God Father: ‘గాడ్ ఫాదర్’లో పవన్ నటిస్తే బాగుండేది కానీ: చిరంజీవి
చిరంజీవితో ‘ఇన్స్టాగ్రామ్’ వేదికగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ముచ్చటించారు. పూరీ పలు ప్రశ్నలు అడగ్గా చిరు నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆ విశేషాలివీ..
ఇంటర్నెట్ డెస్క్: చిరంజీవి (Chiranjeevi) హీరోగా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించిన చిత్రం ‘గాడ్ ఫాదర్’ (God Father). ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో.. చిత్రంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) చిరుతో ‘ఇన్స్టాగ్రామ్’ వేదికగా ముచ్చటించారు. పూరీ పలు ప్రశ్నలు అడగ్గా చిరు నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆ విశేషాలివీ..
* సినిమా ఎంపికలో దేనికి ప్రాధాన్యత ఇస్తారు?
చిరంజీవి: కథే నాకు ప్రాధాన్యం. దర్శకులు కథ చెబుతున్నప్పుడే నేను విజువల్స్ను ఊహించుకుంటా. అది నా మనసుకు నచ్చితే సినిమా చేసేందుకు ఓకే చెబుతా. పాటలు, ఫైట్లు సెకండరీ. అవి అలంకారంలాంటివి. కంటెంట్ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేస్తే పరాజయం పొందే అవకాశం తక్కువగా ఉంటుంది.
* ‘గాడ్ ఫాదర్’.. పొలిటికల్ డ్రామా కదా. మీకు బాగా ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు ?
చిరంజీవి: ఇప్పటి నాయకుల్లో ఎవరూలేరు. లాల్ బహుదూర్ శాస్త్రి, అటల్ బిహారీ వాజ్పేయీ అంటే బాగా ఇష్టం. వీరి హయాంలో దేశం పురోగతి సాధించింది.
* సల్మాన్ఖాన్ను తొలిసారి ఎప్పుడు కలిశారు?
చిరంజీవి: ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణ సమయం (బ్యాంకాక్)లో కలిశా. ఆ యాడ్ తెలుగులో నేను చేస్తే.. హిందీలో సల్మాన్ చేశాడు. అప్పటి నుంచీ మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నాకు ఆయన సోదరుడిలాంటివాడు. తనకు రామ్చరణ్ అంటే ఎంతో ప్రేమ. తను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చరణ్ను కలుస్తాడు. సల్మాన్ ఇచ్చిన జాకెట్ ఇప్పటికీ చరణ్ దగ్గర భద్రంగా ఉంది. ఈ సినిమాలో నటించినందుకు సల్మాన్ రెమ్యునరేషన్ తీసుకోలేదు. అతని పుట్టినరోజున చరణ్ ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు.
* ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ నటిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారు..!
చిరంజీవి: అవును. సల్మాన్ చేసిన పాత్రలో కల్యాణ్ కనిపించినా బాగుంటుంది. ఒకవేళ నటించమని కోరితే కల్యాణ్ కాదనేవాడు కాదేమో. కానీ, సల్మాన్ చేస్తే న్యాయంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చేవాడు. ఇతర భాషల్లో కూడా విడుదల చేసే ఆలోచన ఉండటం వల్ల సల్మాన్ఖాన్ను తీసుకున్నాం.
* ఈ సినిమాలో నాకెందుకు అవకాశం ఇచ్చారు?
చిరంజీవి: లాక్డౌన్లో మీ పాడ్కాస్ట్లు బాగా విన్నా. మీ డిక్షన్ బాగా నచ్చింది. ఇలాంటి గళమే ‘గాడ్ ఫాదర్’ కథని వినిపించాలి అనుకున్నా. అందుకే యూట్యూబర్ అయిన గోవర్థన్ పాత్రకు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నా. దర్శకుడు మోహన్కు చెప్పగానే వెంటనే అంగీకరించారు. నా నమ్మకాన్ని మీరు నిలబెట్టారు
పూరీ: మీతో కలిసి నటించాలంటే నాకు చాలా భయమేసింది. అందుకే సత్యదేవ్ను సలహా అడిగా.
* నయనతారతో నటించటం ఎలా అనిపించింది?
చిరంజీవి: తనతో నాకు ఇది రెండో సినిమా. ‘సైరా’లో మేం జంటగా కనిపించాం. కానీ, ఇందులో అన్నాచెల్లెళ్లుగా నటించాం. తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. డెడికేషన్ ఉన్న నటి నయనతార. తన పోర్షన్కు సంబంధించి చిత్రీకరణ పూర్తయినా మరో సీన్ యాడ్ చేయాలనుకుంటున్నామని రమ్మంటే నో చెప్పకుండా వచ్చి నటించింది.
* సత్యదేవ్ గురించి?
చిరంజీవి: సత్యదేవ్ మీ ప్రొడక్ట్. తన విషయంలో మీరెంత ఆనందిస్తున్నారో నాకు తెలుసు. తను నటించిన ‘బ్లఫ్ మాస్టర్’ నాకు బాగా నచ్చింది. ఇదేకాదు ఆయన ఇతర సినిమాల్లోని నటన, వాయిస్ ఆకట్టుకుంది. ఎవరీ అబ్బాయి? అని ఆరా తీస్తుంటే మీరు తెరకెక్కించిన ‘జ్యోతిలక్మి’ గుర్తొచ్చింది. ఓ రోజు సత్యదేవ్ను ఇంటికి పిలిచా. లాక్డౌన్ ఉన్నా వచ్చాడు. నా సినిమా ప్రభావం వల్ల తన తలకు అయిన గాయం గురించి వివరించాడు. త్వరలోనే తను సూపర్స్టార్ అవుతాడు.
* తమన్ను ఆరో ప్రాణం అన్నారు. ఎందుకలా?
చిరంజీవి: సినిమాకు కథ, దర్శకుడు, నటులు, రచయితలు, ఛాయాగ్రాహకుడు.. పంచ ప్రాణాలు. ‘గాడ్ ఫాదర్’ నేపథ్య సంగీతంపై ఆధారపడిన సినిమా. దాన్ని అద్భుతంగా చేశాడు తమన్. అందుకే సంగీత దర్శకుడిని ఆరో ప్రాణం అని అన్నాను. మాతృకలో పెద్దగా పాటలు లేవు. అలాంటిది ఈ రీమేక్ను తమన్ మ్యూజికల్ ఫిల్మ్గా మార్చాడు.
* దర్శకుడిగా మోహన్రాజా ఎందుకు తీసుకున్నారు?
చిరంజీవి: ఈ సినిమా కోసం ముందుగా కొంతమంది దర్శకులను అనుకున్నాం. ‘పాటలు, హీరోయిన్ లేకపోతే రిస్క్’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలంటే ఈ కథే సరైందనే నమ్మకంతో ఉన్నా. ఈ విషయంలో చరణ్ ప్రోత్సహించాడు. నిర్మాత ప్రసాద్.. మోహన్రాజాను సూచించారు. చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమా మాతృక ‘తని ఒరువన్’ డైరెక్టర్ తనేకావటం, నాకు ‘హిట్లర్’ నుంచి తనతో పరిచయం ఉండటం కలిసొచ్చాయి. తన టీమ్తో కలిసి అద్భుతంగా స్క్రిప్టును మలిచాడు.
* మీ నుంచి పూర్తిస్థాయి కామెడీ సినిమా ఆశించొచ్చా?
చిరంజీవి: తప్పకుండా. భవిష్యత్తులో నా నుంచి రాబోయే సినిమాల్లో కామెడీని మీరు మిస్ అవ్వరు. ప్రస్తుతం నటిస్తున్న ‘భోళా శంకర్’, బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలు మీ ఊహకు మించి ఉంటాయి.
* అనుకున్న ఫలితంరాకపోతే ఏం చేస్తారు?
పూరీ: విజయం వస్తే పొగుడుతారు. పరాజయం పొందితే ఫూల్లా చూస్తారు. ఇది సహజం. ఫెయిల్ అయితే ఒత్తిడి ఉంటుంది. అలా అని దాని గురించే ఆలోచించను. ఏం పోగొట్టుకున్నా ఆ బాధల్లోంచి నెలలోనే రికవరీ అయిపోతా. ‘లైగర్’ సినిమా ఫెయిల్ అయినా దాంతో చేసిన ప్రయాణాన్ని ఎంజాయ్ చేశా.
చిరంజీవి: ఫెయిల్యూర్ని సవాలుగా తీసుకోవాలి. ఎక్కడ తప్పు జరిగిందో చెక్ చేసుకోవాలి. అప్పుడు తిరిగి విజయం అందుకోవచ్చు. నేనూ ఆ కసితోనే ‘గాడ్ ఫాదర్’ చేశా.
* ‘ఆటో జానీ’ని ఏం చేశారు?
పూరీ: అది పాత కథ. ఇప్పుడు అంతకంటే మంచి కథ రాస్తా మీకోసం. త్వరలోనే మిమ్మల్ని కలిసి వినిపిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్