పుడమికి తూట్లు...అక్రమార్కులకు రూ.కోట్లు
వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో సుమారు 2 వేల టిప్పర్ల మట్టిని రాత్రికి రాత్రే తరలించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తులపైన,
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
చూసీ చూడనట్లుగా అధికారులు
వికారాబాద్లో ఓ పొలంలో వేసిన మట్టి కుప్పలు
* వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లిలో సుమారు 2 వేల టిప్పర్ల మట్టిని రాత్రికి రాత్రే తరలించారు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. సదరు వ్యక్తులపైన, వాహనాలపైన చర్యలు తీసుకోవడానికి మాత్రం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తికి ఓ ప్రజా ప్రతినిధి అండదండలు మెండుగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.
* వికారాబాద్ మండలం పాతూరు గేటు సమీపంలో వరద కాల్వను పూర్తిగా మూసివేశారు. పక్కన పిల్ల కాలువను తీశారు. లోతట్టు ప్రాంతాలను వందల టిప్పర్ల మట్టితో పూడ్చివేశారు. ఇది ప్రధాన రహదారికి ఆనుకుని ఉండటంతో వచ్చిపోయే ప్రతి వ్యక్తికి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రెవెన్యూ, జలవనరుల శాఖాధికారులు మాత్రం తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
* దోమ మండలం దిర్సంపల్లిలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ, అసైన్మెంట్ భూముల్లో మట్టిని తోడి గండి చెరువు కుంటను సగ భాగం మూసివేశారని స్థానికులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు.
- ఈనాడు డిజిటల్,వికారాబాద్
‘మట్టే కదా’ అనుకుంటే ‘పొరపడినట్లే.’ అక్రమార్కులకు రూ.కోట్లు కురిపిస్తోంది. సాయంత్రమైతే చాలు జేసీబీలు, పెద్ద సైజు టిప్పర్లు, లారీలు పుడమి తల్లి గుండెలపై నర్తిస్తున్నాయి. కొండలను పిండిచేస్తున్నాయి. ప్రభుత్వ భూములు, కొండవాలు ప్రాంతాలు అనే తేడా లేకుండా అందిన మేరకు తవ్వేస్తున్నాయి.. రాత్రంతా అక్రమార్కులు ఎంపిక చేసుకున్న స్థలానికి మట్టిని తరలిస్తున్నారు. రూ.లక్షల విలువైన మట్టిని ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారు. వేకువజామున 3 గంటలకు అంతా నిశ్శబ్దం. అసలు అక్కడ ఏమీ జరగలేదన్నట్లు కనిపిస్తుంది. ఇదంతా అధికారులకు తెలియదనుకోవడం అమాయకత్వం. అధికార, అనుకూల పార్టీ నాయకుల అండదండలతో అధికారులు ఏమీ చేయలేరన్న నిర్లక్ష్యంతో యథేచ్ఛగా భూములను తవ్వేస్తున్నారు.
చీలాపూర్లో ట్రాక్టర్లో మట్టిని నింపుతున్న జేసీబీ
ఫిర్యాదు చేసినా పట్టించుకునేది ఎవరు
జిల్లా కేంద్రం వికారాబాద్ అయినా, మారుమూల ప్రాంతమైనా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం రూ.30 లక్షలకు తక్కువ పలకడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో వెంచర్లు గ్రామానికి కనీసం రెండు నుంచి ఐదు వరకు ఏర్పాటయ్యాయి. మరో వైపు ఉన్న పొలంలో వ్యవసాయ క్షేత్రం నిర్మించుకోవాలన్నా, అక్కడి వరకు వాహనాలు వెళ్లాలన్నా మట్టిదారులు అవసరం. దీనికోసం గుట్టలన్నీ గుల్ల చేస్తున్నారు.
* వికారాబాద్ పురపాలిక ప్రజలకు తాగునీటి ఆధారమైన శివారెడ్డిపేట్ చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టిఎల్)లో మట్టిని నింపుతున్నారు. ఈ విషయమై స్థానిక ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.
* వికారాబాద్ మండలం సిద్దులూరు గ్రామానికి రెండువైపులా వాగులపై వంతెనల నిర్మాణం కోసం మట్టి తరలించేందుకు అనుమతి తీసుకున్నారు. స్థానిక నేతల సాయంతో వంతెన పేరు చెప్పి ప్రైవేటు వెంచర్లకు పెద్దఎత్తున మట్టి తరలిస్తున్నారు.
* పూడూరు మండలం మన్నెగూడ సమీపంలోని ఓ వెంచరు కోసం సుమారు పది వేల టిప్పర్ల మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా రాత్రి వేళల్లో తరలించారు. మరోవైపు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న వాగును కప్పి, చిన్న కాల్వ తవ్వి విడిచిపెట్టారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముడుపులు మట్టినట్లు తెలుస్తోంది. ఇదే మండలం చీలాపూర్, పరిగి మండలం లింగంపల్లి, బసిరెడ్డిపల్లి, దోమ మండలం దిర్సంపల్లిల్లో, ఇతర గ్రామాలు, మోమిన్పేట్, ధారూర్, కుల్కచర్ల తాండూరు, ఇతర మండలాల్లో ఈ తరహా మట్టి దందా జోరుగా సాగుతోంది. ఖాళీ గుట్టలనూ వదలక ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఫలితంగా రూ.కోట్ల విలువైన మట్టి పోవడమే కాదు, రూ.వందల కోట్ల విలువైన భూములు సైతం పరాధీనమవుతున్నాయి.
డీల్ చేస్తే అంతా అయిపోయినట్లే
జిల్లాలో ఏ ప్రాంతంలో చూసినా మట్టి దందా జరుగుతోందంటే దాని వెనుక ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు, ప్రజా ప్రతినిధుల సహాయ, సహకారాలు పూర్తి స్థాయిలో కనిపిస్తున్నాయి. కొత్తగా వెంచరు వేయాలనుకునే వ్యక్తులు అధికారుల కంటే ముందు ప్రజా ప్రతినిధులను కలసి, డీల్ మాట్లాడుకుంటున్నారంటే పరిస్థితి ఏమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అనుమతులు ఉన్నా, లేకున్నా పనులు చకచకా జరిగిపోతున్నాయి. అధికారులు సైతం వాటికి అడ్డుచెప్పే ప్రయత్నం చేయడంలేదు. ఈ విషయంలో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కబ్జా చెరనుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
[ 26-04-2024]
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
[ 26-04-2024]
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
[ 26-04-2024]
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
[ 26-04-2024]
సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
నేతలు రోడ్డెక్కె.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇం‘ధనం ఏదమ్మా’?
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ ‘హాట్ ఠాణా’
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?