కోడ్ మీరితే కొరడా!
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి.
నిష్పక్షపాత ఎన్నికలకు పాశుపతాస్త్రం
భారతదేశంలో ఎన్నికలు ఓ మహాసంగ్రామం! గెలుపే లక్ష్యంగా పార్టీలు ఎత్తుగడలు, వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తుంటాయి. ప్రలోభాల పర్వాలు, ప్రత్యర్థులపై దాడులు, దుర్భాషలు, రెచ్చగొట్టే వ్యవహారశైలి వంటివి అడుగడుగునా కనిపిస్తుంటాయి. నిష్పక్షపాత ఎన్నికలకు ఇవి ప్రధాన అడ్డంకులు. వీటి పాలిట పాశుపతాస్త్రమే ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)! ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం మధ్యాహ్నం పోల్ షెడ్యూలు ప్రకటించగానే దేశవ్యాప్తంగా ఈ కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఓట్ల లెక్కింపు ముగిసేవరకూ అమల్లో ఉంటుంది. రాజకీయ పార్టీలన్నీ దీన్ని తు.చ. తప్పకుండా పాటించాల్సిందే. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు. ఎన్నికల ప్రక్రియకు ప్రాణాధారమైన ఈ నియమావళి కథాకమామీషును ఓసారి పరిశీలిస్తే..
ఎందుకీ నియమావళి?
ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఈ నియమావళిని అమలు చేస్తారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రభుత్వ యంత్రాంగం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఇది నిరోధిస్తుంది. తద్వారా అభ్యర్థులందరికీ సమానావకాశాలు దక్కేలా చూడటం దీని ఉద్దేశం.
చట్టబద్ధత కోసం..
ఎన్నికల నియమావళిని నిర్దేశించే ప్రత్యేక చట్టమేమీ లేదు. అయితే, సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో కోడ్ను సమర్థించింది. ఈసీ తన అధికారాలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ‘కోడ్’కు చట్టబద్ధత కల్పించాలని 2013లో పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిపై మరింత స్పష్టత కోసం సవరణ చేయాలని సూచించింది. ఎన్నికల వివాదాలను 12 నెలల్లోగా పరిష్కరించేందుకు ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది.
అమలు ఎలా?
రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంటుంది. కోడ్ అమలుకూ.. ఈ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలనే ఈసీ ఉపయోగించుకుంటోంది.
- కోడ్ ఉల్లంఘనలపై ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. న్యాయస్థానాలనూ ఆశ్రయించొచ్చు.
- పరిశీలకులు, కొన్ని యంత్రాంగాల ద్వారా ఈసీ ఈ నిబంధనల అమలును పరిశీలిస్తుంది. ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేస్తుంది.
ఉల్లంఘిస్తే..
నియమావళిని ఉల్లంఘించిన వారికి ఈసీ నోటీసు పంపుతుంది. కొన్ని విషయాల్లో వారు క్షమాపణ చెబితే వదిలేస్తుంది. నాయకులను మందలించడం, ప్రచారానికి వెళ్లకుండా నిలువరించడం వంటి చర్యలను తీసుకుంటుంది. తీవ్రతను బట్టి కేసుల నమోదుకూ ఆదేశాలిస్తుంది.
ఇలా నడుచుకోవాలి
సభలు: తగిన భద్రత ఏర్పాట్లు చేయడానికి వీలుగా సభలు నిర్వహించే ప్రదేశాలు, సమయం వంటి వివరాలను పోలీసులకు ముందే తెలపాలి.
ప్రదర్శనలు: ఇద్దరికన్నా ఎక్కువ మంది అభ్యర్థులు ఒకే మార్గంలో ప్రదర్శన జరపాలని భావిస్తే.. సంబంధిత నిర్వాహకులు మొదటే చర్చించుకోవాలి. ఘర్షణలకు తావివ్వకూడదు.
పోలింగ్ రోజున: పోలింగ్ బూత్ వద్ద విధులు నిర్వర్తించే పార్టీల కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇస్తారు. వాటిపై పార్టీ పేరు, గుర్తు, అభ్యర్థి పేరు ఉండకూడదు.
అధికార పార్టీ: ఓటర్లను ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టు, పథకాన్ని ప్రకటించకూడదు. మంత్రులు తమ అధికారిక కార్యక్రమాలను ఎన్నికల వ్యవహారంతో ముడిపెట్టకూడదు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోకూడదు.
- ఎన్నికల్లో విజయావకాశాలు మెరుగయ్యేలా ప్రభుత్వ విజయాలపై ప్రజాధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు. ప్రభుత్వ ప్రసార సాధనాలు, వాహనాలను ఉపయోగించుకోకూడదు. ఆర్థిక సంబంధమైన హామీలను ఇవ్వకూడదు.
- ప్రభుత్వ వసతి గృహాలు, హెలిప్యాడ్ల వంటి సౌకర్యాలను అన్ని పార్టీలవారికీ కల్పించాలి.
- ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు, పదోన్నతులు ఇవ్వకూడదు.
కేరళలో బీజాలు
తొలిసారిగా 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘విధులు- నిషేధాలు’ పేరుతో కొన్ని నిబంధనలను అక్కడి పాలనా యంత్రాంగం అమల్లోకి తెచ్చింది. ఆ తర్వాత 60 ఏళ్లలో అది మార్పులకు లోనవుతూ ప్రస్తుత ‘నియమావళి’ రూపాన్ని సంతరించుకొంది.
- 1962లో లోక్సభకు, కొన్ని అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిగినప్పుడు.. గుర్తింపు పొందిన పార్టీలకు ప్రవర్తనా నియమావళిని ఈసీ పంపింది. వీటికి అన్ని పార్టీల అంగీకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.
- 1968లో ‘కనీస ప్రవర్తనా నియమావళి’ పేరుతో మార్గదర్శకాలను ఈసీ అందజేసింది.
- 1971-72లో లోక్సభ, అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల సందర్భంగా మరోసారి నియమావళిని అన్ని పార్టీలకు ఎన్నికల సంఘం పంపింది.
- 1974 ఎన్నికల సందర్భంగా నియమావళి అమలుపై ఈసీ కీలక నిర్ణయం తీసుకొంది. దీనిని అన్ని పార్టీలు కచ్చితంగా పాటించేలా చూడడానికి, ఉల్లంఘనలను గుర్తించడానికి.. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన, అన్ని పార్టీల ప్రతినిధులు సభ్యులుగా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది.
- 1977 లోక్సభ ఎన్నికల సందర్భంగా మరోసారి అన్ని పార్టీలకు నియమావళిని ఈసీ పంపింది.
- 1979లో.. అధికార పార్టీ అభ్యర్థులు తమ హోదాలను దుర్వినియోగం చేయకుండా నియమావళిలో కొత్త విభాగాన్ని చేర్చింది.
- 1991లో నిబంధనలన్నింటినీ క్రోడీకరించి, ప్రస్తుతం అమల్లో ఉన్న నియమావళిని రూపొందించింది.
- ఎన్నికల ప్రణాళికలనూ నియమావళి పరిధిలోకి తెస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు 2013లో ఆదేశించింది. ఈ మేరకు వాటిని కూడా ‘కోడ్’ పరిధిలోకి తెస్తూ 2014లో ఈసీ నిర్ణయం తీసుకుంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది. -
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం. -
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
అమిత్ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్ (Twitter)తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. -
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్