Kejriwal: ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ఏదైనా చేస్తుంది : భాజపాపై కేజ్రీవాల్‌ ఫైర్‌

ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ఏదైనా చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ఆరోపించారు.

Published : 21 Feb 2024 15:49 IST

దిల్లీ: చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక చెల్లదంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన సంచలన తీర్పు నేపథ్యంలో భాజపాపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ఏదైనా చేస్తుందని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన.. వారి (భాజపా) నిజ స్వరూపాన్ని భగవంతుడే ప్రజల ముందు ఉంచాడన్నారు. ఈసందర్భంగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల్లో భాజపా గెలవదనే ఘటన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక నిరూపించిందన్నారు.

‘జనవరి 30 నాటి ఎన్నిక ఫలితాన్ని పక్కనపెడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల్లో గెలిచేందుకు కాషాయ పార్టీ ఏదైనా చేస్తుంది. ఎమ్మెల్యేలకు ఎరవేయడం, ప్రభుత్వాలను బహిరంగంగా కూల్చివేసే ప్రయత్నాలకు పాల్పడుతోంది’ అని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఆ పార్టీ ఎటువంటి ప్రయత్నాలు చేసినా చివరకు ధర్మమే గెలుస్తుందన్నారు. దిల్లీ సరిహద్దులో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలపై (Farmers protest) స్పందించిన ఆయన  కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. రైతులను నగరంలోకి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కల్పించకపోవడమే కాక వారి సమస్యలు కూడా వినడం లేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని