Nagaland: పౌరులపై భద్రతా బలగాల కాల్పులపై ఆగ్రహం.. ఒటింగ్‌లో సైనిక శిబిరంపై దాడి

పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పులతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ఒటింగ్‌లో విధ్వంసానికి దిగారు.

Published : 06 Dec 2021 01:24 IST

ఒటింగ్‌: పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పులతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. ఒటింగ్‌లో విధ్వంసానికి దిగారు. స్ధానిక సైనిక శిబిరంపై దాడి చేశారు. పలు దుకాణాలు, వాహనాలకు నిప్పంటించారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. దుకాణాలకు అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పివేశారు. తాజా ఘటనల నేపథ్యంలో ఒటింగ్‌లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ సంభవించకుండా ఏర్పాట్లు చేశారు.

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని