Manchu Manoj: దయచేసి ఇలాంటి న్యూస్‌ను పట్టించుకోవద్దు: మంచు మనోజ్‌ విజ్ఞప్తి

‘ఆ వార్తలు నమ్మకండి’ అంటూ హీరో మంచు మనోజ్‌ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఏం జరిగిందంటే?

Updated : 12 Mar 2024 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వస్తున్న వార్తలపై మంచు మనోజ్‌ (Manchu Manoj) స్పందించారు. వాటిలో నిజం లేదని స్పష్టం చేశారు. అలాంటి రూమర్స్‌ నమ్మొద్దని కోరారు. మనోజ్‌ సతీమణి మౌనిక కవలలకు జన్మనిచ్చారంటూ ఇటీవల పలు యూట్యూబ్‌ ఛానళ్లు స్టోరీలు క్రియేట్‌ చేశాయి. అవి కాస్తా వైరల్‌ కావడంతో వాటిపై స్పష్టత ఇచ్చేందుకు ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా మనోజ్‌ పోస్ట్‌ పెట్టారు.

‘‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరంతా మాకు అండగా ఉన్నందుకు మేం సంతోషిస్తున్నాం. నా సతీమణి ఏడో నెల గర్భవతి. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. కవల పిల్లల విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. సమయం వచ్చినప్పుడు మేమే ఆనందాన్ని మీతో స్వయంగా పంచుకుంటాం. దయచేసి ఇలాంటి న్యూస్‌ను పట్టించుకోవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని