Demolation: ఆ బస్టాండ్‌ను కూల్చేస్తాం.. భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కర్ణాటకలో మసీదును పోలి ఉన్న ఓ బస్టాండ్‌ను కూల్చివేస్తామంటూ భాజపా ఎంపీ ప్రతాప్‌ సింహా(Pratap Simha) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Published : 15 Nov 2022 00:52 IST

మైసూరు: కర్ణాటకలో మసీదును పోలి ఉన్న ఓ బస్టాండ్‌ను కూల్చివేస్తామంటూ భాజపా ఎంపీ ప్రతాప్‌ సింహా(Pratap Simha) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మైసూరు-ఊటీ రోడ్డులో ఉన్న ఓ బస్టాండ్‌ను కూల్చివేయాలంటూ ఆయన అధికారుల్ని ఆదేశించడంపై విమర్శలు వస్తున్నాయి. ‘ఈ బస్టాండ్‌ని సోషల్ మీడియాలో చూశా. ఆ బస్టాండ్‌కు రెండు డూమ్‌లు ఉన్నాయి, మధ్యలో పెద్దదిగా ఉండగా.. దాని పక్కన చిన్న డూమ్‌ ఉంది. అది మసీదే. మూడు నాలుగు రోజుల్లో దాన్ని కూల్చివేయాలని ఇంజినీర్లకు చెప్పా. వాళ్లు చేయకపోతే నేనే జేసీబీ తీసుకెళ్లి దాన్ని కూల్చివేస్తా’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. మైసూరు ఎంపీ ప్రతాప్‌ సింహా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ తప్పుపట్టింది. మైసూరు ఎంపీ చేసిన వ్యాఖ్యలు మూర్ఖత్వంగా ఉన్నాయని.. మరి గుంబజ్‌/డూమ్‌లను కలిగిన ప్రభుత్వ కార్యాలయాలనూ కూల్చివేస్తారా? అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సలీం అహ్మద్‌ మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని