తనిఖీలా..? తొలగింపా..?: ప్రతిమ హత్య కేసులో అనుమానాలు..
Karnataka: ప్రభుత్వ అధికారిణి దారుణ హత్య కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఆమె ఇటీవలే కొన్ని ప్రాంతాల్లో సోదాల్లో పాల్గొన్నారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
బెంగళూరు: కర్ణాటక(Karnataka) గనులు, భూవిజ్ఞాన శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్న కేఎస్ ప్రతిమ(Prathima) హత్య ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ఆమె తోటి సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. ఆమె డైనమిక్ లేడీ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
కర్ణాటక పర్యావరణ విభాగం సీనియర్ అధికారి దినేశ్ మీడియాతో మాట్లాడుతూ..‘ఆమె మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె చాలా డైనమిక్గా ఉంటారు. సోదాలపరంగా, నిందితులపై చర్యలు తీసుకునే విషయంలో చాలా ధైర్యంగా వ్యవహరిస్తారు. తన పనితీరుతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల కూడా కొన్నిచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఆమెకు శత్రువులు ఎవరూ లేరు’ అని వెల్లడించారు. అధికారి వ్యాఖ్యలతో ఇటీవల జరిపిన తనిఖీలే ప్రతిమ హత్యకు కారణమయ్యాయా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రామనగర జిల్లాలో పని చేస్తున్న కేఎస్ ప్రతిమ(Prathima) బదిలీపై ఇటీవలే బెంగళూరు(Bengaluru)కు వచ్చారు. విధులు ముగించుకుని దొడ్డకల్లసంద్ర గోకుల్ అపార్ట్మెంట్కు రాత్రి ఎనిమిది గంటలకు చేరుకున్నారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు ఊపిరి ఆడకుండా చేసిన నిందితుడు, గొంతుకోసి హత్య చేశాడని గుర్తించినట్లు తెలిపారు. ఐదేళ్ల నుంచి ఆమె ఒక్కరే ఫ్లాట్లో ఉంటున్నారని చెప్పారు. అసలేం జరిగిందో తెలిసిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
అధికారితోనే పంట వ్యర్థాలు దగ్ధం చేయించిన రైతులు
ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన సోదరి స్పందించకపోవడంతో ఆమె సోదరుడు ప్రతీక్, దిగువ అంతస్తులో ఉన్న వారికి ఫోన్ చేశారు. వారు వచ్చి చూసేసరికి ప్రతిమ హత్యకు గురైందని శనివారం అర్ధరాత్రి తెలిసింది. ఈ హత్యకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లి తాలూకా తుడకి గ్రామానికి చెందిన ప్రతిమకు 18 ఏళ్ల క్రితమే సత్యనారాయణతో వివాహమైంది. భర్త, ఆమె కుమారుడు తీర్థహళ్లిలో ఉంటున్నారని ప్రతీక్ తెలిపారు.
డ్రైవర్ అరెస్టు..
అధికారిణి హత్య కేసుకు సంబంధించి, తొలి అరెస్టు చోటుచేసుకుంది. ‘ఈ హత్యకేసులో అనుమానితుడిని అరెస్టు చేశాం. అతడు ఒక డ్రైవర్. ఇటీవలే అతడిని పని నుంచి తొలగించారు’ అని బెంగళూరు పోలీసు కమిషనర్ వెల్లడించారు. తనను పని నుంచి తొలగించడం వల్లే హత్య చేశానని నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. దీంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
ఓ జంతు ప్రేమికుడు తన ఇంట్లో ఉన్న శునకాలపై వినూత్న రీతిలో ప్రేమను చాటుకున్నాడు. తన వివాహ ఆహ్వాన పత్రికపై వాటి పేర్లను ముద్రించాడు. -
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
సమాధాన పత్రాలను జై శ్రీరాం, భారత క్రికెటర్ల పేర్లతో నింపినా విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తర్ప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పుర్వాంచల్ విశ్వవిద్యాలయం ఇద్దరు ఆచార్యులను తొలగించింది. -
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు
ఆకలి వేస్తోందని శస్త్రచికిత్సను మధ్యలోనే ఆపేసి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశాడు ఓ వైద్యుడు. అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. -
అక్రమ రవాణా కాదు.. వారంతా మదర్సా విద్యార్థులే
అక్రమంగా చిన్నారులను రవాణా చేస్తున్నారన్న అనుమానంతో శుక్రవారం తాము అదుపులోకి తీసుకున్న బస్సులో ఉన్నది మదర్సా విద్యార్థులని శనివారం ఉత్తర్ప్రదేశ్ అధికారులు తెలిపారు. -
మహిళలకూ సీడీఎస్ పరీక్ష అవకాశంపై నిర్ణయం తీసుకోండి
ఇండియన్ మిలటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎయిర్ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ)ల్లో ప్రవేశం కోసం నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్) పరీక్ష రాసే అవకాశాన్ని మహిళలకూ కల్పించాలన్న వినతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ఉత్తరాఖండ్ అడవిలో మంటలు.. రంగంలోకి ఐఏఎఫ్ హెలికాప్టర్
ఉత్తరాఖండ్లోని నైనీతాల్ జిల్లాలోని అడవిలో చెలరేగిన మంటలను అదుపుచేసేందుకు అధికారులు శనివారం భారత వైమానిక దళ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. -
సీబీఐపై ఈసీకి తృణమూల్ ఫిర్యాదు
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సీబీఐ సోదాలు నిర్వహించడంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. -
ఇంకా చెరలోనే 16 మంది భారతీయులు
హర్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ అదుపులోకి తీసుకున్న నౌకలోని 16 మంది భారత సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. ఇరాన్ చెరలోనే ఉన్నారు. -
దేశంలో పేటెంట్స్ ఫైలింగ్లో వృద్ధి
దేశంలో నూతన ఆవిష్కరణలు, వాటికి సంబంధించిన మేధోహక్కుల (పేటెంట్) దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నా.. సరైన మౌలిక సదుపాయాలు లేవని నాస్కామ్ వెల్లడించింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు మరోసారి ఈడీ సమన్లు
ఆప్ ఎమ్యెల్యే అమానతుల్లా ఖాన్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దిల్లీ వక్ఫ్ బోర్డుకు ఆయన ఛైర్మన్గా వ్యవహరించిన సమయంలో అవకతవకలకు సంబంధించి హవాలా కేసులో 29న దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి తన వాంగ్మూలాన్ని కొనసాగించవలసిందిగా కోరింది. -
ఈడీ అరెస్టు అక్రమం, నిరంకుశం
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడం అక్రమం, నిరంకుశమని దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ శనివారం సుప్రీంకోర్టుకు తెలిపారు. -
హెలికాప్టర్లో కూర్చోబోతూ కిందపడ్డ మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్లో కూర్చోబోతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. -
సరికొత్త వందే మెట్రో ప్రయోగాత్మక పరుగు జులైలో
వందేభారత్ సెమీ హైస్పీడ్ రైళ్లకు ప్రయాణికుల నుంచి లభిస్తున్న ఆదరణతో మెట్రో నగరాల మధ్య వందే మెట్రో రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మణిపుర్లో రెచ్చిపోయిన మిలిటెంట్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. బిష్ణుపుర్ జిల్లాలోని భద్రతా సిబ్బంది శిబిరంపై రెండు గంటల పాటు కాల్పులకు తెగబడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు
-
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
-
అన్నకు నచ్చని తమ్ముడి పెళ్లి.. యువతి అమ్మమ్మ ఇంటికి నిప్పుపెట్టిన ప్రబుద్ధుడు
-
ఆసుపత్రికెళ్తే.. విసనకర్ర, కొవ్వొత్తి తీసుకెళ్లాల్సిందే!
-
‘మా అమ్మాయికి కాళ్లే చచ్చుబడ్డాయి.. ఏపీలో వ్యవస్థే చచ్చుబడింది’