Arvind Kejriwal: మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ గైర్హాజరు..

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) మరోసారి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటివరకూ మూడుసార్లు ఈడీ ఆయనకు నోటీసులు ఇచ్చింది.

Updated : 03 Jan 2024 10:10 IST

దిల్లీ: మద్యం కుంభకోణం కేసు (liquor policy case)లో విచారణకు హాజరుకావడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED)కు సమాచారం ఇచ్చారు. ఆ నోటీసులు అక్రమమని, కేజ్రీవాల్‌ను అరెస్టు చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆప్‌ ఆరోపించింది.

కేజ్రీవాల్‌(Arvind Kejriwal)కు ఇప్పటివరకు మూడుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ.. తాను రావడం లేదని ఈడీకి ముఖ్యమంత్రి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆప్‌ స్పందించింది. ‘దర్యాప్తు సంస్థకు సహకరించడానికి కేజ్రీవాల్‌ సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారు..? ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం ఇది. ఆయన్ను అరెస్టు చేసే ఉద్దేశం కనిపిస్తోంది’ అని పార్టీ ఆరోపించింది.

‘హేమంత్‌ సోరెన్‌ సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు!’

కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ.. కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను విచారించిన విషయం తెలిసిందే. గత ఏడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించించింది. అనంతరం ఈడీ నుంచి సమన్లు వచ్చాయి. ఇదిలా ఉండగా.. ఈ కేసులో గత ఫిబ్రవరిలో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా అరెస్టయ్యారు. ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని