సిధ్‌ శ్రీరామ్‌ నుంచి మరో మెలోడీ..!

‘సామజవరగమన’, ‘ఏమో ఏమో’, ‘మనసా మనసా’ లాంటి పాటలతో ప్రేక్షకులను అలరించిన సిద్‌ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో సినీ ప్రియులను మెప్పించనున్నారు. రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా విజయ్‌ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓరేయ్‌ బుజ్జిగా’....

Updated : 07 Dec 2022 14:27 IST

ఈ మాయ పేరేమిటో వీడియో చూశారా..!

హైదరాబాద్‌: ‘సామజవరగమన’, ‘ఏమో ఏమో’, ‘మనసా మనసా’లాంటి పాటలతో ప్రేక్షకులను అలరించిన సిధ్‌ శ్రీరామ్ మరోసారి తన గాత్రంతో సినీ ప్రియులను మెప్పించనున్నారు. రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా విజయ్‌ కుమార్ కొండా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓరేయ్‌ బుజ్జిగా’. మాళవిక నాయర్‌ కథానాయిక. హెబ్బాపటేల్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీలో రిలీజ్‌ చేస్తున్నారు. అక్టోబర్‌ 2న ‘ఆహా’లో విడుదల కానున్న ఈ సినిమా నుంచి ‘ఈ మాయ పేరేమిటో’ అనే పాట వీడియోని గురువారం నటి లావణ్య త్రిపాఠి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాటను ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని