వలస కార్మికులను ఆదుకోవాలి: ఆరెస్సెస్‌ చీఫ్‌

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్..

Published : 11 Sep 2020 20:13 IST

కాన్పుర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వలస కార్మికుల దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. విపత్కర కాలంలో ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలని కోరారు. ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక నగరమైన కాన్పుర్‌లో మూడు రోజుల పర్యటన సందర్భంగా సంఘ్ నాయకులతో పలు విషయాలు చర్చించారు. వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మనవంతు సాయం చేయాల్సిందిగా కోరారు. బుధవారం రాత్రి కాన్పుర్‌కు చేరుకున్న మోహన్ భగవత్ ఆరెస్సెస్‌ ద్వారా చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల అమలుపై నాయకులను ఆరా తీశారు. సంస్థ సేవలు నగరాల్లోని కార్మికులతోపాటు గ్రామాల్లోని రైతుల వరకు చేరాలని ఆయన సూచించారు. సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడాలని, స్వలాభం కోసమో, ప్రచారం కోసమో పనిచేయొద్దని గుర్తుచేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని