Amitabh Bachchan: అయోధ్య రామ మందిరానికి దగ్గర్లో స్థలం కొన్న అమితాబ్‌!

అయోధ్యలో అమితాబ్‌ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Published : 15 Jan 2024 13:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌కు (Amitabh Bachchan) సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. అయోధ్యలో ఆయన స్థలం కొన్నట్లు తెలుస్తోంది. ముంబయికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అయోధ్యలో అభివృద్ధి చేసిన వెంచర్‌లో ఆయన స్థలాన్ని కొనుగోలు చేశారట. 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.14.5కోట్లు ఉంటుందని బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. ఈ స్థలం రామమందిరానికి దగ్గర్లోనే ఉన్నట్లు సమాచారం.

జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం రోజే 51 ఎకరాల్లో సరయూ నది వద్ద ఆ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఓ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్‌ గురించి అమితాబ్‌ గతంలో మాట్లాడుతూ.. ‘అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నేను ఇల్లు నిర్మించుకోవడం కోసం ఎదురుచూస్తున్నా. ఈ నగరం ఎంతో గొప్ప విశిష్టతను కలిగి ఉంది’ అని పేర్కొన్నారు.

ప్రభాస్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌.. మారుతితో సినిమా టైటిల్ అదిరింది!

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను సినీ ప్రముఖులు వీక్షించనున్నారు. చిరంజీవి, ప్రభాస్‌, అమితాబ్ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ దంపతులు, రాజ్‌కుమార్‌ హిరాణీ, రోహిత్‌ శెట్టి, ధనుష్‌, రామ్‌ చరణ్‌ దంపతులు ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు