అదానీపై అట్టుడికిన సభ
అదానీ గ్రూపునకు సంబంధించి హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక దరిమిలా ఆ కంపెనీ షేర్లు పతనం కావడంపై, దాని వ్యాపార లావాదేవీలపై సమగ్ర విచారణకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ (జేపీసీ)ని నియమించాలని పార్లమెంటులో విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి.
జేపీసీ నియామకానికి పార్లమెంటులో విపక్షం పట్టు
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలి: కాంగ్రెస్
హిండెన్బర్గ్ నివేదిక మీద స్తంభించిన లోక్సభ, రాజ్యసభ
వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన 9 పార్టీల్లో కాంగ్రెస్, భారాస
దిల్లీ: అదానీ గ్రూపునకు సంబంధించి హిండెన్బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక దరిమిలా ఆ కంపెనీ షేర్లు పతనం కావడంపై, దాని వ్యాపార లావాదేవీలపై సమగ్ర విచారణకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ (జేపీసీ)ని నియమించాలని పార్లమెంటులో విపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఈ గ్రూపు షేర్లలో అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అదానీ వ్యవహారం వల్ల జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ప్రభుత్వరంగ బ్యాంకులు ఆ గ్రూపులో పెట్టిన పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనయ్యాయని కాంగ్రెస్తో పాటు శివసేన, వామపక్షాలు, భారాస, ఆప్ తదితర పార్టీల సభ్యులు ఆందోళన వ్యక్తంచేశారు. బడ్జెట్పై చర్చకంటే ముందు ఈ అంశాన్ని పరిశీలించాలంటూ కార్యకలాపాలను అడ్డుకోవడంతో ఉభయసభలు స్తంభించిపోయాయి. ఎలాంటి చర్చ చేపట్టకుండానే శుక్రవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం లోక్సభ సమావేశమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అదానీపై ‘హిండెన్బర్గ్ రీసెర్చ్’ నివేదిక గురించి కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. సభాపతి వాటిని అంగీకరించలేదు. ఆధార రహిత ఆరోపణలతో సభ్యులు కీలకమైన ప్రశ్నోత్తరాల గంటకు అంతరాయం కలిగించొద్దని కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ముకుళిత హస్తాలతో విజ్ఞప్తి చేశారు. వెల్ వద్దకు దూసుకువచ్చిన ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
వాయిదా తీర్మానానికి నిర్ణీత నమూనా ఏమీ లేదు: కేశవరావు
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అదానీ వ్యవహారంపై చర్చించాలని 267 నిబంధన కింద మల్లికార్జున ఖర్గే (కాంగ్రెస్), ప్రియాంక చతుర్వేది (శివసేన), సంజయ్సింగ్ (ఆప్), కె.కేశవరావు (భారాస) సహా 9 మంది సభ్యులు వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చారు. అవి నిబంధనలకు లోబడి లేవని ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తిరస్కరించారు. ఈ తీర్మానాలకు నిర్ణీత నమూనా అంటూ లేదని కేశవరావు చెప్పారు. అదానీ అంశం కంటే దేశంలో పెద్ద విషయం మరొకటి లేదన్నారు. సభ ఒకసారి వాయిదాపడి తిరిగి సమావేశమయ్యాకా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. లక్షల మంది చిన్న మదుపరుల కష్టార్జితంపై, ప్రభుత్వ సంస్థల పెట్టుబడులపై ప్రభావం చూపిన అంశాన్ని చర్చకు చేపట్టడానికి సభా కార్యకలాపాలను పక్కనపెట్టాలని డిమాండ్ చేశారు. సభాపతి ప్రతిసారి తమ నోటీసులను తిరస్కరిస్తుండడంతో ఈసారి అన్ని పార్టీలూ కలిసి వాటిని ఇచ్చాయని ఖర్గే చెప్పారు.
6న జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు
దిల్లీ: అదానీ కంపెనీల విషయంలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ఎదుట ఈ నెల 6న నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలకు సూచనలు ఇవ్వాల్సిందిగా పీసీసీలను కోరినట్లు చెప్పారు. ప్రధానికి సన్నిహితులైన మిత్రుల కోసం ప్రజల కష్టార్జితాన్ని పణంగా పెట్టడం ప్రభుత్వానికి తగదన్నారు. ‘‘నైతికత గురించి అదానీ మాట్లాడటం.. ఆయన గురువు (ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ) వినయం, నిగ్రహం, విశాల హృదయం వంటి సద్గుణాలను బోధించడం లాంటిదే. ఇదంతా పొలిటికల్ సైన్స్’’ అంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ప్రజాధనం ప్రమాదంలో పడింది
విపక్ష సభ్యుల ఆరోపణ
ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గేతో కలిసి ప్రతిపక్ష నేతలు విలేకరులతో మాట్లాడారు. ‘ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కోట్లమంది ప్రజల పెట్టుబడులున్నాయి. వారి సొమ్ము ఇప్పుడు ప్రమాదంలో పడింది’ అని ఆరోపించారు. పార్లమెంటు సమావేశం మొదలు కావడానికి ముందు విపక్షాలు భేటీ అయి, సభలో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని చర్చించాయి. ఆ ప్రకారమే ఉభయ సభల్ని స్తంభింపజేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రహదారిపై గుంతలు మాయం!.. వాటంతట అవే పూడుకునేలా ఎన్హెచ్ఏఐ కసరత్తు
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.