తయితే.. చేతికివచ్చిన పంటను అమ్ముకోవడం మరో సవాలుగా మారుతోంది. టోకెన్కు ఎదురు చూపులు... వాహనాల్లో ధాన్యంతో రాత్రి, పగలు పడిగాపులు పడి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నిన్నమొన్నటి
నిబంధనలకు విరుద్ధంగా తరలింపు
ఈనాడు డిజిటల్, వికారాబాద్, న్యూస్టుడే, దౌల్తాబాద్
దౌల్తాబాద్లో వడ్లను మిల్లుకు తరలిస్తున్న రైతు
వరి పండించడం ఒక ఎత్తయితే.. చేతికివచ్చిన పంటను అమ్ముకోవడం మరో సవాలుగా మారుతోంది. టోకెన్కు ఎదురు చూపులు... వాహనాల్లో ధాన్యంతో రాత్రి, పగలు పడిగాపులు పడి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నిన్నమొన్నటి వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం లెక్కవేయించి నేరుగా మిల్లులకు తరలిస్తున్నారు. మిల్లర్లు ఇచ్చిన ట్రక్షీట్ను కొనుగోలు కేంద్రాల సిబ్బందికి అందిస్తున్నారు. దీంతో రైతులకు కొంత వరకు ఇబ్బందులు తీరుతున్నా, ఈ విధానం నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వేధింపులు తగ్గుతున్నాయి
ఇలా చేయడం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు తొలుగుతున్నాయని, కోతల పేరుతో వేధింపులు తగ్గుతున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ధాన్యంలో తేమ శాతం ఉంటే ఎంత కోత విధిస్తారనేది రైతుకే నేరుగా తెలిసిపోతోంది. గతంలో మిల్లులకు పంపించడం, లారీలో ఏ ఒక్కరి ధాన్యంలో తాలు ఉన్నా, తేమ ఉన్నా దాని ప్రభావం లారీలోని అన్ని బస్తాలపైనా కనిపించేది. దీంతో రైతుకు బిల్లు చేతికి వచ్చేంత వరకు ఎన్ని డబ్బులు వస్తాయనేది అంతుచిక్కేది కాదు. ప్రస్తుతం మిల్లరు ఇచ్చిన ట్రక్షీట్ ఆధారంగా నేరుగా రైతు ఖాతాలకు డబ్బు జమ అవుతుంది. దీంతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది, మిల్లర్లు చెప్పే తరుగు సమస్య తీరుతోందని, హమాలీ, కార్మికుల కూలీ డబ్బులు మిగులుతున్నాయని అంటున్నారు. కాని నేరుగా రైతులే మిల్లుకు తీసుకెళ్లడం వల్ల ఎక్కడ అక్రమాలు జరుగుతాయో అన్న భయం అధికారులను వెంటాడుతోంది. .
124 కొనుగోలు కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా 1.11 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రధానంగా కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్పేట, దోమ, పరిగి, కుల్కచర్ల, యాలాల, బషీరాబాద్ మండలాల్లో అత్యధికంగా సాగైంది. 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయన్నది అధికారుల అంచనా. వాటికి అనుగుణంగా 124 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం పనిఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో రైతులకు వ్యవసాయ శాఖాధికారుల నుంచి తేమ శాతం పత్రం తీసుకుని ధాన్యం బస్తాలను నేరుగా మిల్లులకు తరలించుకుంటున్నారు. అక్కడ తూకం వేశాక, ఎంత మొత్తంలో ధాన్యం ఉంటే దానికి సరిపడా బిల్లులను మిల్లుల యాజమాన్యం రైతులకు అందిస్తోంది. దాన్ని తెచ్చి కొనుగోలు కేంద్రాల్లో సిబ్బందికి అందిస్తున్నారు.
తరుగు, హమాలీ ఖర్చులు తగ్గాయి: నజీర్, కౌడీడు
మూడు ఎకరాల్లో వరి వేశా. మొత్తం 180 బస్తాల దిగుబడి వచ్చింది. గతంలో వడ్లు నింపుకొని కల్లం, కొనుగోలు కేంద్రం వద్ద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం నేరుగా పెద్ద కాంటాపై వేస్తున్నాం. అక్కడి నుంచి మిల్లుకు తరలిస్తున్నాం. దీంతో హమాలీ, కూలీల ఖర్చులు మిగులుతున్నాయి. అంతా సక్రమంగా ఉంటే ఒక బస్తాకు ఒకటిన్నర కేజీ తరుగు తీస్తున్నారు. గతంలో ఆరు కిలోల వరకు తరుగు తీసేవారు. ఈ పద్ధతి బాగుంది.
