India Corona : 27 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 30 వేల దిగువకు చేరడం ఊరటకలిగిస్తోంది.

Updated : 15 Feb 2022 10:34 IST

1 శాతం దిగువకు క్రియాశీల రేటు..

దిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి క్రమంగా అదుపులోకి వస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 30 వేల దిగువకు చేరడం ఊరటకలిగిస్తోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా 350లోపే నమోదైంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

Δ గడిచిన 24 గంటల్లో 12,29,536 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 27,409 కేసులు నమోదయ్యాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 2.23 శాతానికి పడిపోయింది.

Δ నిన్న 347 మరణాలు చోటుచేసుకోగా.. ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 5,09,358కి చేరింది.

Δ గత కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా నమోదవుతుండటం సానుకూలాంశం. గడిచిన 24 గంటల్లో 82,817 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.17 కోట్లు దాటింది. దీంతో రికవరీ రేటు 97.82%కి పెరిగింది.

Δ ఇక క్రియాశీల కేసులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 4,23,127 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  ఈ రేటు 1 శాతం దిగువకు(0.99%) తగ్గింది.

Δ ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ వేగంగా కొనసాగుతోంది. నిన్న 44,68,365 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 173 కోట్లు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని