Varisu: ‘వారిసు’ వారందరికీ అంకితం: దిల్‌ రాజు

విజయ్‌ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రం ‘వారిసు’. ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను శనివారం నిర్వహించారు. 

Published : 24 Dec 2022 22:55 IST

చెన్నై: ‘వారిసు’ (Varisu) చిత్రం తల్లిదండ్రులందరికీ అంకితమని నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) అన్నారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఆ సినిమా ఆడియో విడుదల వేడుకలో ఆయన మాట్లాడారు. విజయ్‌ (Vijay) హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించిన చిత్రమిది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో రాబోతుంది. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా తమిళ్‌ వెర్షన్‌ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

వేడుకనుద్దేశించి దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా దేనికైనా రీమేకా? సీక్వెలా? అని చాలామంది నన్ను అడిగారు. ‘వారిసు’ రీమేక్‌ కాదు, సీక్వెల్‌ కాదు. పక్కా తమిళ్‌ ఫిల్మ్‌. ఇది విజయ్‌ పేరెంట్స్‌తోపాటు తల్లిదండ్రులందరికీ డెడికేట్‌ చేస్తున్నాం. ఈ సినిమాలో మీకు కావాల్సిన ఫన్‌, ఎమోషన్‌, ఫైట్లు, అదిరిపోయే పాటలు, డ్యాన్స్‌.. ఇలా అన్ని రకాల హంగులున్నాయి. ఈ సంక్రాంతి మనదే’’ అని ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో విజయ్‌ సరసన రష్మిక నటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని