లాక్డౌన్ వేళ.. పెళ్లి కోసం ఎన్ని తిప్పలో!
కరోనా నేపథ్యంలో విధించిన ఈ లాక్డౌన్లో ఆఫీసులు, దుకాణాలే కాదు.. ఫంక్షన్హాల్స్ కూడా మూతపడ్డాయి. దీంతో అనేక కుటుంబాలు తమ ఇంట్లో వివాహాది శుభాకార్యాలను వాయిదా వేసుకున్నాయి. అయినా కొన్ని జంటలు మాత్రం వీడియోకాల్స్ వేదికగా డిజిటల్ వివాహాలు చేసుకుంటున్నాయి. కొందరు పోలీసులు అనుమతి తీసుకొని నిరాడంబరంగా
కరోనా నేపథ్యంలో విధించిన ఈ లాక్డౌన్లో ఆఫీసులు, దుకాణాలే కాదు.. ఫంక్షన్హాల్స్ కూడా మూతపడ్డాయి. దీంతో అనేక కుటుంబాలు తమ ఇంట్లో వివాహాది శుభాకార్యాలను వాయిదా వేసుకున్నాయి. అయినా కొన్ని జంటలు మాత్రం వీడియోకాల్స్ వేదికగా డిజిటల్ వివాహాలు చేసుకుంటున్నాయి. కొందరు పోలీసులు అనుమతి తీసుకొని నిరాడంబరంగా ఒకటవుతున్నారు. మరికొందరైతే.. లాక్డౌన్ను లెక్కచేయకుండా వివాహం కోసం సాహసాలు చేశారు. అందులో కొందరు విజయం సాధిస్తే.. మరికొందరు విఫలమయ్యారు. గత నెలలో జరిగిన కొన్ని వివాహాల సంగతులు ఒకసారి చూస్తే..
వివాహం కోసం అర్ధరాత్రి కోర్టును తెరిపించారు
హరియాణలోని రోహతక్కు చెందిన నిరంజన్ కశ్యప్కి ఓ లెర్నింగ్ యాప్ ద్వారా మెక్సికోకి చెందిన డానా జొహెరీ ఒలివెరోస్ క్రూజ్ అనే యువతి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో ప్రత్యేక వివాహ చట్టం ద్వారా ఈ ఏడాది వివాహం బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఈ మేరకు గత ఫిబ్రవరి 17న దరఖాస్తు చేసుకోగా.. నెల రోజుల నోటీసు పీరియడ్ ఇచ్చారు. అది పూర్తయి వివాహ ఏర్పాట్లు చేసుకుంటుండగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. వారి వివాహానికి బ్రేక్ పడింది. దీంతో నిరంజన్.. తన వివాహం జరిపించాలని కోరుతూ న్యాయవాది ద్వారా కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నాడు. మెక్సికో ఎంబసీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా పొందడంతో న్యాయమూర్తి వివాహం జరిపించడానికి ఒప్పుకొన్నారు. దీంతో ఏప్రిల్ 13న రాత్రి వేళ కోర్టు తలుపులు తెరిపించి మరీ న్యాయమూర్తి సమక్షంలో నిరంజన్.. డానా ఒక్కటయ్యారు.
పోలీసు జీపులో వరుడి ఎంట్రీ
దిల్లీకి చెందిన ఓ కుటుంబం తన కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా చేయాలనుకుంది. కానీ లాక్డౌన్ వల్ల వారి ఆశలు ఆవిరయ్యాయి. అయినా అనుకున్న ముహూర్తానికి(ఏప్రిల్ 25) వివాహం చేయాలని భావించారు. ఈ మేరకు ఆర్య సమాజ్లో నిరాడంబరంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. వధువు అప్పటికే ఆర్యసమాజ్కు చేరుకోగా.. ఆంక్షల దృష్ట్యా సొంత వాహనాలపై వెళ్లడానికి వరుడు కౌశల్ కుటుంబానికి సాధ్యపడలేదు. దీంతో కౌశల్ తండ్రి నరేశ్ అహ్లూవాలియా పోలీసులను సంప్రదించాడు. కేవలం కుటుంబసభ్యుల మధ్యనే వివాహం జరుపుతున్నామని తెలపడంతో పోలీసులు వారికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. పోలీసు జీపులో వరుడు కుటుంబాన్ని వివాహవేదిక వద్దకు తీసుకెళ్లడమే కాదు.. పెళ్లి తంతు పూర్తయ్యాక వరుడు, వధువును తిరిగి ఇంటి వద్ద దింపారు.
సైకిల్పై 100కి.మీ ఒక్కడిగా వెళ్లి.. జంటగా వచ్చాడు
ఉత్తర్ప్రదేశ్లోని హమీర్పుర్ జిల్లా పౌతియా గ్రామానికి చెందిన 23 ఏళ్ల కల్కు ప్రజాపతికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు ఐదు నెలల క్రితమే పొరుగు జిల్లాలోని పుతియా గ్రామానికి చెందిన రింకి అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 25న వివాహం. లాక్డౌన్ నేపథ్యంలో పెళ్లి అనుమతి కోసం కల్కు స్థానిక పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకున్నాడు. చివరి రోజు వరకు అనుమతి రాకపోవడంతో ఎలాగైనా వధువు ఊరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వివాహం రోజు ఉదయమే కల్కు మాస్కు ధరించి సైకిల్పై పుతియాకు బయలుదేరాడు. ఒక్కడే 100 కి.మీ ప్రయాణించి వివాహం సమయానికి గమ్యం చేరుకున్నాడు. స్థానిక గుడిలో రింకు తల్లిదండ్రులు కన్యాదానం చేయడంతో వెంటనే భార్యను వెంటబెట్టుకొని సైకిల్పైనే తిరిగి సొంతూరుకు వచ్చేశాడు.
‘‘వివాహం వాయిదా వేద్దామనుకుంటే మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు.. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. వధువు తల్లిదండ్రులు శుభలేఖలు కూడా పంచేశారు. లాక్డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. అందుకే ఒంటరిగా అంతదూరం వెళ్లి పెళ్లి చేసుకున్నా’’అని కల్కు చెప్పుకొచ్చాడు.
పోలీస్స్టేషనే కల్యాణమండపమైన వేళ
ఉత్తర్ప్రదేశ్లోని చాందౌలీ జిల్లా మాహుజీ గ్రామానికి చెందిన అనిల్కు.. ఘాజీపుర్ జిల్లాకు చెందిన జ్యోతితో ఏప్రిల్ 20న వివాహం జరపాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కువ మంది ఒక్కచోట ఉండరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఏం చేయాలో పాలుపోని వరుడు అనిల్ దీనా పోలీస్స్టేషన్ను ఆశ్రయించాడు. పోలీసులు ఇరు వర్గాల నుంచి ఐదుగురు చొప్పున మాత్రమే వస్తే వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తామని తెలిపారు. దీంతో ఇరు కుటుంబాలు దీనా పోలీస్స్టేషన్కు చేరుకున్నాయి. స్టేషన్ ఆవరణలో ఉన్న శివుడి గుడి ముందు.. పోలీసుల సమక్షంలో జ్యోతి, అనిల్ వివాహం జరిగింది.
పెళ్లి కోసం కష్టపడి వెళితే.. క్వారంటైన్కు పంపారు
సోనూ కుమార్ది ఉత్తరప్రదేశ్లోని నేపాల్ సరిహద్దుగా ఉన్న ఓ జిల్లా. ఉపాధి నిమిత్తం పంజాబ్లోని లుధియానాకి వలస వెళ్లాడు. 24ఏళ్ల సోనూకు పెద్దలు ఏప్రిల్ 15న వివాహం నిశ్చయించారు. లాక్డౌన్ వల్ల లుధియానాలోనే చిక్కుకుపోయిన సోనూ.. మరో మార్గం లేక మరో ఇద్దరు మిత్రులతో కలిసి స్వగ్రామానికి సైకిల్పై తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అలా రాత్రి, పగలూ సైకిల్ తొక్కుకుంటూ వారం రోజుల్లో 850 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరో 150 కిలోమీటర్లు వెళితే సొంతూరికి చేరుకునేవాడే. కానీ, సొంత జిల్లాలోకి ప్రవేశిస్తున్న సమయంలో సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. ప్రయాణ వివరాలు తెలుసుకున్న వారు.. ముందు జాగ్రత్తగా క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ అని తేలితే 14 రోజుల పర్యవేక్షణ తర్వాత ఇంటికి పంపుతామని తేల్చిచెప్పారు. అలా పెళ్లికోసం వెళ్లిన సోనూ క్వారంటైన్కు చేరుకున్నాడు.
పోలీసులు వరుడిని కాపాడారు.. దిగబెట్టారు
దిల్లీకి చెందిన భూపేంద్ర ఏప్రిల్ 27న వివాహం చేసుకోవడానికి పోలీసుల అనుమతి తీసుకున్నాడు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ రోజు తన కారులో వివాహవేదిక వద్దకు వెళ్తుండగా.. అతడి కారు నుంచి మంటలు చెలరేగాయి. లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు మంటలను గమనించి కారును ఆపి భూపేంద్రను బయటకు లాగారు. క్షణాల వ్యవధిలో మంటలకు కారు పూర్తిగా దగ్ధమైంది. వివాహం గురించి తెలుసుకున్న పోలీసులు వారి జీపులో భూపేంద్రను తీసుకెళ్లి వేదిక వద్ద దిగబెట్టారు. దీంతో అనుకున్న సమయానికి భూపేంద్ర వివాహమైంది.
అంబులెన్స్లో వెళ్లి.. ఆ తర్వాత పోలీసులకు చిక్కి..
ఉత్తర్ప్రదేశ్లోని ఖాతౌలికి చెందిన హజీ ఇస్రార్ తన కుమారుడికి ఘజియాబాద్ జిల్లాలోని దాస్నా ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం చేయాలని నిర్ణయించాడు. ఏప్రిల్ 28న మూహూర్తం పెట్టుకున్నారు. అయితే హజీ ఉంటున్న ఇస్లామ్ నగర్ కాలనీలో ఐదు కరోనా కేసులు బయటపడటంతో ఆ ప్రాంతాన్ని హాట్స్పాట్గా మార్చారు. బయటకు వెళ్లే వీలు లేకున్నా.. ఎట్టిపరిస్థితుల్లో వివాహం జరపాలని భావించాడు. దీంతో ఓ అంబులెన్స్ను మాట్లాడుకొని పెషేంట్లా నాటకమాడి కుమారుడితోసహా ఘజియాబాద్కు చేరుకున్నాడు. అక్కడ వివాహం జరిపించి వధువును తమ వెంట తీసుకొచ్చాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న హజీ పొరుగింటివాళ్లు పోలీసులకు సమాచారం అందించడంతో హజీ.. అతని కుమారుడు, కోడలితోపాటు అంబులెన్స్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెళ్లికి వెళ్లేందుకు విఫలయత్నం.. వరుడు సహా ఏడుగురు అరెస్టు
ఘజియాబాద్కు చెందిన తజుద్దీన్కు ఏప్రిల్ 13న వివాహం జరగాల్సి ఉంది. లాక్డౌన్ అమలు, పోలీసులు పహారా ఉండటంతో వారి కన్నుగప్పి మేరఠ్లోని వివాహ వేడుకకు వెళ్లాలని భావించారు. ఈ మేరకు వరుడు, అతడి బంధువులు ఆరుగురు అర్ధరాత్రి మేరఠ్కు వెళ్లేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిని అరెస్టు చేశారు.
శ్రీవారి ముందు పెళ్లనుకుంటే.. గరుత్మంతుడి ముందు జరిగింది
ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ జంట మార్చి 21న తిరుమల శ్రీవారి ముందు వివాహం చేసుకోవాలని భావించింది. ఈ మేరకు కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్నారు. అప్పటికే కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొండపైకి వెళ్లే రూట్లను తితిదే మూసివేసింది(లాక్డౌన్కు ముందు). పెళ్లి బృందం కొండపైకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అలిపిరి వద్ద అడ్డుకున్నారు. చేసేదేమి లేక అలిపిరిలోని గరుడ విగ్రహం వద్ద పోలీసుల సమక్షంలో ఆ జంట వివాహం చేసుకుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా