మన్యంలో చరణ్‌ దంపతుల సందడి

‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఎ.వీరవరంలో రామ్‌చరణ్‌ దంపతులు సందడి చేశారు. సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఎ.వీరవరం, కొత్త అంగుళూరు...

Published : 05 Mar 2021 11:54 IST

హైదరాబాద్‌: ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఎ.వీరవరంలో రామ్‌చరణ్‌ దంపతులు సందడి చేశారు. సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఎ.వీరవరం, కొత్త అంగుళూరు వద్ద గోదావరి ఒడ్డున ‘ఆచార్య’ పాట చిత్రీకరణ చేశారు. దీంతో రామ్‌చరణ్‌ను చూడటానికి అభిమానులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు.

విద్యార్థులతో ఉపాసన ముచ్చట్లు

దేవీపట్నంలోని పాఠశాల విద్యార్థులతో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ముచ్చటించారు. గురువారం దేవీపట్నం వచ్చిన ఆమె తొయ్యేరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా మాట్లాడారు. పలువురు విద్యార్థినులు ఆమెతో సెల్ఫీలు దిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని