అభిమానుల్లారా..! కాస్త ఓపిక పట్టండి 

తన అభిమానుల తీరుపై ప్రముఖ తమిళ నటుడు అజిత్‌ అసహనం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ సరైన సమయంలోనే వస్తుందని, అప్పటి వరకు ఓపిక...

Updated : 16 Feb 2021 16:31 IST

చెన్నై: తన అభిమానుల తీరుపై ప్రముఖ తమిళ నటుడు అజిత్‌ అసహనం వ్యక్తం చేశారు. సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ సరైన సమయంలోనే వస్తుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని కోరారు. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘సినిమా అనేది మీకు వినోదం మాత్రమే. కానీ, నాకు మాత్రం వృత్తి. నేను చేసే పనిమీదే నా ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. మనం చేసే పనుల వల్లే సమాజంలో మనకు గౌరవం దక్కుతుంది. పబ్లిక్‌ కార్యక్రమాల్లో సినిమా గురించి అలా అడగటం భావ్యంకాద’ని పేర్కొన్నారు.

అజిత్‌ నటిస్తున్న ‘వాలిమై’ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో  కొందరు అభిమానులు చిత్రబృందంపై ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా చెన్నైలోని చిదంబరం స్టేడియానికి వచ్చిన ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ మొయిన్‌ అలీని సైతం ‘వాలిమై’ అప్‌డేట్‌? అంటూ అడిగేశారు. ఆటలో నిమగ్నమై ఉన్న అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. ఆ వీడియో వైరల్‌ అయింది.

వీటికి స్పందించిన నిర్మాత బోనీ కపూర్‌ ‘వాలిమైపై మీరు చూపిస్తున్న ప్రేమకు గర్వంగా ఉంది. ఫస్ట్‌లుక్‌ తీసుకొచ్చే పనిలోనే ఉన్నాం’ అని ట్వీట్‌ చేశారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో రాబోతున్న చిత్రమిది. పోలీసు పాత్రలో కనిపించనున్నారు అజిత్‌. హ్యూమా ఖురేషీ నాయిక. తెలుగు యువ నటుడు కార్తికేయ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని