397ఏళ్ల అనంతరం..ఆకాశంలో మరో అద్భుతం!
దాదాపు నాలుగు శతాబ్దాల సుదీర్ఘ తర్వాత ఆకాశంలో మరో అద్భుతం జరుగబోతోంది. ఈ నెల 21వ తేదీన గురు-శని గ్రహాలు అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి.
దగ్గరగా కనిపించనున్న గురు-శని గ్రహాలు
కోల్కతా: దాదాపు నాలుగు శతాబ్దాల సుదీర్ఘకాలం తర్వాత ఆకాశంలో మరో అద్భుతం జరుగబోతోంది. ఈ నెల 21వ తేదీన గురు-శని గ్రహాలు అతి దగ్గరగా చేరి అత్యంత ప్రకాశవంతంగా కనిపించనున్నాయి. 1623 తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీంతో ఈ అరుదైన సన్నివేశంపై ఆసక్తి నెలకొంది.
భూమినుంచి చూస్తే ఏవేని రెండు గ్రహాలు అతి దగ్గరగా చేరినట్లు కనిపించే దృశ్యాన్ని కంజక్షన్గా పిలుస్తారు. ఇలా గురు-శని గ్రహాలు కనిపించడాన్ని మాత్రం గ్రేట్ కంజక్షన్గా అభివర్ణిస్తారు. ప్రస్తుతం ఈ రెండు గ్రహాలు నిత్యం కొంతదగ్గరగా వస్తున్నాయి. భూమిపై నుంచి చూస్తోన్న మనకు సాయంత్రం సమయాల్లో ఇవి స్పష్టంగానే కనిపిస్తాయి. అయితే, డిసెంబర్ 21వ తేదీన మాత్రం అతి దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తాయి. అప్పుడు వీటి మధ్య దూరం దాదాపు 73.5కోట్ల కిలోమీటర్ల దూరం ఉండనున్నట్లు శాస్త్రవేత్తల అంచనా.
అయితే, ప్రతినెల చంద్రుడు(భూమికి ఉపగ్రహం)-అంగారకుడు, చంద్రుడు-గురు, చంద్రుడు-శని సహా ఇతర గ్రహాలు దగ్గరగా కనిపించడాన్ని చూస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఇలా చంద్రుని సహాయంతో గ్రహాలను గుర్తించే ప్రక్రియ కూడా ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది. మనం భూమిపై నుంచి చూసినప్పుడు ఇలా గ్రహాలు దగ్గరకు వచ్చినట్లు కనిపించడాన్ని కంజక్షన్గా పిలుస్తుంటాం. అయితే, చంద్రుడు కాకుండా మిగతా గ్రహాలు కూడా ఒక్కోసారి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఇందులో భాగంగానే మనకు గతకొద్ది కాలంగా గురు-శని గ్రహాలు దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 21వ తేదీ నాటికి మరింత దగ్గరగా చేరి మనకు ప్రకాశవంతంగా కనిపించనున్నాయి.
భూమినుంచి చంద్రుడు దాదాపు 3,84,000కి.మీ దూరంలో ఉండగా వేరే గ్రహాలు మాత్రం లక్షలు, కోట్ల కి.మీ దూరంలో ఉన్నాయి. భూమితో పాటు ఇతర గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇలా తిరిగే సమయంలో ఏవేని రెండు గ్రహాలు ఒక్కోసారి కొంత దగ్గరగా చేరుకుంటాయి. అయినప్పటికీ వాటిమధ్య లక్షల కి.మీ దూరం ఉంటుంది. భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగిరావడానికి 365రోజులు పడితే, గురు గ్రహానికి మాత్రం 12సంవత్సరాలు పడుతుంది. అదే శనికి మాత్రం దాదాపు 28-30 సంవత్సరాలు పడుతుంది. ఇలా ఒక్కో గ్రహానికి కొంత కాలం పడుతుంది. ఇలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో అవి ఒకేసారి దగ్గరకు వచ్చినట్లు మనకు కనిపిస్తుంటాయి. ఇలాంటి అరుదైన అద్భుత దృశ్యాలు ఆకాశంలో ఎన్నో జరుగుతూనే ఉంటాయి. వాటిని కొన్నింటిని మాత్రమే మనం నేరుగా చూసే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం కనిపిస్తోన్న గురు, శని గ్రహాలు కూడా అలాంటివే. భారత్లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.
ఇవీ చదవండి..
చందమామపై చైనా జెండా
భూమికి చేరిన గ్రహశకల నమూనాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాల్యంలో శారీరక శ్రమ లోపిస్తే గుండెకు ముప్పు
చిన్నతనంలో శారీరక శ్రమలోపిస్తే గుండె పరిమాణం పెరిగే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. -
పత్రికలను, ప్రత్యర్థులను మేమెలా అడ్డుకుంటాం!
జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపేందుకు అవసరమైన సదుపాయాలను దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కల్పించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) బుధవారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
ఐఎఫ్ఎస్కు 147 మంది ఎంపిక
యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష తుది ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
అంటార్కిటికాలో భారత కొత్త పరిశోధన కేంద్రం!
హిమమయ అంటార్కిటికా ప్రాంతంలో కొత్తగా పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించింది. -
2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్
2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్ అవతరించింది. ఇంతవరకు జపాన్ ఈ స్థానంలో ఉండేది. -
ముడత మంచిదే!
పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి (సీఎస్ఐఆర్) సిబ్బంది ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. -
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
రాజస్థాన్లో జోధ్పుర్కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి (68), మోహన్లాల్ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. -
ఆ దృశ్యాలను 100 మందికి చూపిస్తాం..
పశ్చిమబెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద బోస్పై ఓ మహిళ లైంగిక వేధింపుల అభియోగాలు మోపిన నేపథ్యంలో రాజ్భవన్ కీలక నిర్ణయం తీసుకుంది. -
వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం
భారత్లో మొత్తం వ్యాధుల భారంలో 56.4 శాతం అనారోగ్యకర ఆహారం కారణంగా ఉన్నట్లు అంచనాలు పేర్కొంటున్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) బుధవారం తెలిపింది. -
భద్రతా మండలికి భారత్ 5 లక్షల డాలర్లు
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కు భారత్ 5 లక్షల డాలర్లను విరాళంగా ఇచ్చింది. -
శివుడికి నాలుక సమర్పించిన యువకుడు
ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లా థానాడ్ గ్రామంలో బుధవారం రాజేశ్వర్ నిషాద్ (33) అనే యువకుడు చాకుతో నాలుక కోసుకొని శివుడికి సమర్పించుకున్నాడు. -
ఐఐటీ మద్రాస్కు రూ.513 కోట్ల విరాళం
ఐఐటీ మద్రాస్ చరిత్రలో దాతల నుంచి అత్యధిక నిధులు సమకూరాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు అందినట్లు ఐఐటీ మద్రాస్ సంచాలకులు ప్రొఫెసర్ వి.కామకోటి బుధవారం ప్రకటించారు. -
ఏఐతో నిఘా వ్యవస్థల రూపకల్పన
కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధికి రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), భువనేశ్వర్ ఐఐటీలు చేతులు కలిపాయి. -
ముస్లింల రిజర్వేషన్పై కార్టూన్ వీడియో
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆ పార్టీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. -
పారిశ్రామికవేత్త రామభద్రకు జపాన్ పురస్కారం
హైదరాబాద్లోని ‘నాగ రామ జపాన్ హబ్’ సంస్థ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త బొడ్డుపల్లి రామభద్ర జపాన్ ప్రభుత్వ ‘ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్, గోల్డ్ రేస్ విత్ రోసెట్’ పురస్కారం అందుకున్నారు. -
కోర్టులో రాజకీయాలు వద్దు
కోర్టు వాదనల్లో రాజకీయ అంశాల ప్రస్తావనను అనుమతించబోమని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. -
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాఠోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. -
దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా ఉంటారు
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా, తూర్పు భారతీయులు చైనీయుల మాదిరిగా కనిపిస్తారని ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన వ్యాఖ్య మరో వివాదానికి తెరలేపింది. -
కేజ్రీవాల్ బెయిల్పై రేపు సుప్రీం ఉత్తర్వులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణల కింద అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనుంది. -
దక్కని బెయిల్.. కేంద్ర కారాగారానికి రేవణ్ణ
మహిళ కిడ్నాప్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి బుధవారం తరలించారు. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ 100 సర్వీసుల రద్దు
టాటా గ్రూప్లోని విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు ఉద్యోగుల సెగ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్