Stalin: ఉగ్రవాదిలా 18 గంటలు బంధించారు.. అందుకే ఛాతినొప్పి వచ్చింది: స్టాలిన్
మంత్రి సెంథిల్ బాలాజీని ఉగ్రవాదిలా నిర్బంధించి విచారించారని, ఆ ఒత్తిడితోనే ఆయనకు ఛాతి నొప్పి వచ్చిందని తమిళనాడు సీఎం స్టాలిన్ (MK Stalin,) ఆరోపించారు. భాజపా ఈడీతో రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
చెన్నై: మనీలాండరింగ్ కేసులో తమిళనాడు (Tamil Nadu) మంత్రి వి. సెంథిల్ బాలాజీ (V Senthil Balaji)ని అరెస్టు చేసే క్రమంలో ఈడీ (ED) వ్యవహరించిన తీరును రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మరోసారి తీవ్రంగా ఖండించారు. ఆయనను 18 గంటల పాటు బంధించి ప్రశ్నల పేరుతో వేధించారని, ఆ ఒత్తిడితోనే మంత్రికి ఛాతినొప్పి వచ్చిందని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం తన ట్విటర్ ఖాతాలో స్టాలిన్ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
‘‘సెంథిల్ బాలాజీ పట్ల ఈడీ ఎలా ప్రవర్తించిందో యావత్ దేశం చూసింది. ఇది పూర్తిక రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగమే. 10 ఏళ్ల నాటి కేసులో దర్యాప్తు అని చెప్పి ఆయనను గదిలో నిర్బంధించారు. మానసికంగా బలహీనులయ్యేలా చేశారు. నేను దర్యాప్తు చేసేందుకు వ్యతిరేకం కాదు. కానీ, ఓ ఉగ్రవాదిలా ఆయనను బంధించాల్సిన అవసరం ఏముంది? ఆయనేం పారిపోయే వ్యక్తి కాదు కదా..! విచారణకు సహకరిస్తానని ఆయన ఈడీ అధికారులకు చెప్పారు. అయినా వారు ఆయనను 18 గంటలు నిర్బంధించి ఎవర్నీ కలవనీయకుండా చేశారు. ఈడీ అధికారుల ఒత్తిడి వల్లే ఆయన ఛాతినొప్పికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు’’ అని స్టాలిన్ (MK Stalin) ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమ్మల్ని రెచ్చగొట్టొద్దు..
ఈ సందర్భంగా భాజపా (BJP)పైనా స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ‘‘ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో భాజపా అధిష్ఠానం తమ రాజకీయాలు చేస్తోంది. అంతేగానీ, ప్రజలను కలిసి రాజకీయాలు చేసేందుకు వారు సిద్ధంగా లేరు. అందుకే ప్రజలకు కూడా కాషాయ పార్టీపై విశ్వాసం పోయింది’’ అని దుయ్యబట్టారు. ‘‘ డీఎంకే కార్యకర్తలను రెచ్చగొట్టేందుకు సాహసించొద్దు. పరిణామాలను మీరు (భాజపాను ఉద్దేశిస్తూ) భరించలేరు. మాకు కూడా అన్ని రకాల రాజకీయాలు తెలుసు. ఇది బెదిరింపు కాదు.. హెచ్చరిక’’ అని స్టాలిన్ అన్నారు.
రవాణాశాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సెంథిల్ బాలాజీని బుధవారం ఈడీ అరెస్టు చేసింది. అయితే ఆ తర్వాత సెంథిల్ తీవ్ర ఛాతీ నొప్పికి గురవ్వడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో సెంథిల్ విలపించిన దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈడీ అభ్యర్థన మేరకు చెన్నై ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆసుపత్రికి వెళ్లి అక్కడే బాలాజీని విచారించారు. అనంతరం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించినా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా అక్కడే చికిత్స పొందేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ రిమాండ్ను వ్యతిరేకిస్తూ సెంథిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు నేడు దాన్ని కొట్టేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది. -
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం. -
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
అమిత్ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్ (Twitter)తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. -
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్