సింగపూర్ నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్..
దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్న వేళ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో పలు ఆసుపత్రులకు ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రాణవాయువు అందించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆక్సిజన్ సరఫరాకు పలు దేశాల సహకారం తీసుకుంటోంది....
వీడియోను పంచుకున్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ
దిల్లీ: దేశంలో కరోనా మహోగ్రరూపం దాలుస్తున్న వేళ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సకాలంలో పలు ఆసుపత్రులకు ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రాణవాయువు అందించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఆక్సిజన్ సరఫరాకు పలు దేశాల సహకారం తీసుకుంటోంది. ప్రాణవాయువు సరఫరాకు సింగపూర్తో జరిపిన చర్చలు సఫలంకాగా ఆక్సిజన్ అందించేందుకు ఆ దేశం అంగీకరించింది. ఈనేపథ్యంలోనే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఓ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. సింగపూర్లోని చాంగి విమానాశ్రయంలో.. వైమానిక దళ విమానాల్లో భారీ ఆక్సిజన్ ట్యాంకర్లను ఎక్కిస్తున్న వీడియోను పంచుకుంది. త్వరలోనే ఆ ట్యాంకర్లు భారత్కు చేరుకోనున్నాయి.
దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దిల్లీలో సమస్య తీవ్రంగా ఉంది. ప్రాణవాయువు అందక దిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో శుక్రవారం రాత్రి 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 200 మంది ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. దిల్లీలోని అత్యంత ప్రముఖ ఆసుపత్రుల్లో ఒకటైన సర్ గంగారామ్లో ప్రాణవాయువు సరిపడా లేక గురువారం 25 మంది మృతిచెందారు.
తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలు పూర్తికావస్తున్నాయని.. సాయమందించాలని పలు ఆసుపత్రి వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాయి. దిల్లీలోని మూల్చంద్, బాత్రా ఆసుపత్రులు ప్రభుత్వాన్ని కోరగా.. ప్రాణవాయువు కొరత తీర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: జమ్మూకశ్మీర్లో జూన్ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే
-
Sports News
ICC: లాహోర్లో ఐసీసీ ఛైర్మన్.. ప్రపంచకప్లో పాక్ ఆడే అంశం ఓ కొలిక్కి వచ్చేనా..?
-
General News
Weather Update: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
World News
China: భూగర్భంలోకి లోతైన రంధ్రం తవ్వుతున్న చైనా..!
-
India News
Education ministry: 10వ తరగతిలో.. 27.5లక్షల మంది ఫెయిల్..!
-
Crime News
Visakhapatnam: పెందుర్తిలో అర్ధరాత్రి రెచ్చిపోయిన రౌడీ మూకలు