I.N.D.I.A: ‘ఇండియా’తో భాజపాలో కలవరం.. అందుకే ఇదంతా..: విపక్షాల ధ్వజం
ఇండియా పేరును ఆంగ్లంలోనూ ‘భారత్’గా మార్చాలని కేంద్రం యోచిస్తున్నట్టు వస్తోన్న వార్తలపై విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత హడావుడిగా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.
దిల్లీ/చెన్నై: జీ-20 సమావేశాల సందర్భంగా నేతలకు విందు కోసం President of India బదులుగా President of Bharat అనే పేరుతో రాష్ట్రపతి భవన్ ఆహ్వానం పంపడంపై దుమారం కొనసాగుతోంది. ఆంగ్లంలోనూ ఇండియా పేరును ‘భారత్’గా మార్చే యోచనలో కేంద్రం ఉందన్న వార్తలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారంపై విపక్ష నేతలు తమదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
మరి విపక్ష కూటమి పేరు ‘భారత్’గా మార్చుకుంటేనో..!: కేజ్రీవాల్ ప్రశ్న
విపక్ష కూటమి ‘ఇండియా’ అని పేరు పెట్టుకోవడంతో భాజపా ఆందోళనలో ఉందని.. మరి ఇప్పుడు అదే కూటమి భారత్ అని పెట్టుకుంటే ఆ పేరునూ మార్చేస్తారా? అని ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేదు. కానీ అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? కొన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ‘ఇండియా’గా కూటమిని ఏర్పాటు చేయడం వల్లే. ఒకవేళ ‘ఇండియా’ కూటమి తన పేరును ‘భారత్’ అని మారిస్తే.. అప్పుడు భారత్ పేరును కూడా మారుస్తారా? ఇది ద్రోహం. విపక్ష కూటమి వల్ల భాజపాలో కలవరం నెలకొంది. అందుకే ఒకే దేశం-ఒకేసారి ఎన్నిక ప్రతిపాదనతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది’’ అని అన్నారు.
భాజపాలో ‘ఇండియా’ కలవరం: స్టాలిన్
‘‘నియంతగా వ్యవహరిస్తోన్న భాజపా సర్కార్ను గద్దె దించేందుకు విపక్షాలన్నీ ఏకతాటిపైకి రావడం వల్లే ‘ఇండియా’ పేరును భారత్గా మార్చాలనుకుంటున్నారు. భారతదేశంలో మార్పు తీసుకొచ్చి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దగలుగుతామని అధికారంలోకి వచ్చిన భాజపా.. 9ఏళ్ల తర్వాత ‘భారత్’అని పేరు మార్చాలనుకోవడాన్ని మనం చూస్తున్నాం. విపక్షాల ఐక్యతలో ఉన్న బలాన్ని గుర్తించిన భాజపాలో ‘ఇండియా’ అనే పదం కలవరం రేపుతోంది. ‘ఇండియా’ భాజపాకు అధికారాన్ని దూరం చేస్తుంది’’ అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ట్వీట్ చేశారు.
దేశం పేరు మార్చే అధికారం ఎవరికీ లేదు.. శరద్ పవార్
‘‘దేశం పేరు విషయంలో అధికార పార్టీ ఎందుకింత కంగారుపడుతోందో అర్థం కావట్లేదు. రాజ్యాంగంలో ‘ఇండియా’ పేరును మారుస్తారా? అన్నదానిపై నాకు సమాచారం లేదు. దీనిపై విపక్ష కూటమి సమావేశంలో చర్చిస్తాం. అయితే, ఈ దేశం పేరు మార్చే అధికారం ఎవరికీ లేదు’’ - ఎన్సీపీ అధినేత శరద్ పవార్
ఉన్నట్టుండి మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?: మమత
‘‘ఇండియా అనే పేరును మారుస్తున్నారని తెలిసింది. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో జీ-20 విందుకు ఆహ్వానాలు పంపారు. మన దేశాన్ని ‘భారత్’ అని పిలుస్తాం కదా..! ఇందులో కొత్తేముంది? ఆంగ్లంలో ‘ఇండియా’ అని కూడా అంటాం. ప్రపంచమంతా మన దేశం పేరు ‘ఇండియా’ అనే తెలుసు. ఇప్పుడు ఉన్నట్టుండి దేశం పేరును మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది?చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు’’ - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
భాజపా అసహనానికి నిదర్శనం.. మెహబూబా
‘‘భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రాథమిక సూత్రం భాజపాకు నచ్చట్లేదు. ఆంగ్లంలోనూ ఇండియా పేరును ‘భారత్’ అని మార్చాలనుకోవడం వారి అసహనానికి నిదర్శనం. స్వతంత్ర భారతంలో తొలిసారి భారీ మెజార్టీ ఉన్న ఓ పార్టీ యావత్ దేశాన్ని తమ నియంత రాజ్యంగా భావిస్తోంది’’- జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ
- ఇండియా అనే పేరును దేశం మొత్తం ఆమోదించింది. ప్రత్యేకంగా భారత్ అని మార్చాల్సిన అవసరం లేదు. రాజ్యాంగంలోనే ఇండియా అంటే భారత్ అని ఉంది - కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. -
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన ఓ 14 ఏళ్ల బాలిక 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు ఇటీవల అనుమతించిన సుప్రీంకోర్టు.. ఆ ఆదేశాలను తాజాగా వెనక్కి తీసుకుంది. -
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
ఏటా పాఠ్యపుస్తకాలను సమీక్షించి, అప్డేట్ చేయాలని కేంద్ర విద్యాశాఖ ఎన్సీఈఆర్టీకి సూచించినట్లు సమాచారం. -
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
అమిత్ షా వీడియో ‘మూలాలను’ తెలుసుకునేందుకు ఎక్స్ (Twitter)తోపాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు దిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. -
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
Amit Shah: కేంద్రమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ కొంతసేపు నియంత్రణ కోల్పోయింది. -
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
ఇటీవల కాలంలో డీప్ఫేక్ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. -
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
Arvind Kejriwal: మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని దిల్లీ సీఎం కేజ్రీవాల్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. -
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
సందేశ్ఖాలీ కేసు విషయంలో సుప్రీంకోర్టు పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది. -
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
PM Modi: బస్టాండ్లో పండ్లు విక్రయించుకుంటూ జీవనం గడిపే ఓ మహిళను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కలిశారు. ఇంతకీ ఎవరామె..? -
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
సీఏ పరీక్షల షెడ్యూల్ అనేది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం (Supreme Court).. పిల్ను విచారించేందుకు నిరాకరించింది. -
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన, స్ఫూర్తివంతమైన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. -
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో అభ్యంతరకర వీడియోల ఘటన తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ సమయంలో భాజపా-జేడీఎస్ పొత్తుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. -
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసు (Mahadev Betting App Case)లో ఓ నటుడు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వందల కి.మీ. పారిపోయినా.. పోలీసుల ముందు ఆయన ఆటలు సాగలేదు. -
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
Arvind Kejriwal: జైల్లో ఉన్న తన భర్తను చూసేందుకు సునీతా కేజ్రీవాల్ను తిహాడ్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. -
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
Amit Shah: అమిత్ షాకు సంబంధించి కొన్ని నకిలీ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయని భాజపా ఆరోపించింది. దీనిపై కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కేంద్ర మాజీ మంత్రి శ్రీనివాస ప్రసాద్ కన్నుమూత
Sreenivasa Prasad: చామరాజనగర్ నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందిన శ్రీనివాస ప్రసాద్ కన్నుమూశారు. వాజ్పేయీ హయాంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. -
ఈ పానీపూరీ మోదీ చాలా నీట్ గురూ
గుజరాత్లో ప్రధాని మోదీని పోలిన ఒకాయన పానీపూరీ సెంటర్ నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఆయన్ను చూసి నిజంగా మోదీయేనా అంటూ అక్కడికి వచ్చిన వారు అవాక్కవుతున్నారు. -
కొనసా...గుతున్న సమావేశాలు!
గవర్నర్లతో విభేదాలో... రాజకీయ అనివార్యతలో...కారణాలు ఏమైతేనేమి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2023 ఏడాదిలో శాసనసభలు సగటున 22 రోజులు మాత్రమే భేటీ అయ్యాయి. -
నా ముఖం కాదు.. మార్కులు చూడండి
‘చాణక్యుడిని కూడా అందంగా లేడని వేధించారు. అవేవీ అతనిపై ప్రభావం చూపలేదు. నేను అంతే నాపై వచ్చిన ట్రోల్లు నన్ను పెద్దగా బాధించలేదు. -
మాజీ రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈవో
టెక్ బిలియనీర్, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈవో అంకుర్ జైన్, మాజీ మహిళా రెజ్లర్ ఎరికా హమ్మండ్ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఏప్రిల్ 26న ఈజిప్టులో వీరి పెళ్లివేడుక నిరాడంబరంగా జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్