Modi: మునుపటి నష్టాన్ని పూడ్చేలా అనుసంధాన మహాయజ్ఞం
మునుపటి ప్రభుత్వ హయాంలో ఉత్తరాఖండ్, దేశం నష్టపోయిన పదేళ్ల కాలం భర్తీ అయ్యేలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనుసంధాన మహాయజ్ఞాన్ని
అందులో భాగంగానే రూ.18 వేల కోట్ల ప్రాజెక్టులు
ఉత్తరాఖండ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు
దేహ్రాదూన్: మునుపటి ప్రభుత్వ హయాంలో ఉత్తరాఖండ్, దేశం నష్టపోయిన పదేళ్ల కాలం భర్తీ అయ్యేలా ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనుసంధాన మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.18,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక పరేడ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. గఢ్వాలీలో ప్రసంగాన్ని ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ‘‘ఈ రోజు ఇక్కడ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ‘మహాయజ్ఞం’లో భాగం. నష్టపోయిన కాలాన్ని భర్తీచేసేందుకు మేం రెండు, మూడు రెట్ల వేగంతో చర్యలు చేపడుతున్నాం’’ అని అన్నారు. కేదార్నాథ్లో గతంలో చేప్పిన అంశాన్ని పునరుద్ఘాటించిన మోదీ.. ప్రస్తుత దశాబ్దం ఉత్తరాఖండ్ది అవడానికి ఈ ప్రాజెక్టులు ఉపకరిస్తాయన్నారు.
తమ ప్రభుత్వం కేదార్నాథ్లో చేపట్టిన పునర్నిర్మాణ పనుల కారణంగా 2019లో ఆ ఆలయానికి రికార్డుస్థాయిలో పది లక్షల మందికిపైగా భక్తులు విచ్చేశారని చెప్పారు. శనివారం శంకుస్థాపన చేసిన దిల్లీ-దేహ్రాదూన్ ఆర్థిక నడవా కారణంగా రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గుతుందన్నారు. ఇందులో భాగంగా ఆసియాలోనే అతిపెద్దదైన 12 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఫలితంగా వన్యప్రాణుల కదలికలకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి మునుపటి ప్రభుత్వాలు చేసిందా చాలా స్వల్పమని, తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక గత ఏడు సంవత్సరాల్లో రూ.12,000 కోట్లు ఖర్చు చేశామని మోదీ చెప్పారు. ‘‘ఉత్తరాఖండ్ అభివృద్ధి రెండు ఇంజిన్ల ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైన అంశం. రాష్ట్ర అభివృద్ధి కోసం మేం రూ.లక్ష కోట్లకుపైగా ప్రాజెక్టులను మంజూరు చేశాం’’ అని వివరించారు. రిషీకేశ్లోని లక్ష్మణ్ ఝూలా సమీపంలో వంతెన నిర్మాణానికీ మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
దేవాలయం ఉన్న ఓ ప్రైవేటు భూమిని సొంతం చేసుకునేందుకు ఓ వ్యక్తి ఏకంగా హనుమంతుడినే తోటి పిటిషనర్గా పేర్కొన్నారు. -
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్
దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు సర్వీసు జూన్ 4 నుంచి కేరళలోని తిరువనంతపురం టు గోవా మార్గంలో రాకపోకలు ప్రారంభించనుంది. -
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వహించకూడదు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఇంకా ఊరట లభించలేదు. -
కుటుంబపోషణ కోసం కల్లు గీస్తున్న షీజా
కేరళలోని కన్నూర్కు చెందిన సి.షీజా (38) భర్తకు రోడ్డుప్రమాదం జరగడంతో కుటుంబపోషణ కోసం కల్లుగీతను వృత్తిగా ఎంచుకొంది. చకాచకా చెట్లను ఎక్కుతూ కల్లును గీసి ఔరా అనిపించుకుంటోంది. -
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయ నియామకాల రద్దు నిలిపివేత
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ ఛైర్పర్సన్ మమతా బెనర్జీకి భారీ ఉపశమనం లభించింది. -
సంజీవ్ లాల్ అరెస్ట్
ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం ప్రైవేటు కార్యదర్శి(పీఎస్) సంజీవ్ కుమార్ లాల్ (52), లాల్ పనిమనిషి జహంగీల్ ఆలం(42)లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం అరెస్టు చేసింది. -
మోసపూరిత ప్రకటనలకు ఉత్పత్తుల ప్రచార తారలూ బాధ్యులే
ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవడానికి కంపెనీలు మోసపూరిత ప్రకటనలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం వాటిని నివారించే చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేసింది. -
మోసాలకు వాడే నంబర్లను స్తంభింపజేస్తున్న టెలికాం శాఖ
మొబైల్ వినియోగదారులకు ఎస్ఎంఎస్లు పంపించి ఆర్థికంగా మోసం చేస్తున్నవారి మొబైల్ హ్యాండ్సెట్లను బ్లాక్ చేసి, వారి నంబర్లను స్తంభింపజేసే పనికి టెలికాం శాఖ (డీవోటీ) శ్రీకారం చుట్టింది. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం
కేరళకు మరో వైరల్ ఫీవర్ పట్టుకుంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. -
ఏ నాగరిక సమాజంలోనూ హింసను కీర్తించరు
కెనాడాలోని ఒంటారియోలో నిర్వహించిన ఊరేగింపులో ఖలిస్థానీ అనుకూల ప్రదర్శనలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. హింసను కీర్తించడం ఏ నాగరిక సమాజంలోనూ భాగం కాదని పేర్కొంది. -
మంచి, చెడు స్పర్శల గురించే కాదు.. చిన్నారులకు వర్చువల్ టచ్పై కూడా అవగాహన అవసరం: దిల్లీ హైకోర్టు
నేటి సమాజంలో పిల్లలకు మంచి, చెడు స్పర్శల గురించి మాత్రమే బోధిస్తే సరిపోదని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో పాటు ‘వర్చువల్ టచ్’ అనే అంశంపై కూడా అవగాహన కల్పించాలని దిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. -
జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమైనట్లు అధికారులు తెలిపారు. -
అయోధ్య మందిరం వాస్తు ప్రకారం లేదు
అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ నాయకుడు రాంగోపాల్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆలయాన్ని సరిగా నిర్మించలేదని, అది ఉపయోగం లేనిదని ఆయన అన్నారు. -
800 కేజీల బంగారు నగలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా
డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో 800 కేజీల బంగారు ఆభరణాలను తీసుకెళుతున్న కంటెయినర్ బోల్తా కొట్టింది. -
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ని హైదరాబాద్లో మంగళవారం కలిశారు. ఇటీవల పీవీకి కేంద్రం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇచ్చినందుకు గాను ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. -
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
కేరళలోని పలు జిల్లాల్లో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ (West Nile fever) వ్యాప్తిలో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?