కొవిడ్ టీకాతో..ప్రపంచాన్ని రక్షించిన భారత్!
దేశంలో కొవిడ్ టీకాను అందుబాటులోకి తేవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ఒప్పందంతో వివిధ దేశాలకు టీకాను ఎగుమతి చేస్తోన్న భారత్ మహమ్మారి బారినుంచి ప్రపంచాన్ని రక్షించిందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం
హూస్టన్: దేశంలో కొవిడ్ టీకాను అందుబాటులోకి తేవడంతో పాటు అంతర్జాతీయ సంస్థల ఒప్పందంతో వివిధ దేశాలకు భారత్ టీకాను ఎగుమతి చేస్తోంది. తద్వారా మహమ్మారి బారినుంచి యావత్ ప్రపంచాన్ని భారత్ రక్షించిందని అంతర్జాతీయ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ చేస్తోన్న కృషిని తక్కువ అంచనా వేయొద్దని అమెరికా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘కొవిడ్ వ్యాక్సినేషన్-సాధారణ స్థితులు’ అనే అంశంపై ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐఏసీసీజీహెచ్) ఏర్పాటు చేసిన ఓ వెబినార్లో ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ హోటెజ్ విదేశాలకు వ్యాక్సిన్ అందించడంలో భారత్ పాత్రను వివరించారు.
‘వైద్యశాస్త్రంలో ఉన్న అనుభవంతో ప్రపంచంలోనే ఫార్మసీ దేశంగా భారత్ పిలవబడుతోంది. అంతేకాకుండా ఔషధ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న దేశం నుంచి కొవిడ్ వ్యాక్సిన్ను తీసుకెళ్లేందుకు ప్రపంచ దేశాలు క్యూ కడుతున్నాయి. ఎంఆర్ఎన్ఏ సాంకేతికతో అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అవి ప్రభావం చూపలేకపోయాయి. కానీ, భారత్ తయారు చేసిన వ్యాక్సిన్లను అంతర్జాతీయ సంస్థల ఒప్పందాలతో అల్ప, మధ్య ఆదాయా దేశాలకు అందిస్తూ ప్రపంచాన్ని రక్షిస్తోంది’ అని అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ హోటెజ్ పేర్కొన్నారు. ఇలా వ్యాక్సిన్ అందించడం నిజంగా ప్రపంచ దేశాలకు గొప్ప బహుమతి అని అభిప్రాయపడ్డారు. అయితే, వ్యాక్సిన్ల ప్రభావం సమయంపై స్పష్టత లేనందున కొత్తరకం వైరస్లను ఎదుర్కొనేందుకు బూస్టర్ డోసులు అవసరం ఉందని పీటర్ హోటెజ్ తెలిపారు.
ప్రస్తుతం భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం దేశంలోనే పంపిణీ చేయడమే కాకుండా విదేశాలకూ వ్యాక్సిన్ను భారీ మొత్తంలో ఎగుమతి చేస్తోంది. ఇక పొరుగున ఉన్న దేశాలకు ఉచితంగా పంపిణీ చేసింది. వీటితోపాటు వాణిజ్య పరంగానూ దాదాపు 50కిపైగా దేశాలకు భారత్ నుంచే వ్యాక్సిన్ ఎగుమతి చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలాఉంటే, భారత్లో ఇప్పటివరకు రెండు కోట్ల డోసులను పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
రహదారిపై గుంతలు మాయం!
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల్లో ఓట్లశాతం తగ్గుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహాదారుడు, ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.