Ajay Bhupathi: ప్రేక్షకులు తప్పక కన్నీళ్లు పెట్టుకుంటారు: అజయ్‌ భూపతి

‘మంగళవారం’ (Mangalavaram) చిత్ర విశేషాలను తాజాగా మీడియాతో పంచుకున్నారు దర్శకుడు అజయ్‌ భూపతి. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు.

Published : 13 Nov 2023 18:15 IST

హైదరాబాద్‌: పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) నటించిన మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ‘మంగళవారం’ (Mangalavaram). కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంగా ఇది సిద్ధమైంది. నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను చిత్ర దర్శకుడు అజయ్ భూపతి (Ajay Bhupati) తాజాగా విలేకర్లతో పంచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆయన పంచుకున్న విశేషాలివే..!

థ్రిల్‌ పక్కా..!

‘‘కథ, హీరోయిన్‌ పాత్ర చిత్రీకరణలో కాంటెంపరరీ పాయింట్‌ ఉంటుంది. సినిమా చూసి ప్రేక్షకులు తప్పకుండా షాక్‌ అవుతారు. గ్రామీణ నేపథ్యంలోసాగే మిస్టీరియస్‌ థ్రిల్లర్‌ ఇది. ఈ చిత్రాన్ని సుమారు 100 రోజులకు పైగా షూట్‌ చేశాం. అందులో ఎక్కువశాతం నైట్‌ షూట్స్‌ మాత్రమే చేశా. ఇది స్క్రీన్‌ ప్లే బేస్డ్ మూవీ. ప్రేక్షకులను ఏమాత్రం గందరగోళానికి గురి చేయకుండా విభిన్నమైన స్క్రీన్‌ప్లేతో దీనిని తీర్చిదిద్దా. పాయల్‌ పాత్ర కొత్తగా ఉండనుంది. తను ప్రాణం పెట్టి యాక్ట్‌ చేసింది. ఆమె నటన చూసి ప్రేక్షకులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.

Tiger 3: థియేటర్‌లో టపాసులు కాల్చిన ఆకతాయిలు.. పరుగులు తీసిన ప్రేక్షకులు.. వీడియో వైరల్‌

పూనకాలే..!

ఈ చిత్రంలో మ్యూజిక్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. అజనీష్‌ లోక్‌నాథ్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. ‘కాంతార’కు అజనీష్‌ అందించిన మ్యూజిక్‌ నాకెంతో నచ్చి ఆయన్ని సంప్రదించా. ఈ చిత్రానికి ఆయన మంచి సంగీతం ఇచ్చారు. ముఖ్యంగా ‘గణగణ మోగాలి’ పాటకు పూనకాలు వచ్చేస్తాయి.

45 నిమిషాలు ముఖ్యం..!

ఎలాంటి అంచనాలు, అపోహలు లేకుండా ఓపెన్‌ మైండ్‌తో సినిమా చూడటానికి రండి. మీరు షాకయ్యే అంశాలు ఇందులో చాలా ఉంటాయి. ఫస్టాఫ్‌ చూస్తే ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. సెకండాఫ్‌లో ఒక్కొక్కటి రివీల్‌ చేస్తుంటే ప్రేక్షకులు షాక్‌ అవుతారు. చివరి 45 నిమిషాలు ఎన్నో ట్విస్టులు ఉంటాయి. సీటు చివర్లో కూర్చోబెడుతుందీ సినిమా. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు.

అల్లు అర్జున్‌కు అప్పుడే తెలుసు..!

ఏడాదిన్నర క్రితమే అల్లుఅర్జున్‌ ఈ కథ విన్నారు. కథ ఆయనకెంతో నచ్చింది. సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇటీవల టీజర్‌, ట్రైలర్‌ విడుదలయ్యాక మెచ్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని