Sharad Pawar: మణిపుర్ అంశాన్ని పదే పదే లేవనెత్తడానికి అసలు కారణం అదే: పవార్
మణిపుర్ సమస్య కేవలం ఆ ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదని ఎన్సీపీ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ అన్నారు. సోమవారం ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.
బారామతి: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో నిన్న తాను భేటీ అయిన నేపథ్యంలో మహావికాస్ అఘాడీ కూటమిలో ఎలాంటి సమాచారలోపం లేదని ఎన్సీపీ అధినేత శరద్పవార్(Sharad Pawar) స్పష్టంచేశారు. మహారాష్ట్ర(Maharashtra)లో తమ కూటమి ఐక్యంగానే ఉందని.. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో విపక్ష కూటమి ‘ఇండియా’(I.N.D.I.A.) సమావేశం విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. అజిత్ పవార్తో సమావేశం కావడంతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించాలని కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పవార్ను కోరవడంతో సోమవారం బారామతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు అంశాలకు సమాధానాలు ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మణిపుర్ అంశాన్ని విపక్ష ‘ఇండియా’ కూటమి పదే పదే లేవనెత్తడానికి గల కారణాలను వివరించారు.
మణిపుర్ అంశం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాదు..
మణిపుర్ సమస్య(Manipur Issue) కేవలం ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమైంది కాదని పవార్ (Sharad Pawar) అన్నారు. కొన్ని ఈశాన్య ప్రాంతాలు చైనా(China) సరిహద్దు వెంబడి ఉన్నాయని.. మణిపుర్ దాటి ఒక దేశమే ఉందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఎదుర్కొనే కష్టాలపై ప్రభుత్వం దృష్టిసారించకపోతే.. అది మన దేశానికి అత్యంత ఆందోళనకరమైన అంశంగా మారే ప్రమాదం ఉందన్నారు. అందుకే పార్లమెంట్లో మణిపుర్ అంశాన్ని విపక్ష పార్టీలు పదే పదే లేవనెత్తేందుకు ప్రయత్నించాయని, చర్చకు డిమాండ్ చేశాయని పవార్ అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక నిర్దిష్ట సెక్షన్ కింద చర్చించే ఉద్దేశంతో లేకపోవడంతో ఆ డిమాండ్ నెరవేరలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చకు సమాధానంగా రెండు గంటలకు పైగా ప్రసంగించినా మణిపుర్ అంశంపై మాత్రం పరిమితంగానే మాట్లాడారన్నారు. ఆయన ప్రసంగం మణిపుర్ ప్రజలకు కొంత భరోసాను కల్పించేలా లేదని పవార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ను భాజపా నిందిస్తుండటంపై అడిగిన ప్రశ్నకు పవార్ దీటుగా స్పందించారు. గత తొమ్మిదేళ్లలో భాజపా ఏం చేసిందని 30 ఏళ్ల క్రితం కాంగ్రెస్ చేసినదాన్ని ప్రశ్నించడానికి అంటూ నిలదీశారు. ఠానేలోని ప్రభుత్వ ఆస్పత్రిలో 24గంటల వ్యవధిలో 18మంది మృతిచెందడంపై పవార్ ఆందోళన వ్యక్తంచేశారు. సీఎం ఏక్నాథ్ శిందే సొంత నగరమైన ఠానేలోనే ఈ ఘటన జరిగిందన్న ఆయన.. తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు.
చార్ధామ్ యాత్ర రెండు రోజుల పాటు నిలిపివేత.. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్
అదే అడిగి మరింత కన్ఫ్యూజన్ సృష్టించొద్దు..
అజిత్ పవార్(Ajit pawar)తో తాను సమావేశమైన విషయంలో మహారాష్ట్రలో తమ భాగస్వామ్య పక్షాలు (కాంగ్రెస్, శివసేన-యూబీటీ) మధ్య ఎలాంటి గందరగోళం లేదని శరద్ పవార్ స్పష్టంచేశారు. మళ్లీ అదే ప్రశ్న అడిగి మరింత కన్ఫ్యూజన్ సృష్టించవద్దని మీడియా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ‘‘నేను, ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే ఇండియా కూటమి సమావేశం ముంబయిలో నిర్వహించే బాధ్యతను తీసుకున్నాం’’ అన్నారు. ఈ భేటీ ఓ లగ్జరీ హోటల్లో జరుగుతుందని చెప్పారు. మరోవైపు, అజిత్ పవార్, శరద్ పవార్ల మధ్య తరచూ జరుగుతున్న సమావేశాలపై అసంతృప్తిని వ్యక్తంచేస్తూ శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో రాసిన కథనంపై ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.
జయంత్ విషయంలోనూ అలాంటి ప్రయత్నమే జరుగుతోంది..
ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ భాజపాతో చేతులు కలిపే అవకాశం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై నిన్న పుణెలో అజిత్ పవార్తో సమావేశంలో చర్చించారా? అని అడిగిన ప్రశ్నకు శరద్ పవార్ స్పందించారు. అలాంటి చర్చలేమీ జరగలేదని స్పష్టంచేశారు. ‘జయంత్ పాటిల్ సోదరుడికి ఈడీ నుంచి నోటీసులు అందినట్టు విన్నా. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. నా సహచరులకు కొందరికి కూడా ఇలాగే నోటీసులు వచ్చాయి. దీంతో వారు భాజపాతో వెళ్లారు. జయంత్ పాటిల్ విషయంలో అలాంటి ప్రయత్నమే జరుగుతోంది. అయితే, సైద్ధాంతికంగా ఆయన వైఖరి స్పష్టంగా ఉందని అనుకుంటున్నా’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది. -
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం. -
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
అమిత్ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్ (Twitter)తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. -
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది. -
తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్ మహిళకు బీఎస్ఎఫ్ సాయం
భారత్లో మరణించిన తన తండ్రిని కడసారి చూసేందుకు బంగ్లాదేశ్కు చెందిన ఓ మహిళకు వీలు కల్పించి సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) తన మానవతా హృదయాన్ని చాటుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్