పవన్‌ అతిథిగా సాయితేజ్ చిత్రం

టాలీవుడ్‌ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది. దేవ కట్టా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా నివేదా పేతురాజ్‌ నటించనున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ 14వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో వేడుకగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి...

Updated : 12 Mar 2020 12:27 IST

ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా కొత్త సినిమా ఆరంభమైంది. దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా నివేదా పేతురాజ్‌ నటించనున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ 14వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో వేడుకగా ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమానికి పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా అల్లు అరవింద్‌, వంశీ పైడిపల్లి, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సైతం ఈ వేడుకకు విచ్చేశారు. ముహుర్తపు షాట్‌లో భాగంగా పవన్‌కల్యాణ్‌ క్లాప్‌ కొట్టారు. ఏప్రిల్‌ నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. మణిశర్మ స్వరాలు అందించనున్నారు.

గతేడాది విడుదలైన ‘చిత్రలహరి’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్నారు కథానాయకుడు సాయిధరమ్‌ తేజ్‌. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ తెరకెక్కుతోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయితేజ్‌కు జంటగా నభానటేశ్‌ కనిపించనున్నారు. వేసవి కానుకగా మే 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని