E-book reader : ఈ-బుక్ రీడర్ కళ్లజోడు వచ్చేస్తోంది.. ఎన్ని గంటలైనా ఏకాగ్రతగా చదువుకోవచ్చట!
వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ (vr headset) తరహాలో రూపొందించిన ఈ-బుక్ రీడర్ (E-book reader) కళ్లజోడు త్వరలో మార్కెట్లోకి రానుంది. అందులో ఎలాంటి ఫీచర్లున్నాయో తెలుసుకోండి.
(Image : solreader.com)
పుస్తకాల (Books) స్వరూపం రోజురోజుకీ మారిపోతోంది. సాంకేతికత (Technology) అభివృద్ధి చెందడంతో ఇటీవలి కాలంలో చాలా పుస్తకాలు పీడీఎఫ్ల రూపంలోకి వచ్చేశాయి. పీడీఎఫ్ (PDF) మాత్రమే కాకుండా ఈపీయూబీ, ఏజెడ్డబ్ల్యూ, హెచ్టీఎంల్, పీడీబీ, డాక్స్ ఇలా రకరకాల ఫార్మాట్లను కంప్యూటర్, ట్యాబ్, మొబైల్ ఫోన్ల ద్వారా చదివే అవకాశం పాఠకులకు కలిగింది. ప్రస్తుతం ఈ-బుక్ రీడర్లు (E-book reader) ఎక్కువ మంది ట్యాబ్లను వినియోగిస్తున్నారు. కళ్లపై ఒత్తిడి పడకుండా చదువుకునేందుకు అవి అనుకూలంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. అలాంటి పాఠకులను ఆకట్టుకునేందుకు కొత్తగా మార్కెట్లోకి ఈ-బుక్ రీడర్ కళ్లజోడు రాబోతోంది. దాని విశేషాలు తెలుసుకోండి.
ఏకాగ్రత కుదిరేలా..
సోల్ రీడర్ అనే కంపెనీ సరికొత్త ఈ-బుక్ రీడర్ను అభివృద్ధి చేసింది. ఈ పరికరం చూడటానికి చలువ కళ్లద్దాలను పోలి ఉంటుంది. ఒక వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ను ధరిస్తే అందులోని కంటెంట్లో ఎలా లీనమవుతామో ఈ-బుక్ రీడర్ కళ్లజోడు అలాంటి అనుభూతినే కలిగిస్తుందని కంపెనీ చెబుతోంది. పాఠకులు కిండిల్ వంటి ఈ-రీడర్లతో ఎక్కువ సేపు చదివేస్తున్నారు. మామూలు పుస్తకాల మాదిరిగానే అందులోని పేజీలను తిరగేస్తుంటారు. వాటిని చదువుతున్నప్పుడు కళ్ల మీద ఎలాంటి ఒత్తిడి పడదు. దానికి కారణం ఆ తెరల వెనకాల ఉన్న ఈ ఇంక్ డిస్ప్లే టెక్నాలజీ. కానీ, పరిసరాల కారణంగా మనసు పుస్తకంలో నుంచి బయటకు వెళ్తుంది. అలాంటి అవాంతరాలకు ఈ-బుక్ రీడర్ కళ్లజోడు అడ్డుకట్ట వేస్తుంది. ఈ పరికరం ధరిస్తే అక్షరాలు తప్ప మరేవీ కనిపించవు. దాంతో ఏకాగ్రతగా ఎంత సేపయినా చదువుకోవచ్చు. ఈ-బుక్ చదవాలంటే ట్యాబ్, మొబైల్ను చేతితో పట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, ఈ కళ్లజోడును కేవలం తలకు తగిలించుకుంటే సరిపోతుంది.
(Image : solreader.com)
కంటి చూపునకు తగ్గట్లుగా..
సోల్ రీడర్లో 1.3 ఇంచుల సైడ్ లిట్ ఇ ఇంక్ డిస్ప్లే రావడం వల్ల ఇది కళ్లపై ఒత్తిడి పడకుండా చూస్తుంది. ఆ డిస్ ప్లే 65,536 పిక్సెల్స్తో వస్తుంది. ఇందులో డయాప్టర్ సర్దుబాటు సదుపాయం ఉంది. ఆ డయాప్టర్ను వినియోగించుకుని దృష్టి లోపం ఉన్న వారు తమ చూపునకు తగినట్లుగా అక్షరాలను మార్చుకోవచ్చు. అంటే ప్రత్యేకంగా కళ్లద్దాలు, కాంటాక్ట్ లెన్సులు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు.
ఈ కళ్లజోడు 100 గ్రాముల బరువుంది. బ్లాక్ సన్ గ్లాసెస్ తరహాలో వీటి లుక్ డిజైన్ చేశారు. కూర్చుని లేదా పడుకొని చదువుకోవచ్చు. కంపెనీ ఇచ్చిన రిమోట్ను చేతిలో ఉంచుకొని.. బటన్లను నొక్కి కావాల్సిన పేజీ దగ్గర ఆపేయొచ్చు.
30 గంటలు వాడుకోవచ్చు
ఈ-బుక్ రీడర్లోని పేజీలు నల్లటి బ్యాక్గ్రౌండ్కు వ్యతిరేకంగా ప్రొజెక్ట్ అవుతాయి. దాంతో పాఠకుడికి మామూలు బుక్ చదువుతున్న అనుభూతి కలుగుతుంది. సోల్ రీడర్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. దాన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 30 గంటలపాటు వాడుకోవచ్చు. ఇందులో 60 ఎంబీ స్టోరేజ్ సామర్థ్యం ఇచ్చారు. హెడ్సెట్ను మొబైల్ యాప్ ద్వారా అనుసంధానించుకొని ఆ యాప్లోకి చదుకోవాలనుకునే ఫైళ్లను కాపీ చేసుకోవచ్చు. అందువల్ల స్టోరేజీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఇవి ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఒక్కోదాని ధర 350 డాలర్లు ఉంటుందని టెక్ వర్గాల సమాచారం.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా