IMA : మీ తీరు తీవ్రంగా బాధిస్తోంది
మూడో ముప్పు పొంచిఉందని, ఎట్టిపరిస్థితుల్లో కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం వద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అభ్యర్థించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ.. ఓ ప్రకటన చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తోన్న తీరు తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించింది.
ముప్పు పొంచి ఉంది..అలసత్వం వద్దు
దిల్లీ: మూడో ముప్పు పొంచి ఉందని, ఎట్టిపరిస్థితుల్లో కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం వద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అభ్యర్థించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ.. ఓ ప్రకటన చేసింది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తోన్న తీరు తీవ్రంగా బాధిస్తోందని వ్యాఖ్యానించింది.
‘మహమ్మారుల చరిత్రను గమనిస్తే.. మూడోముప్పు అనివార్యం. ప్రజలు ఏ మాత్రం కొవిడ్ నియమావళిని పాటించకుండా.. గుంపులుగా చేరడం తీవ్రంగా బాధిస్తోంది. ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. విహార, ఆధ్యాత్మిక యాత్రలు అవసరమే. కానీ, మరికొద్ది నెలలు వేచి ఉందాం. కరోనా టీకాలు తీసుకోకుండా చేరుతున్న జన సమూహాలు.. మూడో దఫా విజృంభణకు సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉంది’ అని ఐఎంఏ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాదిన్నర కాలంగా ఉన్న అనుభవాలను పరిశీలిస్తే.. భారీ సంఖ్యలో టీకాల పంపిణీ, కొవిడ్ నియమాళిని పాటించడం ద్వారా మూడో ముప్పు ప్రభావాన్ని తగ్గించగలమని వెల్లడించింది. మరో రెండు మూడు నెలలు జాగ్రత్త వహించాలని సూచించింది. అలాగే రెండో దఫా విజృంభణ సమయంలో వైద్య సిబ్బంది అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇటీవల పలు ఆధ్మాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో ప్రజలు భారీగా గుమిగూడిన దృశ్యాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. అందులో ఎవరు నిబంధనలను పాటించిన దాఖలాలు లేవు. దీనిపై నెట్టింట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. వీటిపై ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. మూడో ముప్పునకు అవకాశం ఇవ్వొద్దని అభ్యర్థించింది. ఈ క్రమంలోనే ఐఎంఏ ప్రకటన విడుదలైంది.
ఇదిలా ఉండగా.. మూడో ముప్పుపై నివేదికలు వస్తోన్న తరుణంలో అందుకు తగ్గట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. రెండోదశలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని ఆరోగ్య శాఖ నూతన మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. అత్యవసర ప్రతిస్పందన నిమిత్తం ఇటీవల కేంద్ర కేబినెట్ రూ. 23వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించిందని చెప్పారు. చిన్నారుల కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే సరైన సమయంలో స్పందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద బఫర్ స్టాక్ సిద్ధంగా ఉండేలా చూస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి
తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. -
రహదారిపై గుంతలు మాయం!
రోడ్లపై గుంతలు వాహనదారులను వేధిస్తున్నాయి. వీటివల్ల ప్రయాణ సమయం పెరగడం, వాహనాలు దెబ్బతినడం, ట్రాఫిక్ జామ్ వంటి ఇక్కట్లు తలెత్తుతున్నాయి. -
ప్రజ్వల్ కేసుల్లో బాధితుల కోసం ‘హెల్ప్లైన్’
కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్.డి.రేవణ్ణలు వందలమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డారనే కేసుల్లో బాధితుల కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) టోల్ఫ్రీ నంబరును ఏర్పాటు చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల్లో ఓట్లశాతం తగ్గుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహాదారుడు, ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. -
అరవింద్ కేజ్రీవాల్పై మరో పిడుగు
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై, తిహాడ్ జైలులో ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఆయనపై సోమవారం మరో పెద్ద పిడుగు పడింది. -
ఇక ఆస్ట్రేలియా వీసాకు టోఫెల్ స్కోరు: ఈటీఎస్
ఆస్ట్రేలియా వీసాకు సంబంధించి టోఫెల్ (ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఈటీఎస్) సోమవారం ప్రకటించింది. -
వీసీల నియామకంపై రాహుల్ అసత్య ప్రచారం
విశ్వవిద్యాలయాల్లో ఉప కులపతుల(వీసీ) ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉప కులపతులు, మాజీ ఉప కులపతులు సహా 181 మంది విద్యావేత్తలు బహిరంగ లేఖ విడుదల చేశారు. -
ఝార్ఖండ్లో గదినిండా నోట్లకట్టలు
ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్ అది. ఓ కేసు దర్యాప్తులో ఆ ఇంటి తలుపులు తెరిచి చూసిన ఈడీ అధికారులకు గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు కనిపించాయి. -
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల వెల్లడి
సీఐఎస్సీఈ 10, 12 ఫలితాల్లో బాలురపై బాలికలు మరోసారి సత్తా చాటారు. సోమవారం ఉదయం వెల్లడైన ఫలితాల్లో ఈ దఫా రెండు తరగతులకు సంబంధించిన ఉత్తీర్ణత శాతం కొద్దిగా మెరుగైంది. -
అహ్మదాబాద్లో 16 పాఠశాలలకు బాంబు బెదిరింపు
గుజరాత్లోని 25 లోక్సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనున్న వేళ అహ్మదాబాద్లోని 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. -
ఎన్నికల నియమావళి కేసులో ఉమర్ అన్సారీకి ముందస్తు బెయిల్
గ్యాంగ్స్టర్, రాజకీయ నేత, దివంగత ముక్తార్ అన్సారీ కుమారుడు అమర్ అన్సారీకి ఎన్నికల నియమావళి కేసులో సోమవారం సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. -
సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఝార్ఖండ్ హైకోర్టు కొట్టివేయడాన్ని మాజీ సీఎం హేమంత్ సోరెన్.. సోమవారం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. -
న్యాయాధికారుల రిక్రూట్మెంట్లో గడువుకు కట్టుబడరేం?
న్యాయాధికారుల నియామకాలకు కాలావధిని నిర్దేశించినా రాష్ట్రాలు కట్టుబడటంలేదని సుప్రీంకోర్టు సోమవారం ఆక్షేపించింది. -
నీట్ పేపర్ లీక్ అవాస్తవం
దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షల్లో ప్రశ్నపత్రం లీక్ అయిందని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటికి ఎటువంటి ఆధారాలు లేవంటూ ఎన్టీఏ కొట్టిపారేసింది. -
1992 ముంబయి దాడుల కేసులో న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయండి
బాధితులకు నష్టపరిహారం చెల్లింపు, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, పోలీస్ సంస్కరణలు సహా 1992 ముంబయి దాడుల కేసులో తాము జారీ చేసిన ఆదేశాలను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్లో ఒకే కాన్పులో అయిదుగురు ఆడశిశువులు
బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఓ మహిళ ఒకే కాన్పులో అయిదుగురు ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. -
కేరళ తీరంలో ఇరాన్ పడవ స్వాధీనం
ఇరాన్కు చెందిన ఓ పడవను కేరళ తీరంలో భారతీయ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) బలగాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. -
జాఫ్నా-నాగపట్నం మధ్య 13 నుంచి ప్రయాణికుల నౌకలు
భారత్-శ్రీలంక మధ్య ప్రయాణికుల నౌకల రాకపోకలు ఈ నెల 13 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. -
ఆస్ట్రేలియా వీసాలకు.. ఇక ‘టోఫెల్’ స్కోర్ చెల్లుబాటు
అన్ని ఆస్ట్రేలియా వీసాలకు టోఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) స్కోర్ ఇక నుంచి చెల్లుబాటు అవుతుందని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది. -
‘నేనూ ఎంజాయ్ చేశా’.. తనపై వచ్చిన వీడియోను రీట్వీట్ చేసిన మోదీ
తనపై వచ్చిన ఓ మీమ్ విషయంలో ప్రధాని మోదీ (PM modi) మాత్రం చాలా హుందాగా వ్యవహరించారు. సోషల్మీడియాలో తనపై వచ్చిన ఓ వీడియో చూసి తాను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు.