April 28th: ఈ రోజు ఎన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు విడుదలయ్యాయో తెలుసా?
ఏప్రిల్ 28కి టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అది ఎందుకు స్పెషల్ అనే విషయం మీకు తెలుసా..?
ఇంటర్నెట్ డెస్క్: ఏప్రిల్ 28 (April 28th).. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చరిత్ర లిఖించిన రోజు. టాలీవుడ్లో సరికొత్త రికార్డులు సృష్టించిన సినిమాలు ఆ తేదీనే విడుదలయ్యాయి. అందుకే అది సినీ ప్రియులకు ఎంతో ప్రత్యేకమైంది. ఆ కథేంటంటే..? ఓ చిత్రం సూపర్హిట్ అయితే దాని రిలీజ్ డేట్ గుర్తుపెట్టుకుని మరీ సినీ అభిమానులు ప్రతి ఏడాది అదే రోజున సంబరాలు చేసుకుంటుంటారు. ఆ సినిమా ప్రారంభమైన దశ నుంచి సాధించిన వసూళ్ల వరకు అన్నింటి గురించి చర్చిస్తుంటారు. మరి, వేర్వేరు సంవత్సరాల్లో ఒకే తేదీన విడుదలైన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిస్తే..? అంతకుమించి అనిపించేలా సందడి చేస్తారు. అంతటి హంగామాకు కారణమైన ఈ తేదీన ఏయే చిత్రాలు విడుదలయ్యాయో ఓ లుక్కేద్దామా!
1977లో ప్రారంభం..
‘అడవి రాముడు’ (Adavi Ramudu) సినిమాతో 1977లోనే ఏప్రిల్ 28 స్పెషల్గా నిలిచింది. నందమూరి తారకరామారావు (దివంగత) హీరోగా దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన చిత్రమిది. అప్పటి వరకు సాంఘిక, పౌరాణిక తదితర నేపథ్యాలే ఎక్కువగా కనిపించిన తెలుగు తెరకు అసలైన కమర్షియల్ హంగులు చూపింది ఈ చిత్రమే. అప్పట్లోనే రూ.3 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. 32 కేంద్రాల్లో 100 రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 కేంద్రాల్లో 200 రోజులు, విజయవాడలోని అప్సర థియేటర్లో 302 రోజులు ప్రదర్శితమైందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.
1994లో ఇలా..
కమెడియన్ అలీని హీరోగా పెట్టి డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి చేసిన ప్రయోగం.. ‘యమలీల’ (Yamaleela). 1994 ఏప్రిల్ 28న వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. తల్లీకొడుకుల సెంటిమెంట్కు ఫాంటసీ నేపథ్యాన్ని జోడించి కృష్ణారెడ్డి అప్పట్లో ట్రెండ్ సెట్ చేశారు. ప్రముఖ హీరో కృష్ణ (దివంగత) అతిథిగా మెరిసిన ఈ సినిమా 100కిపైగా రోజులు దిగ్విజయంగా ఆడింది. హైదరాబాద్లోని పలు థియేటర్లలో 400 రోజులు ప్రదర్శితమైందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
2006లో ఊహించని ప్రభంజనం
‘పోకిరి’ (Pokiri) విడుదలతో ఏప్రిల్ 28కు మరింత గుర్తింపు దక్కింది. ప్రముఖ హీరో మహేశ్బాబు, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎవరూ ఊహించని ప్రభంజనం సృష్టించింది. 2006లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 66 కోట్ల వసూళ్లతో టాలీవుడ్లో ఉన్న నాటి రికార్డులను తిరగరాసింది. సుమారు రూ. 12 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి, ఆ స్థాయి వసూళ్లు చేయడం అప్పట్లో సంచలనం. 200 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లలో 175రోజులు, 15 సెంటర్లలో 200రోజులు, కర్నూలులోని ఓ థియేటర్లో సంవత్సరానికిపైగా ప్రదర్శితమైందనేది సినీ వర్గాల మాట. ‘పోకిరి’కి ముందు.. తర్వాత అని తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఆ ప్రశ్నకు సమాధానం ఈ రోజే..
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’.. యావత్ సినీ అభిమానుల ప్రశ్నకు ‘బాహుబలి 2’ (Baahubali 2) సమాధానమిచ్చింది ఏప్రిల్ 28నే. ప్రభాస్, రానా ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెకెక్కించిన ఈ సీక్వెల్ (బాహుబలి 1కి) దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి, సుమారు రూ. 1800 కోట్లు వసూళ్లు చేసి నయా రికార్డు సృష్టించింది. 2017లో ఈ చిత్రం విడుదలైంది.
అందరి చూపూ.. ఏజెంట్ వైపు!
సినీ పరిశ్రమ వారు సెంటిమెంట్గా భావించే ఈ ఏప్రిల్ 28న విడుదలవడంతో ‘ఏజెంట్’ (Agent)పైనే అందరి దృష్టి పడింది. ఆ సినిమాల్లానే ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంటుదనే ఆశాభావం వ్యక్తమవుతోంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి (Surender Reddy) తెరకెక్కించిన సినిమా ఇది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాక్షివైద్య కథానాయిక (Sakshi Vaidya). మలయాళీ ప్రముఖ నటుడు మమ్ముట్టి (Mammootty) కీలక పాత్ర పోషించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?
-
MH370 మిస్సింగ్లో ఏలియెన్స్ ఆధారాలు?.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే..