Shanti Swaroop: ‘నేను చదివిన అత్యంత విషాదకరమైన వార్తలివే’: శాంతి స్వరూప్ అనుభవాలు
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ తన అనుభవాలను గతంలో కొన్ని ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ (Shanti Swaroop) నేడు కన్నుమూశారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1983 నుంచి 2011 వరకు దూరదర్శన్లో న్యూస్ రీడర్గా పనిచేసిన ఆయన జీవితంలోని అనుభవాలను గతంలో పంచుకున్నారు. ఒకసారి వాటిని గుర్తుచేసుకుందాం.
ఇలా సుపరిచితమయ్యారు..
ఇప్పుడంటే ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఏ వార్త అయినా క్షణాల్లో తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల క్రితం పరిస్థితి వేరు.. అందుకే శాంతి స్వరూప్ (Shanti Swaroop).. గొంతు కోసం కొన్ని లక్షల మంది టీవీలకు అతుక్కుపోయేవారు. సాయంత్రం 7 గంటలకు దూరదర్శన్లో వచ్చే మ్యూజిక్ వింటే చాలు, ఎక్కడున్నా పరిగెత్తుకుని వచ్చేవాళ్లు. అలా మొట్టమొదటి తెలుగు టీవీ న్యూస్ రీడర్గా అందరికీ సుపరిచితమయ్యారు శాంతి స్వరూప్.
అందరూ భయపడ్డారు..
ఇరవై సంవత్సరాలకు పైగా తెలుగు వార్తలు చదివిన వ్యక్తి శాంతి స్వరూప్ ఒక్కరే. న్యూస్ రీడర్గా, వ్యాఖ్యాతగా అందరినీ ఆకట్టుకున్నారు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణ శైలి. తెలుగు భాషపై ఎంత పట్టు ఉందో ఆయన మాటల్లోనే తెలుస్తుంది. అప్పట్లో టెలీప్రాంప్టర్ లేదు. దీంతో స్క్రిప్ట్ పేపర్లనే ఆయన బట్టీ పట్టి చదివేవారు. వార్తలు ప్రారంభమైన పదేళ్లపాటు ఇదే పరిస్థితి. ఆయనెక్కడ తప్పులు చదువుతారో అని అక్కడున్నవారంతా భయపడేవారట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక సందర్భంలో వెల్లడించారు.
సందర్భోచితంగా చదివేవారు..
వార్తలోని భావం ప్రేక్షకులకు అందాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకే ఆయన సందర్భోచితంగా వార్తలు చదివేవారు. ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతున్నట్లుగానో, తోటి వారికి చెబుతున్నట్లుగానో చదివేవారు. అదే ఆయన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది.
శాంతి స్వరూప్ ఎదుర్కొన్న సవాలు..
కేంద్ర ప్రభుత్వం నుంచి పది పేజీల రిపోర్టు ఇంగ్లిషులో ప్రతిరోజూ హైదరాబాద్ దూరదర్శన్కు వచ్చేది. దాన్ని అనువదించి, రికార్డు చేసి ప్రసారం చేసే బాధ్యతను యాజమాన్యం శాంతి స్వరూప్కు అప్పగించింది. ఆ పని చేయాలంటే కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే ఆయన ఆ రిపోర్టును తెలుగులోకి అనువదించకుండా, ఇంగ్లిష్లోనే ముందుగా చదివి అర్థం చేసుకుని వార్తలు చదివేవారు. ఆ పని చేయడం సవాలుతో కూడినది అయినా, ఆయన ఒక్క తప్పు కూడా జరగకుండా చదవడంతో అధికారులంతా ప్రశంసలు కురిపించేవారు.
ఆయన చదివిన అత్యంత విషాదకరమైన వార్తలివే..
ఎన్నో రకాల వార్తలు చదివిన ఆయన రెండు వార్తలను మాత్రం అత్యంత విషాదకరమైనవని చెప్పారు. ‘‘ఇందిరాగాంధీ హత్య వార్త. ఆవిడ ఉదయం చనిపోతే సాయంత్రం వరకు ఆ విషయం వెల్లడించలేదు. ఆ తర్వాత 10 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఆ పది రోజులు టీవీ పెడితే విషాద సంగీతమే వచ్చేది. ఆవిడ పార్దీవదేహాన్ని తెరపై చూపిస్తుంటే వెనకాల నా గొంతు వినిపించేది. అలాగే రాజీవ్గాంధీ మరణవార్త కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇవే నా సర్వీసులో నేను చదివిన విషాద వార్తలు’’ అని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Aamir Khan: ఆ సీన్లో నగ్నంగా నటించాను: ఆమిర్ ఖాన్
రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్ చెప్పారు. -
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
‘పొలిమేర2’ చిత్రం అరుదైన ఘనత సాధించింది. దీంతో నెటిజన్లు చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్స్ ఏర్పాటు చేసిన పార్టీలో ఎన్టీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. -
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
ఏప్రిల్ 28న విడుదలై, ఘన విజయం అందుకున్న టాలీవుడ్ చిత్రాలేంటో చూద్దామా.. -
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
యూపీఐ వచ్చినా క్యాషే కింగ్.. పెరిగిన ఏటీఎం విత్డ్రాలు!
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు