bhoot police: ఓటీటీలోనే సైఫ్‌ మూవీ..!

సైఫ్‌అలీఖాన్‌ ‘భూత్‌పోలీస్‌’ ఓటీటీపైవే అడుగులు వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రమేష్ తౌరానీ తెలిపారు

Published : 03 Jun 2021 17:27 IST

సెప్టెంబరులో విడుదల

ముంబయి: కరోనా సెకెండ్‌వేవ్‌ దెబ్బకు థియేటర్లు అన్నీ మూతపడిన విషయం తెలిసిందే. ఇటీవలే సల్మాన్‌ ‘రాధే’ ఓటీటీలో విడుదలవ్వగా, ఇప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ ‘భూత్‌పోలీస్‌’ సైతం అటువైపే అడుగులు వేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రమేష్ తౌరానీ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘పరిస్థితులు చూస్తే ఇప్పట్లో థియేటర్లు ప్రారంభమయ్యేలా లేవు. నవంబరు ముందైనా 50శాతం అనుమతితో తెరుస్తారో లేదో ప్రశ్నార్థకమే. అందుకే ఓటీటీ బాట పట్టాల్సి వస్తోంది. దీనికి ఈ చిత్ర నటీనటులు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అందుకే డిస్నీహాట్‌ స్టార్‌లో సెప్టెంబరులో విడుదల చేయనున్నాం’’ అన్నారు.

హారర్‌-కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు పవన్ కృపలాని. సైఫ్‌అలీఖాన్‌, అర్జున్‌కపూర్‌, యామీగౌతమ్‌, జాక్వెలిన్ ఫెర్నాండజ్‌ ప్రధానపాత్రలు పోషించగా టాలీవుడ్‌ సినిమాటోగ్రాఫర్‌ జయకృష్ణ గుమ్మాడి ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. రమేష్‌ తౌరానీ, అక్షయ్‌ పూరీ నిర్మాతలుగా వ్యవహరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని