మహారాష్ట్రలో ఒక్కరోజే 895మంది మృతి

మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మృత్యు ఘోష కొనసాగుతోంది. ఒక్కరోజే అక్కడ 895మంది మృతిచెందారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన...

Published : 27 Apr 2021 23:34 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ మృత్యు ఘోష కొనసాగుతోంది. ఒక్కరోజే అక్కడ 895మంది మృతిచెందారు. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 66,358 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2,62,54,737 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 44,10,085 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం 6,72,434 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఔరంగాబాద్‌ జిల్లాలో అత్యధికంగా గత 24 గంటల్లో 162 మంది మృతి చెందారు. అలాగే, నాసిక్‌ జిల్లాలో అత్యధికంగా 11,365 కొత్త కేసులు రాగా.. పుణెలో 9,078, నాగ్‌పూర్‌లో 6,895, ముంబయి 4,014, ఔరంగాబాద్‌లో 1468 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ముంబయి, ఠానే, పుణెలో 2,45,466 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని