మంత్రి ఇంటికి వెళ్లి టీకా వేసిన అధికారిపై వేటు!
గత నెలలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ ఇంటికే వెళ్లి టీకా వేసిన అధికారిపై వేటు పడింది. కొవిడ్ టీకా పంపిణీ నిబంధనల్ని .....
రెండో డోసు ఆస్పత్రికెళ్లి వేయించుకున్న మంత్రి
బెంగళూరు: గత నెలలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ ఇంటికే వెళ్లి టీకా వేసిన అధికారిపై వేటు పడింది. కొవిడ్ టీకా పంపిణీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 2న హవేరి జిల్లా హిరెకెరూర్ తాలుకా వైద్యాధికారి డాక్టర్ జెడర్ ముఖందర్ నేరుగా మంత్రి ఇంటికే వెళ్లి బీసీ పాటిల్, ఆయన సతీమణికి టీకా వేయించారు. ఆ ఫొటోలను మంత్రి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. శిక్షణలో పదే పదే సూచించినప్పటికీ ఇంటికి వెళ్లి టీకా వేయడంపై ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ ఘటనపై వైద్యశాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో పాటు ఆ వైద్యాధికారిపై వేటు వేశారు. ఈ మేరకు మార్చి 26న ఆరోగ్యశాఖ కమిషనర్ డాక్టర్ కేవీ త్రిలోక్ చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. విచారణ పూర్తయ్యే వరకూ తమ అనుమతి లేకుండా ఎక్కడికీ వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. టీకా పంపిణీ నిబంధనల ఉల్లంఘనపై కర్ణాటక వైద్యశాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ రావు కూడా అసంతృప్తి వ్యక్తంచేశారు.
తాజాగా, గత నెలలో తొలి డోసును ఇంటి వద్దే వేయించుకున్న మంత్రి తనపై విమర్శలు రావడంతో రెండో డోసును ఆస్పత్రికే వెళ్లి వేయించుకున్నారు. శుక్రవారం హిరెకెరె ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా రెండో డోసు వేయించుకున్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు వ్యక్తుల కోసం సుప్రీంకు రాష్ట్ర ప్రభుత్వమా?
సందేశ్ఖాలీ ఆగడాలపై దర్యాప్తు విషయంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ప్రైౖవేటు వ్యక్తుల ప్రయోజనాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఎలా ఆశ్రయిస్తుందని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం సోమవారం ప్రశ్నించింది. -
బెయిల్ కోసం విచారణ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
తన అరెస్టు, కస్టడీని సవాల్ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్ కోసం విచారణ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది. -
సంక్షిప్త వార్తలు
ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులను భవిష్యత్తుకు తగినట్లు తీర్చిదిద్దాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ డాక్టర్ అభయ్ జెరె సూచించారు. -
ఆసుపత్రుల్లో రుసుముల నిర్ధారణపై మీ వైఖరేంటి?
ఆసుపత్రుల్లో వైద్యసేవల రుసుములను నిర్ధారించే అంశంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (సెంట్రల్ గవర్నమెంట్) రూల్స్-2012లోని 9వ నిబంధనను అమలు చేయరాదన్న పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది. -
పత్రికాస్వేచ్ఛ అణచివేత ధోరణి తగదు
పత్రికాస్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్కు లేఖ రాసింది. -
భోజ్శాల సర్వేకు మరో 8వారాల గడువు
భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్పై శాస్త్రీయ సర్వే పూర్తి చేయడానికి భారత పురావస్తు విభాగాని(ఏఎస్ఐ)కి మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇందౌర్ బెంచీ మరో 8 వారాల గడువు ఇచ్చింది. -
ఇక ఏటా పాఠ్యపుస్తకాల సవరణ
దేశవ్యాప్తంగా విద్యార్థులకు పంపిణీచేసే పాఠ్యపుస్తకాల విషయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి కేంద్ర విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. -
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం పరిమితికి సవరణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల విద్యా భత్యం, హాస్టల్ రాయితీల పరిమితులను కేంద్రం సోమవారం సవరించింది. కరవు భత్యం పెరిగిన జనవరి 1, 2024 నుంచి పాటు ఈ సవరణ అమల్లోకి వచ్చింది. -
యూజీసీ నెట్ తేదీలో మార్పు
యూజీసీ నెట్ పరీక్ష తేదీ మారింది. ఈ పరీక్షను జూన్ 18న నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ జగదీశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. వాస్తవానికి దాన్ని జూన్ 16న నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. -
ఖలిస్థానీ తీవ్రవాదులను ఉపేక్షించడంపై కెనడాకు భారత్ తీవ్ర నిరసన
భారత్ వ్యతిరేక కార్యకలాపాలను బాహాటంగా నిర్వహిస్తున్న ఖలిస్థానీ వేర్పాటువాదులు, తీవ్రవాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వారికి సహకరిస్తున్న కెనడా తీరుపై మన విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్లీలోని కెనడా డిప్యూటీ హై కమిషనర్ స్టీవార్ట్ వీలర్ను సోమవారం పిలిపించుకుని తీవ్ర నిరసన తెలిపింది. -
కేజ్రీవాల్, ఆతిశీలపై పరువు నష్టం దావా
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రి ఆతిశీలపై సోమవారం దిల్లీ కోర్టులో పరువు నష్టం దావా దాఖలైంది. వారిద్దరూ భాజపా, ఆ పార్టీ సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారంటూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తాన్యా బామనీయాల్ ఎదుట కాషాయ పార్టీ దిల్లీ శాఖ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఫిర్యాదు దాఖలు చేశారు. -
శ్రీలంక సీతమ్మగుడికి సరయూ జలాలు
శ్రీలంకలో సీతమ్మ ఆలయ ప్రాణప్రతిష్ఠకు భారత్ నుంచి సరయూనదీ జలాలు వెళుతున్నాయి. సంప్రోక్షణ కార్యక్రమంలో వినియోగించేందుకు అయోధ్యలోని సరయూ జలాలను పంపమని శ్రీలంక ప్రతినిధులు లేఖలో కోరారు. -
చంద్రయాన్-3 ప్రయోగంలో 4 సెకన్ల జాప్యం
చందమామ దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3.. ప్రయోగ సమయంలో అంతరిక్ష వ్యర్థాలను ఢీ కొట్టే పరిస్థితిని తప్పించుకోవడానికి 4 సెకన్లపాటు ఆలస్యంగా బయలుదేరింది. -
బాలిక గర్భవిచ్ఛిత్తిపై సుప్రీం ఆదేశాలు వెనక్కి
అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసేందుకు అనుమతిస్తూ ఈ నెల 22న జారీచేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం సీజేఐ ఛాంబర్లో విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది. -
నీట్-పీజీ ఇంటర్న్షిప్ కటాఫ్ పొడిగింపు సాధ్యంకాదు: సుప్రీం
ఈ ఏడాది జూన్ 23న జరిగే నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. -
కొలీజియం రద్దుకు పిటిషన్
ఉన్నత న్యాయవ్యవస్థలో జడ్జీల నియామకం కోసం అమలవుతున్న కొలీజియం విధానం రద్దుకు దాఖలైన పిటిషన్ను లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మాథ్యూస్ నెడుంపారా అనే న్యాయవాది దీన్ని దాఖలుచేశారు. -
సీఏ పరీక్షల వాయిదాకు ‘పిల్’
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. -
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగాన్ని ముందుగా అనుకున్న సమయానికంటే 4 సెకన్లు ఆలస్యంగా చేపట్టినట్లు ఇస్రో తాజా నివేదికలో వెల్లడించింది. -
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
పెళ్లి పత్రికలో ప్రధాని మోదీ పేరును ప్రస్తావించడం ఓ నవ వరుడిని చిక్కుల్లో పడేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!