అభిమానిపై అజిత్‌ ఆగ్రహం.. ఆపై ఫోన్‌ లాక్కుని!‌

ప్రముఖ నటుడు అజిత్‌ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరుగుతోన్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తన సతీమణి షాలినీతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు అజిత్‌.

Published : 06 Apr 2021 12:45 IST

చెన్నై: ప్రముఖ నటుడు అజిత్‌ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో జరుగుతోన్న ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అజిత్‌ తన సతీమణి షాలినీతో కలిసి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలింగ్‌ కేంద్రం వద్ద  అభిమానులు ఆయనతో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. దీంతో అజిత్‌ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్‌ని అజిత్‌ కోపంగా లాక్కుని, తన వ్యక్తిగత సిబ్బందికి ఆ ఫోన్‌ని ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని