Bengaluru: బెంగళూరును ముంచెత్తిన వర్షం.. ఏపీకి చెందిన టెకీ మృతి
బెంగళూరులో భారీ వర్షం కురిసింది. ఆర్కే సర్కిల్లో భారీగా వరదనీరు చేరింది. దీంతో విహారయాత్రకు వెళ్లిన ఓ తెలుగు కుటుంబం అందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు: బెంగళూరు మహానగరాన్ని అకాల వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం భారీ ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల వడగండ్ల వాన కురిసింది. భారీగా గాలులు వీయడం వల్ల పెద్దపెద్ద వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. కేఆర్ సర్కిల్ అండర్పాస్లో కారు చిక్కుకొని ఏపీకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ భానురేఖ ప్రాణాలు కోల్పోయారు. కుమారకృప రోడ్డు మార్గంలో చెట్టు విరిగిపడటంతో ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. చిత్రకళాపరిషత్ ఎదుట ఓ చెట్టు కుప్పకూలింది. దీంతో ఓ కారు, బైకు ధ్వంసమయ్యాయి.
అండర్పాస్లో చిక్కుకొని..
బెంగళూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి కేఆర్ సర్కిల్ వద్ద అండర్పాస్లోకి పెద్దమొత్తంలో వరద నీరు చేరడంతో ఓ కారు చిక్కుకుపోయింది. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రయాణిస్తుండగా.. స్థానికులు నలుగురిని బయటకి తీశారు. అందులో భానురేఖ పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. మిగతా ఇద్దరిని అతికష్టం మీద బయటకు తీశారు. వీరంతా ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. విహారయాత్ర కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
కొత్తవారు కావడంతో అక్కడి పరిస్థితులను అంచనా వేయలేకపోయారు. అండర్ పాస్లో కొంతదూరం వెళ్లేసరికి కారు పూర్తిగా మునిగిపోయింది. ప్రాణభయంతో వారంతా బయటకి వచ్చేశారు. కానీ, అప్పటికే పీకల్లోతు నీటిలోకి వెళ్లిపోవడంతో కాపాడాలంటూ కేకలు వేశారు. గమనించిన స్థానికులు నలుగురిని బయటకి తీశారు. మరో ఇద్దరిని తేవడం కష్టంగా మారడంతో గజఈతగాళ్లను రప్పించి అండర్పాస్ బయటకి తీసుకొచ్చారు.
సిద్ధరామయ్య అత్యవసర భేటీ
బెంగళూరు నగరాన్ని అకాల వర్షం అతలాకుతలం చేయడంపై అకాల వర్షాలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.అవసరమైతే అత్యవసర ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించాలని సూచించారు. బానురేఖ చికిత్స పొందిన ఆస్పత్రిని సిద్ధరామయ్య సందర్శించారు. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పుడు కేసులతో భర్తను వేధించడం క్రూరత్వమే
లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేసి వేధించడాన్ని క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం స్పష్టం చేసింది. -
పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రాందేవ్, ఆచార్య బాలకృష్ణ, సంబంధిత సంస్థ సంయుక్తంగా.. వార్తా పత్రికల్లో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. -
దక్షిణాసియాలో ఈసారి వానలే వానలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో దక్షిణాసియా అంతటా సాధారణాన్ని మించి వర్షాలు కురుస్తాయని సౌత్ ఆసియా క్లైమేట్ అవుట్లుక్ ఫోరం (ఎస్ఏఎస్సీవోఎఫ్) మంగళవారం వెల్లడించింది. -
ఓటు వేయాలని గుర్తుచేసే ‘బడ్డీ బ్యాండ్’
తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్ బూత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. -
కేజ్రీవాల్ను ఎన్నికల ముందే ఎందుకు అరెస్టు చేశారు?
దేశంలో సరిగ్గా సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ముందే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ను సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఓ తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చారు. -
జమ్మూలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు కొండ చరియలు విరిగిపడటంతో జమ్మూలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయి. -
మణిపుర్ ఘటనలో పోలీసుల ప్రేక్షకపాత్ర
దేశంలో కలకలం రేపిన మణిపుర్ దాడుల ఘటనలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడమే కాకుండా, సాయం కోరి వచ్చిన బాధితులను ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిమూకలకు సహకరించేలా వ్యవహరించారని సీబీఐ ఛార్జిషీటులో వెల్లడించింది. -
శారదా మఠం అధ్యక్షురాలు ఆనందప్రాణ కన్నుమూత
శ్రీ శారదా మఠం, రామకృష్ణ శారదా మిషన్ అధ్యక్షురాలు ప్రవ్రాజిక ఆనందప్రాణ మాతాజీ మంగళవారమిక్కడ కన్నుమూశారు. -
నిర్బంధ శిబిరాల్లో విదేశీయులు ఎంతమంది ఉన్నారు?
అస్సాంలోని నిర్బంధ శిబిరాల్లో రెండేళ్లకు పైగా ఎంత మంది విదేశీయులు ఉన్నారో నివేదించాలని ఆ రాష్ట్ర న్యాయ సేవల సంస్థను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పశ్చిమబెంగాల్లో 47.6 డిగ్రీలు
దేశంలో ఎన్నడూ లేనంతగా వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్లోని కలాయ్కుందాలో మంగళవారం వేసవి తాపం 47.6 డిగ్రీల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. -
మణిపుర్లో ఆయుధాల తరలింపును అడ్డుకున్న మహిళలు
మణిపుర్లోని బిష్ణుపుర్ జిల్లాలో స్వాధీనం చేసుకొన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సైనికదళాలు మంగళవారం తరలిస్తుండగా మహిళల సారథ్యంలోని ఆందోళనకారులు అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రజ్వల్పై నివేదికకు మహిళా కమిషన్ ఆదేశం
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతంపై అన్ని వివరాలతో మూడు రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) ఆదేశించింది. -
1950లను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు ఆస్తిపై వ్యాఖ్యానం చేయకూడదు: సుప్రీం
‘‘ఏ ప్రైవేటు ఆస్తి సమాజ వనరు కాదు.. అన్ని ప్రైవేటు ఆస్తులూ సమాజ వనరులే .. ఈ రెండు పరస్పర భిన్నమైన విధానాలు. -
అమిత్ షా నకిలీ వీడియో కేసు.. గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవానీ పీఏ అరెస్టు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నకిలీ వీడియోను ఫేస్బుక్లో షేర్ చేశారన్న ఆరోపణలపై ఓ కాంగ్రెస్ నేతను, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తను అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. -
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
Anand Mahindra: సామాజిక మాధ్యమాల వేదికగా ఎప్పుడూ తన అభిప్రాయాలను పంచుకొనే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. -
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక విడాకులు తీసుకున్న కుమార్తెను.. ఆమె తండ్రి మేళతాళాలతో ఊరేగింపుగా పుట్టింటికి తీసుకువచ్చాడు.