ఎవరి ఖర్చు వారిదే: వెంకటప్ప, దౌల్తాబాద్
రెండు ఎకరాల వరికి 120 బస్తాల దిగుబడి వచ్చింది. గతంలో వడ్లు తూకం వేసి, కొనుగోలు కేంద్రంలో నిలువ చేసేవాళ్లం. అక్కడి నుంచి మిల్లరకు పంపించే వారు. అంత వరకు ధాన్యం బాధ్యత మాపైనే ఉండేది. ఇక లారీలో ఎక్కడైనా, ఒకటి రెండు బస్తాల ధాన్యంలో తŸరుగు ఎక్కువగా ఉంటే అందరిపైనా దాని ప్రభావం కనిపించేది. మీ వడ్లు నాణ్యతగా లేవని సంచికి నాలుగు కిలోల నుంచి ఆరు కిలోల తరుగు తీసేవారు. ప్రస్తుతం ఎవరి ధాన్యం వారిదే బాధ్యత. ఆరబెట్టుకుని వెళితే ఇబ్బంది ఉండదు. కూలీలు, హమాలీ ఖర్చులు తగ్గాయి.
రవాణా బాధ్యత నిర్వాహకులదే
రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల అధికారి
కేంద్రాల్లో ధాన్యం విక్రయించాక వారి బాధ్యత తీరిపోతుంది. తేమ శాతం, తరుగు పరిశీలించి రైతులకు వే బిల్లు ఇస్తారు. అక్కడి నుంచి కేంద్రాల నిర్వాహకులదే పూర్తి బాధ]్యత. ఇక్కడి నుంచే లారీల్లో మిల్లులకు పంపిస్తారు. నేరుగా రైతులే మిల్లులకు తరలించడం నిబంధనలకు విరుద్ధం. నిర్వాహకులు అనుమతించడం సరికాదు. వారిపై చర్యలు తీసుకుంటాం. కొనుగోలు కేంద్రాలను సందర్శించి పర్యవేక్షిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి
[ 06-05-2024]
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కారు ప్రమాదం ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. -
మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి
[ 06-05-2024]
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు సోమవారం సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. -
‘ఆఫ్టర్ 9’.. అశ్లీల నృత్యాలు
[ 06-05-2024]
వివిధ రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు నృత్యాలు చేయిస్తున్న పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి పెద్ద సంఖ్యలో యువతులు, కస్టమర్లు, పబ్ సంబంధీకులు కలిపి 172 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
కమలానికి ఆ‘షా’ కిరణం
[ 06-05-2024]
పరేడ్ మైదానంలో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రసంగం కమలం కేడర్కు జోష్నిచ్చింది. -
హోరెత్తిన కూడళ్లు.. కదిలొచ్చిన శ్రేణులు
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ నాయకులు నిర్వహిస్తున్న రోడ్షోలు...కార్నర్ మీటింగ్లు కార్యకర్తల్లో హుషారు నింపుతున్నాయి. -
ఆఖరి ఆదివారం.. నేతల సపరివారం
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారానికి ఆఖరి ఆదివారం.. వచ్చే శనివారం సాయంత్రమే ప్రచారానికి తెరపడుతున్న వేళ..వచ్చే ఆదివారం ఎక్కడా ప్రచారం చేయడానికి అవకాశం లేదు. -
ఆ నాలుగూ ఇక్కడే. అధికారులకు సవాలే
[ 06-05-2024]
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో అత్యధిక సంఖ్యలో ఓటర్లున్న నాలుగు నియోజకవర్గాలూ రాజధానిలోనే ఉండడం గమనార్హం. -
అగ్రనేతల తాకిడి.. రాజధానిలో సందడి
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడటంతో రాజధాని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలను అన్ని పార్టీల అగ్రనేతలు చుట్టేస్తున్నారు. -
రూల్స్ మీకే.. మాకు కాదు
[ 06-05-2024]
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద మాదాపూర్ ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్.. పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం వివాదాస్పదమైంది. -
వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలు
[ 06-05-2024]
జీహెచ్ఎంసీ, పోలీసు అధికారుల పరిశీలనలో హైదరాబాద్ జిల్లా పరిధిలో వెయ్యి సమస్యాత్మక ప్రాంతాలున్నట్లు లెక్క తేలింది. -
చేవెళ్లకు అంతర్జాతీయ గుర్తింపు
[ 06-05-2024]
‘‘చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం ఏర్పాటై పదిహేనేళ్లయింది. అప్పట్లో శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే ప్రారంభమైంది. -
మా పార్టీకి ప్రత్యర్థులే లేరు
[ 06-05-2024]
‘‘హైదరాబాద్లో సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నాం. వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాం. కొవిడ్ సమయంలో అన్నార్తులను అదుకున్నాం. నిస్సహాయులకు అండగా నిలబడ్డాం. మా ఆసుపత్రుల్లో ఉచితంగా సేవలందించాం. అందుకే మాకు ఓటువేయాలని అడుగుతున్నాం’’ -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 06-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. -
అబ్కీ బార్ మోదీ సర్కార్
[ 06-05-2024]
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అంబర్పేటలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో సికింద్రాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి జి.కిషన్రెడ్డి మాట్లాడారు. -
400..సీట్లు కాదు.. పెట్రోల్ ధర
[ 06-05-2024]
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
త్వరలో శంషాబాద్కు మెట్రో: రంజిత్రెడ్డి
[ 06-05-2024]
చేవెళ్ల లోక్సభ పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్లలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడారు. -
బస్తీ ఓటర్లపైనే అభ్యర్థుల ఆశలు
[ 06-05-2024]
గ్రేటర్లోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్తీ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. -
స్వచ్ఛ.. మోదీ కా పరివార్
[ 06-05-2024]
హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా బెంగళూరు నుంచి ‘మోదీ కా పరివార్’ బృందం వచ్చింది. -
సీఆర్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం
[ 06-05-2024]
పేదలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సీఆర్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఏఐజీ హాస్పిటల్స్ వైస్ఛైర్మన్ డాక్టర్ పీవీఎస్ రాజు అన్నారు. -
కాంగ్రెస్ హామీలకు గ్యారంటీ ఎవరు?
[ 06-05-2024]
లోక్సభ ఎన్నికల్లో డీకే అరుణ ఇస్తున్న హామీలకు ప్రధాని మోదీ గ్యారంటీ ఉన్నారని, మరి కాంగ్రెస్ ఇచ్చే హామీలకు ఎవరు గ్యారంటీ అని మాజీ మంత్రి, భాజపా జాతీయ కౌన్సిల్ సభ్యులు మర్రి శశిథర్రెడ్డి అన్నారు. -
మూడోసారీ మోదీయే ప్రధాని: భాజపా
[ 06-05-2024]
దేశంలో మరోసారీ ఎన్డీయే ప్రభుత్వమే రాబోతోంది. మూడోసారీ ప్రధాన మంత్రిగా మోదీ ప్రమాణం చేయబోతున్నారుని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. -
‘ఎంపీ రంజిత్రెడ్డి పెద్ద స్కాం మాస్టర్’
[ 06-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి స్కాం మాస్టర్ అని భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
భానుడి ఉగ్రం.. ప్రాణం భద్రం
[ 06-05-2024]
జిల్లాలో ఎండలు మండి పోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు పైబడి నమోదౌతున్నాయి. -
మోదీ పాలనకు చరమగీతం పాడాలి
[ 06-05-2024]
కేంద్రంలో ప్రధాని మోదీ నిరంకుశ పాలనకు ఈ పార్లమెంటు ఎన్నికల్లో చరమగీతం పాడాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు రాఘవులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
[ 06-05-2024]
అత్తాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందిరానగర్ చౌరస్తాలో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు మక్బూల్ అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. -
సీజ్ చేసిన నగదులో రూ.4.27 కోట్లు విడుదల
[ 06-05-2024]
ఎన్నికల నేపథ్యంలో ఆధారాల్లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలిస్తున్న ఘటనలపై 153 కేసులు నమోదు కాగా రూ.5,61,02,455 ఎన్ఫోర్స్మెంట్ బృందాలు స్వాధీనం చేసుకొని జిల్లా గ్రీవెన్స్ కమిటీ (డీజీసీ)కి సిఫార్సు చేశాయి.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి