777 Charlie: ‘777 ఛార్లి’ ఓటీటీ రిలీజ్‌.. కానీ వాళ్లకు మాత్రమే..!

కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ ‘777 ఛార్లి’ (777 Charlie). కిరణ్ రాజ్‌ దర్శకుడు....

Updated : 24 Sep 2022 14:55 IST

హైదరాబాద్‌: కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ ‘777 ఛార్లి’ (777 Charlie). కిరణ్ రాజ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా సెప్టెంబర్‌ 30 నుంచి ‘777 ఛార్లి’ అందుబాటులో ఉండనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ ప్రకటించింది. అయితే, ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్‌ ఉంది. అదేమిటంటే.. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ చందాదారులందరూ చూడటానికి వీలులేదు. ప్రైమ్‌ స్టోర్‌లో ఉండే ఈ చిత్రాన్ని అద్దె చెల్లించి మాత్రమే చూడొచ్చు.

కథేంటంటే..: ఓ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి చిన్నతనం నుంచి ఒంటరిగా జీవితం గడుపుతుంటాడు ధర్మ (రక్షిత్‌ శెట్టి). అలాంటి ధర్మ జీవితంలోకి ఓ రోజు ఛార్లి అనే శునకం ఎంట్రీ ఇస్తుంది. అనుకోని పరిస్థితుల్లో యజమాని ఇంటి నుంచి బయటకు వచ్చిన ఛార్లి ఎలాంటి ఇబ్బందులు పడింది? ధర్మ అనే వ్యక్తిని ఎలా కలుసుకుంది? వారి మధ్య అనుబంధం ఎలా సాగింది? చివరికి ఏమైంది? అన్న ఆసక్తికర కథాంశాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. రానా సమర్పకుడిగా సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా విడుదలై పాజిటివ్‌ టాక్‌ అందుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని